మంగళగిరి నియోజకవర్గంలో స్కిల్‌ సెన్సస్‌

పైలట్‌ ప్రాజెక్టుగా మంగళగిరిలో అమలుకు యంత్రాంగం సర్వసన్నద్ధం.

Update: 2024-10-04 11:50 GMT

స్కిల్‌ సెన్సస్‌ ప్రాజెక్టుకు మంగళగిరి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి శ్రీకారం చుట్టారు. పైలట్‌ ప్రాజెక్టుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంతోపాటు తుళ్లూరు మండలంలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. 100 గ్రామ సచివాలయాల పరిధిలో సెన్సెక్స్‌ సేకరణకు సంబంధించిన లాగిన్‌ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో 1,35,914 గృహాలు, తుళ్లూరు మండలంలో 25,507 గృహాల వివరాలను సేకరించనున్నారు. అంటే మొత్తం 1,61,421 కుటుంబాల నుంచి డిటెయిల్స్‌ సేకరించనున్నారు. దీని కోసం 675 మంది ఎన్యుమరేటర్లు క్షేత్ర స్థాయిలో పని చేయనున్నారు. దీనికి అవసరమైన మొబైల్‌ యాప్‌ సిద్ధంచేశారు. ఎన్యుమరేటర్ల శిక్షణ కూడా పూర్తయింది. ఫీల్డ్‌ టీమ్స్‌ కు సహాయం చేసేందుకు టెక్నికల్‌ టీమ్‌ లను కూడా ఏర్పాటుచేశారు. ఇప్పటికే ఎన్యుమరేటర్లు, కుటుంబాలకు సంబంధించిన మ్యాపింగ్‌ పూర్తయింది. వార్డు, గ్రామసచివాలయాల సిబ్బందితో పాటుగా, స్కిల్‌ డెవల్‌ మెంట్‌ శాఖ, సీడాప్, న్యాక్‌ విభాగాల సిబ్బంది కూడా ఈ నైపుణ్య గణనలో భాగస్వామ్యం కానున్నారు. ఈ కార్యక్రమాన్ని స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ హెడ్‌ క్వార్టర్‌ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తారు. పైలట్‌ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు ఉంటే వాటిని గుర్తించి, పరిష్కరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా స్కిల్‌ సెన్సస్‌ ప్రక్రియను ప్రారంభిస్తారు.

Tags:    

Similar News