TTD SVIMS | పేద రోగులకు గూగుల్ అండ
టీటీడీ ప్రాణదాన ట్రస్టుకు గూగుల్ సంస్థ టీటీడీకి రూ. కోటి విరాళం ఇచ్చింది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-26 05:46 GMT
తిరుమల అంటే గుర్తుకు వచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామి పేరిట టిటిడి నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ట్రస్టుల్లో కీలకమైనది ఎస్వి ప్రాణదాన ట్రస్టు (Sri Venkateswara pranadaana trust) కూడా ప్రధానమైనది.
టీటీడీ నిర్వహిస్తున్న ఈ ట్రస్టు ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందించడానికి గూగుల్ (Google ) సంస్థ కోటి రూపాయల విరాళం అందించింది. ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ గురువారం ఉదయం విరాళం చెక్కు అందించారు.
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న స్విమ్స్ (Sri Venkateswara institute of medical sciences) ద్వారా ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. దీనిని చిత్తూరు మాజీ ఎంపీ, టిటిడి మాజీ చైర్మన్ డీకే. ఆదికేశవుల నాయుడు స్వయంగా కోటి రూపాయలు మిరియాల ఇవ్వడం ద్వారా ట్రస్టును ప్రారంభించారు.
టీటీడీ నిర్వహిస్తున్న ప్రాణదానం ట్రస్టు ద్వారా సిమ్స్ లో పేద రోగులకు సేవలు అందించేందుకు దాతలు అందించిన విరాళం ద్వారా వచ్చే వడ్డీని వాడుతున్నారు.
ఇది ప్రాణదాన ట్రస్ట్ లక్ష్యం
తిరుపతిలోని స్వీట్స్ ఆసుపత్రిలో చేరే పేద రోగులలో గుండె జబ్బులు, న్యూరాలజీ ఆపరేషన్లు వంటి ఖరీదైన వైద్యం అవసరమైతే ఈ నిధులు వినియోగిస్తారు.
స్విమ్స్ డైరెక్టర్ రోగి వినతిని పరిశీలించి టీటీడీ కార్యనిర్వహణ అధికారికి నివేదిస్తారు. బాధిత రోగికి ఇలాంటి చికిత్స చేయాల్సి వస్తుంది. దీనికి అయ్యే ఖర్చు వివరాలను నివేదిక రూపంలో సిఫారసు చేస్తారు. టీటీడీ ఈవో నుంచి అనుమతి రాగానే ఆ రౌడీకి ఉచితంగా ఖరీదైన వైద్యం అందించడానికి స్విమ్స్ వైద్యాధికారులు చర్యలు తీసుకుంటారు.
తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే సంపన్న యాత్రికులు అందించిన విరాళాలతో ఎస్పీ ప్రాణదాన ట్రస్టు కు వందల కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ఈ కోవలోనే గూగుల్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ తోట చంద్రశేఖర్ కోటి రూపాయల విరాళం చెక్కును తిరుమలలో టిటిడి చైర్మన్ డిఆర్ నాయుడు కలిసి చెక్కు అందించారు. అంతకుముందు ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం వారికి టీటీడీ వేద పండితులు రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వాదం, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.