మదనపల్లె వద్ద.. తెల్లారిన ముగ్గురి ప్రాణాలు
టెంపోను లారీ ఢీకొన్న ఘటనలో కర్ణాటకకు చెందిన 12 మంది గాయపడ్డారు.;
లారీ ఢీకొనడంతో యాత్రికులతో వెళుతున్న టెంపో ట్రావెలర్ సగభాగం తునాతునకలైంది. డ్రైవర్ తో సహా ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మరో పది మందిని చిత్తూరు జిల్లా మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. సోమవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాద స్థలంలో మృతదేహాల వద్ద బంధువుల ఆర్తనాదాలు. గాయపడిన వారు సాయం కోసం కేకలు ఆ ప్రాంతాన్ని విషాదంలో నింపాయి.
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెకు సమీపంలోని కురబాలకోట మండలం చెన్నామర్రిమిట్ట వద్ద సోమవారం వేకువజామున ఈ సంఘటన జరిగింది. మృతులు, తీవ్రంగా గాయపడిన వారు కర్ణాటకకు చెందిన వారంతా కర్ణాటకకు చెందిన వారే.
కర్నాటక ప్రాంతానికి చెందిన యాత్రికులు తిరుమల శ్రీవారి దర్శనానంతరం స్వప్రాంతానికి బయలుదేరారని తెలిసింది. యాత్రికులు ఉన్న టెంపోట్రావెల్ వాహనం తంబళ్లపల్లె సమీపంలో కురబలకోట వద్ద ఉన్న దుమ్మన్నబావి అనే ప్రాంతంలోవ వెళుతోంది. వెనుక నుంచి వచ్చిన లారీ టెంపోను ఢీకొని లాక్కుని వెళ్లడంతో టోంపో కుడి పక్క భాగం అంతా నుజ్జునుజ్జుగా మారిపోయింది. టెంపో డ్రైవర్ డ్రయివింగ్ సీట్ లోనే నలిగి మరణించాడు. లారీ ఢొన్ని ధాటికి టెంపోలో కుడిపక్కన కూర్చుని ఉన్న యాత్రికుల్లో ముగ్గురు మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
కురబలకోట మండలం చెన్నామర్రిమిట్ట హైవేపై సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కర్ణాటక బాగేపల్లికి చెందిన మేఘర్స్ (17 ), చరణ్ ( 17 ) , శ్రావణి ( 28 ) గా గుర్తించినట్లు సీఐ సత్యనారాయణ చెప్పారు. ఈ ప్రమాదంలో 12మందికి తీవ్రంగా గాయడిన వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించామని సీఐ సత్యనారాయణ తెలిపారు.
కలిచివేసే దృశ్యం