శ్రీవారి నమూనా హోటల్..మాంసాహార వంటకాలు

రాజమండ్రి వద్ద నిర్వహిస్తున్న హోటల్ పై టీటీడీకి ఫిర్యాదు అందింది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-06-30 14:11 GMT

తిరుమల శ్రీవారి ఆలయ నమూనాతో ఏర్పాటు చేసిన హెటల్ లో మాంసాహార వంటకాలు వడ్డించడంపై వివాదం ఏర్పడింది. దీనిపై జనసేన మండిపడింది. రాజమండ్రికి సమీపంలోని విశాఖమార్గంలో ఉన్న ఆ హోటల్ నిర్వాహకులపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి సోమవారం జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.


తిరుమల ఆలయం

తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన ద్వారం దాటిన తర్వాత బలిపీఠం వస్తుంది. ఆ తర్వాత వెండి వాకిలి, బంగారు వాకిలి చెంతకు వెళ్లగానే జయ విజయులు కూడా ఉండే ద్వారం వద్ద రాముల వారి మీద కులశేఖరపడి కనిపిస్తుంది.
రాజమండ్రిలో...

రాజమండ్రికి సమీపంలోని విశాఖపట్టణానికి వెళ్లే మార్గంలో  రాయుడుగారి మిలటరీ హోటల్ సెట్టింగ్ తిరుమల శ్రీవారి నమూనా ఆలయాన్ని తలపిస్తోంది. హోటల్ లోకి ప్రవేశించగానే ఏడు ద్వారాల తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం కనిపిస్తుంది.

ఈ ప్రాధాన్యతను వివరిస్తూ, ఆ హోటల్ యజమాని ఏమంటున్నారంటే..
" తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రాధాన్యత వుంటుందో మా ఆంధ్ర లార్జెస్ట్ రెస్టారెంట్లో మా వెంకటేశ్వర స్వామికి అంతకు మించి ఎక్కువ ప్రాధాన్యత మేము ఇస్తాం" అని వివరించే నిమిషం నిడివి తో ఉన్న వీడియో వైరల్ అవుతుంది.
"చాలా మంది అడుగుతున్నారు ఈ హోటల్ ఐడియా మీకు ఎలా వచ్చింది" అని ఆ హోటల్ యజమాని గుర్తు
ఈ ఐడియా రావడానికి ముఖ్య కారణం...తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఓ ప్లజెంట్ నెస్ఉం టుంది. ఆ తరహాలోనే ఇక్కడ వచ్చి భోజనం చేయాలని అనుకున్నాం. అందుకే తిరుమల తరహా లోనే రిప్లై ఏర్పాటు చేశాం" అని ఆ ప్రతినిధి వివరించడంతోపాటు మధ్యలో తిరుమల అన్నదాన సత్రం లో శ్రీవారి సేవకులు ప్రసాదాలు వడ్డించే వీడియో
క్లిప్పింగ్ వాడారు. 
వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టి నాన్ వెజ్ ఎందుకు వడ్డిస్తున్నారు? అనే మాటను కూడా చాలామంది అడిగిన విషయాన్ని ఆ వ్యక్తి ఆ వీడియోలో ప్రస్తావించారు.

"మేము చాలా చాలా భక్తిశ్రద్ధలతో వెంకటేశ్వర స్వామి వారిని పరిగణిస్తున్నాం. అంతే శ్రద్ధతో స్వామివారి విగ్రహం ఏర్పాటుచేసిన టేబుల్స్ పై వెజిటేరియన్ వంటకాలు, భోజనం మాత్రమే వడ్డిస్తున్నాం" అని ఆ ప్రతినిధి వివరణ కూడా ఇచ్చారు. హోటల్కు వచ్చే ప్రతి కస్టమర్ ఇక్కడ స్వామివారి ఫోటో ముందు ఫోటోలు దిగి వెళుతుంటే చాలా హ్యాపీగా ఉంది అని కూడా తన మనసులోని మాటను చెప్పారు.
తమ హోటల్ లో భోజనం చేసే కస్టమర్లు
"మీ దగ్గర ఫుడ్ ఎంత బాగుందో.. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఇంకా బాగున్నారు" అని చెబుతుంటే మా కష్టమంతా మరిచిపోయి ఆనందానికి గురవుతున్నాము అని ఆ ప్రతినిధి ఆ వీడియోలో ముక్తాయంకు ఇచ్చారు. ఇదిలా ఉండగా..
సెంటిమెంట్ తో ఆటలా..
శ్రీవారి అంటే కోట్లాదిమంది భక్తులకు ఆరాధ్య దైవం. శ్రీవారి గర్భాలయ నమూనాతో హోటల్ నిర్వహించడం అంటే భక్తుల సెంటిమెంట్తో ఆడుకోవడమేనని జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాఖ హైవే దగ్గర శ్రీవారి ఆలయ నమూనాతో ఏర్పాటుచేసిన రాయుడు మిలిటరీ హోటల్ పై చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి తిరుమలలో సోమవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు.
రాయుడు మిలిటరీ హోటల్లో శ్రీవారి ఆలయ నమూనా వీడియోలను కూడా లాప్టాప్ లో కిరణ్ రాయల్ తో పాటు సుభాషిణి వీడియోలను చూపించారు. సొంత వ్యాపారాల కోసం శ్రీవారి ఆలయ సెట్టింగ్ వేయడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సనాతన ధర్మం కాపాడడం కోసం జనసేన కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆలయ సెట్టింగ్తో హోటల్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు టిటిడి అదనపు ఈఓ వెంకయ్య చౌదరిని కోరారు. ఆ మేరకు అభివృద్ధి పత్రం కూడా సమర్పించారు.
శ్రీవారి విగ్రహం లేదా ఆలయ నమూనాలతో సంప్రదాయాలను అవమానించే విధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని వారు టిటిడి అధికారులను కోరారు. విశాఖ తరహా హోటల్ నిర్వహణ పునరావృతం కాకుండా విజిలెన్స్ స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయాలని జనసేన నాయకులు సూచించారు.

Similar News