అమెరికా బాంబుదాడులపై మంగళగిరిలో నిరసన
ఇరాన్ పై అమెరికా బాంబు దాడులను ఖండిస్తూ మంగళగిరిలో వామపక్ష పార్టీల నిరసన;
By : The Federal
Update: 2025-06-23 09:30 GMT
ఇరాన్ పై అమెరికా బాంబు దాడులు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం మంగళగిరిలో సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేసి మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా అమెరికా చర్యను వ్యతిరేకించాలని పిలుపు నిచ్చారు. అమెరికా, ఇజ్రాయిల్ అనుకూల వైఖరిని విడనాడాలని కోరారు.
అంతర్జాతీయ ఉద్రిక్తతలను మరింత పెంచడమే కాకుండా పశ్చిమ ఆసియా అస్థిరతకు దారి తీసే విధంగా అమెరికా సైనిక చర్యలు ఉన్నాయని అన్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రపంచ మేధావులు పూనుకోవాలని కోరారు. కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.