కర్నూలులో కాలుమోపిన ప్రధాని మోదీ
శ్రీశైలం మల్లన్న సన్నిధిలో తరించనున్న ప్రధాన మంత్రి మోదీ
By : The Federal
Update: 2025-10-16 05:02 GMT
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్నూలుకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో కర్నూలు
విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, అధికారులు, మంత్రులు, ఎంపీలు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.
ఇక్కడ నుంచి ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంటకు చేరుకున్నారు. ఆయనతో పాటు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. ఒకే హెలికాఫ్టర్ లో వీరు ఇక్కడకు చేరారు.
శ్రీశైలం మల్లికార్జునస్వామి, శ్రీభ్రమరాంబ దర్శనం చేసుకుంటారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం వరకు అంటే మధ్యాహ్నం 12:05 వరకు శ్రీశైలం మల్లన్నస్వామి సన్నిధిలోనే ప్రధాన మోదీ గడపనున్నారు. దర్శనాలు, పూజలు అన్నీ పూర్తి అయిన తర్వాత అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో నన్నూరుకు చేరుకుంటారు. అనంతరం రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభకు హాజరవుతారు.