టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి అస్వస్థత

టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. సికింద్రాబాద్‌లో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అస్వస్థకు అదే కారణమంటున్న జేసీ అస్మిత్..

Update: 2024-05-15 12:01 GMT

టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆయనకు అక్కడే చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా ఆయనను పరామర్శించడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ రావొద్దని కూడా అస్మిత్ విజ్ఞప్తి చేశారు.

బాష్పవాయువే కారణం

అయితే తాడిపత్రిలో మంగళవారం జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలోనే ఆందోళన కారులను చెదగొట్టడానికి పోలీసులు అనేక మార్గాలను అనుసరించారు. అందులో భాగంగానే వారు బాష్ఫవాయును ప్రయోగించారు. అయితే ఆ వాయువు ప్రభావంతోనే తన తండ్రి అస్వస్థతకు గురయ్యారని, ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ వచ్చిందని అస్మిత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం స్థిమితంగా ఉందని అస్మిత్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News