Operation Sindhur |కల్లి తండకు వీరజవాన్ పేరు..
శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో వీరజవాన్ తల్లిదండ్రులకు మంత్రి సవితమ్మ రూ. 50 లక్షల చెక్కుఅందించారు.;
ఆపరేషన్ సింధూర్ యుద్ధంలో వీరమరణం చెందిన మురళీనాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షలు మంజూరు చేసింది. రాష్ట్ర బిసి సంక్షేమం, జౌళి, టెక్స్ టైల్స్ శాఖా మంత్రి ఎస్. సవితమ్మ సోమవారం నాయక్ తల్లిదండ్రులకు సోమవారం అందించారు.
గోరంట్ల మండలం కల్లి నాయక్ తండకు సోమవారం ఉదయం వెళ్లిన మంత్రి సవితమ్మ వీరజవాన్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆ తరువాత ఐదెకరాలు వ్యవసాయ భూమి, ఆరు సెంట్ల ఇంటి స్థలం పత్రాలు నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాంనాయక్ కు అందించారు. గ్రామస్థుల అభ్యర్థన మేరకు వీర జవాన్ స్వగ్రామమైన కల్లి తడాకు వీరజవాన్ పేరు పెట్టడానికి చర్యలు చేపట్టామన్నారు.
ఆపరేషన్ సింధూర్ లో కాశ్మీర్ వద్ద మురళీనాయక్ వీరమరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయం కల్లి తండాకు తీసుకుని వచ్చిన తరువాత అధికార లాంఛనాలతో నిర్వహించిన నాయక్ అంత్యక్రియలకు మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరై, నివాళులర్పించారు. ఆ సమయంలో