ఏపీలో కొనసాగిన తిరంగ్ ర్యాలీలు
భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ఏపీలో తిరంగ్ ర్యాలీ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.;
ఆంధ్రప్రదేశ్లో తిరంగ్ ర్యాలీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు శుక్రవారం విజయవాడలో జరిగిన తిరంగ్ ర్యాలీలను ప్రారంభించారు. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూటమి వర్గాలు తిరంగ్ ర్యాలీలు నిర్వహించారు. గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తిరంగ్ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, రామాంజనేయులు, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్లు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కూడా దీనిలో భాగస్వాములయ్యారు. అనంతపురంలో తిరంగ్ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి క్లాక్ టవర్ సప్తగిరి సర్కిల్ వరకు జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.