ఆ రోజు రాత్రంతా లోకేష్, బ్రహ్మణికి నిద్రపట్టలేదు.. ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే లోకేష్, ఆంధ్రాలో ఎన్డీయే అంటే లోకేష్ అని ఢిల్లీ మెల్లిగా ఎస్టబ్లిష్ అవుతున్నారు.;
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన తరువాత ఆయన మాట్లాడిన మాటలు ఆలోచింప చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెబుతున్నారు. లోకేష్ కు, భార్య బ్రాహ్మణికి ప్రధాని చాలా మంచి మాటలు చెప్పడమే కాదు,‘క్రమశిక్షణ నేర్చుకో, ప్రకృతిని గౌరవించు,’ అంటూ దేవాన్స్ కు కూడా ప్రధాన మంత్రి చెప్పారు. ఆయన మే 17న కుటుంబంతో ప్రధానిని కలుసుకున్నారు. చాలా సేపు ప్రధాని నివాసం లో గడిపారు. ఇక ముందు ఆయనే రాష్ట్ర వ్యవహారాల మీద తరచూ ఢిల్లీ వెళతారని ఈ సమావేశం తర్వాత రాష్ట్రంలో చర్చ మొదలయింది. అనుకున్నట్లే ఇయన రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. పలువురు కేంద్రమంత్రులను కలుసుకున్నారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను కూడా కలుసుకుని ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాదిపాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ను కూడా కలుసుకున్నారు. అందువల్ల లోకేష్ ప్రధాని తో జరిపిన సమావేశం బాగా చర్చకు వస్తున్నది రాష్ట్రంలో. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా, ఆంధ్ర ప్రదేశ్ ఎన్డీయే మూల స్థంభంగా లోకేష్ ఢిల్లీలో ఎస్టబ్లిష్ అవుతున్నాడనే చర్చ రాష్ట్రంలో జరుగుతున్నది.
ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గారితో భేటీ అయ్యాను. రాయలసీమలో హైకోర్టు బెంచి ఏర్పాటు ఆవశ్యకతను ఆయనకు వివరించాను. కర్నూలులో హైకోర్టు బెంచి అన్నది అక్కడి ప్రజల చిరకాల కోరిక, ఇందుకు సహకరించండి. న్యాయపరమైన అవసరాల కోసం రాయలసీమ ప్రజలు ఎపి రాజధానికి… pic.twitter.com/e3zaSumCkj
— Lokesh Nara (@naralokesh) June 18, 2025
ప్రధాని చెప్పిన మాటలు మళ్లీ మళ్లీ గుర్తుకు రావడంతో రాత్రి నిద్ర పట్టలేదు. లోకేష్ తో పాటు భార్య బ్రహ్మణి కూడా నిద్రపోలేదు. ఇది కూడా లోకేష్, బ్రహ్మణి ల్లో ఆలోచనకు తెరతీసిందని లోకేష్ మీడియాకు చెప్పారు.
"నిద్ర రాలేదు. రాత్రంతా అవే ఆలోచనలు. 25 ఏళ్లు ముఖ్యమంత్రి, ప్రధాన నమంత్రిగా పనిచేశారు. ఆయన అనుభవాల ముందు మనమెంత, అనుకుంటూ తెల్లవారు ఝామున నిద్రలోకి జారుకున్నాం," అని లోకేష్ చెప్పారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవగానే ముందుగా ఆయన లోకేష్ ను అడిన ప్రశ్న రాష్ట్రంలో ఏమి జరుగుతోందని. అంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ వారిపై కేసులు పెడుతూ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆ విషయం లోకేష్ ప్రధాన మంత్రికి వివరించి ఉంటాడా అనే చర్చ కూడా జరుగుతోంది. ఆయన విలేకరులతో మాట్లాడుతూ, "చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైనే కేసులు పెడుతున్నాం. నిజానికి కక్ష తీర్చుకోవాలంటే చంద్రబాబుకు రెండు నిమిషాలు చాలు. మేము అలా చేయడం లేదు. చట్ట ప్రకారం శిక్ష పడేలా చేస్తున్నాము," అని అన్నారు. అంటే ఈ అంశాలు కూడా ప్రధాని వద్ద చర్చకు వచ్చి ఉంటాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
"ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం వ్యక్తిగత ప్రేరణ. వ్యూహాత్మక రాజకీయ చర్చలు, జాతీయ అభివృద్ధి లక్ష్యాలతో సమన్వయం కలిగిన బహుముఖ సంభాషణ," అని నారా లోకేష్ అభివర్ణించారు . క్రమశిక్షణ, పర్యావరణ గౌరవం, దూరదృష్టి నాయకత్వ విలువలను ప్రధాని నొక్కి చెప్పారు అని ఆయన వెల్లడించారు.
రాజకీయంగా పరిపాలనా పరంగా, జవాబుదారీతనం వంటి కీలక అంశాలను కూటమి ప్రభుత్వం ఎలా గౌరవిస్తున్నది, సవాళ్లను ఎలా చట్టబద్ధంగా ఎదుర్కొంటున్నది లోకేష్ ప్రధానికి వివరించారు.
ఈ సంభాషణ జరిగిన తీరు మీద లోకేష్ చెబుతున్ విషయాలు వింటే ఎన్డీఏలో లోకేష్ కు పెరుగుతున్న స్థానాన్ని, ఆంధ్రప్రదేశ్లో విద్య, నైపుణ్య అభివృద్ధి సంస్కరణలకు ఆయన ఇస్తున్న ప్రాముఖ్యాన్ని హైలైట్ చేసింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ సమావేశం లోకేష్ కు రాజకీయంగా ఆంధ్రాలో కొండంత నైతిక బలాన్ని చేకూర్చింది.
"నేడోె రేపో లోకేష్ పార్టీ పగ్గాలు స్వకరించక తప్పదు. అలాంటపుడు ఎన్డీయే కూటమికి మూలస్తంభంగా ఉన్న ప్రధాని మోదీ ఆశీస్సులు లోకేష్ కు అవసరం. ఈ సత్సంబంధం కోసం లోకేష్ ప్రధాని కలసి ఆయన ఆశీస్సులు, సలహాలు తీసుకుంటున్నట్లు ఉంది," పేరు రాసేందుకు అంగీకరించని టిడిపి నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ఇది ఎంతో ముందుచూపుతో చేస్తున్న కార్యక్రమం అని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, రియల్-టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ 2025 మే 17న న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. అపుడు భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాన్స్తో కూడా ఆయన వెంట ఉన్నారు. ఈ భేటీ లోకేష్ రాజకీయ జీవితంలో కీలక మలుపుగా పరిగణించవచ్చు. ఇది కేవలం సౌహర్ద్ర సందర్శన కాకుండా, లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు బాటవేసే సందర్శన అనుకోవచ్చు. ఆయన పార్టీకి వర్కింగ్ ప్రెశిడెంట్ అవుతారని, తర్వాత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కూడా అవుతారని విశ్వసిస్తున్నవారంతా మోదీ మార్గదర్శనానికి, చర్చలకు చాలా ప్రాముఖ్యం ఇస్తున్నారు.
"లోకేష్ కుమారుడు దేవాన్స్కు క్రమశిక్షణ పాటించాలని, ప్రకృతిని గౌరవించాలని సలహా ఇచ్చారు. ఈ సందేశం మా మీద లోతైన ప్రభావం చూపింది. రాత్రి నిద్ర లేకుండా చేశాయి. 25 ఏళ్లుగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రిగా అనుభవం ఉన్న మోదీ నాయకత్వం, పెద్ద గా రాజకీయాలనుభవం మా కుటుంబాన్ని ఆలోచనలో ముంచెత్తింది,’ లోకేష్ చెప్పారు.ఈ భేటీని తన జీవితంలో ‘కీలక మలుపు’గా వర్ణించారు. మోదీ ప్రేరణను హైలైట్ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను లోకేష్ పంచుకున్నారు.
"ప్రజలచే గౌరవించబడే నాయకుడిగా ఎలా ఎదగాలనే మోదీ సలహాలు అమూల్యం. 25 ఏళ్ల నాయకత్వంలో ఎన్నికల్లో ఓటమి లేని మోదీ రాజకీయ దృష్టి, పనితీరు ఆమోఘం. మోదీ క్రమశిక్షణ, భారతదేశం పట్ల ఆయనకు ఉండే దీర్ఘకాలదార్శనికత మూడవ సారి ప్రధానమంత్రిగా కొనసాగేందుకు దోహదపడ్డారు. ఇది నాకు చాలా ప్రేరణ," అని లోకేష్కు అన్నారు.
లోకేష్ ప్రధానిని దర్శించుకోవడం, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)ను రాష్ట్ర స్థాయిలో బలోపేతం చేయడానికి వ్యూహాత్మక చర్య అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు.
అదే విధంగా పెద్దగా అనుభవం లేని లోకేష్ ని వాత్సల్యం తో చూడటం, ఆయనతో మొక్కబడి గా, ప్రొటోకోల్ ప్రకారం కాకుండా, అభిమానంతో ఎక్కువ సమయం కేటాయించి మాట్లాడానికి ప్రాముఖ్యం ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ఉనికి చాలా కాలం కొనసాగేందుకు ఒక సూచనగా పేర్కొన వచ్చు. మోదీ, చంద్రబాబు రాజకీయ వ్యూహంలో భాగంగా వించాల్సి ఉంటుంది.
ఉత్సాహంతో పనిచేయొచ్చు
"ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలు, సలహాలతో మంత్రి నారా లోకేష్ ధైర్యాన్ని ఇస్తాయి. ఆయన అభి మానుల్లో కూడా ఉత్సాహాన్ని నింపుతాయి. ప్రధాని అండతనకు ఉన్నదన్నభావం లోకేష్ ని నడిపిస్తుంది," సీనియర్ జర్నలిస్ట్ ముదివర్తి వెంకటేశ్వరావు ది ఫెడరల్-ఆంధ్రప్రదేశ్ కి చెప్పారు.
లోకేష్ చేసిన 3,132 కి.మీ. యువగళం పాదయాత్రను డాక్యుమెంట్ చేసిన ‘యువగళం’ కాఫీ టేబుల్ బుక్ ఆవిష్కరించడం, ఆపైన స్వయంగా సంతకం చేసిన కాపీని లోకేష్కు అందజేయడం, ఎన్డీఏ తయారవుతున్న కొత్త తరం ప్రతినిధిగా లోకేష్ గుర్తించడమేనని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి.