రాజుకుంటున్న గొడుగుపేట వెంకటేశ్వరస్వామి భూముల వివాదం
తాము వెంకటేశ్వరస్వామి భక్తులమని, ఎలాంటి తప్పులు చేయమని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు.;
కృష్ణా జిల్లా మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వరస్వామి భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ భూములకు సంబంధించిన లీజు వ్యవహారం అధికార పక్షం టీడీపీ, ప్రతిపక్షం వైసీపీల మద్య విమర్శలకు, ప్రతి విమర్శలకు దారితీసింది. దేవాలయం భూములను తాము కాజేస్తున్నట్లు కావాలనే వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోంటే.. టీడీపీ నేతలు దేవుడి భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే గొడుగుపేట దేవాలయం భూములపై విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు టీడీపీ నాయకుల కన్నుపడిందని, అక్రమ మార్గంలో సీఎం చంద్రబాబు ఈ భూములను వారికి కట్టబెట్టేందుకు కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రులు, వైసీపీ నాయకులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాసులు ఇది వరకే ఆరోపణలు గుప్పించారు.