గుంజీలు తీసిన హెడ్మాస్టర్‌ను మంత్రి లోకేష్‌ మెచ్చుకున్నారు

సహజంగా..చదవడం లేదని, మాట వినడం లేదని పిల్లలను టీచర్లు గుంజీ లు తీయిస్తారు. గోడ కుర్చీలు వేయిస్తారు. కానీ ఆ హెడ్మాస్టర్‌ వెరీటీగా తనకు తానే శిక్షించుకున్నారు.;

By :  Admin
Update: 2025-03-13 12:11 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఓ వింత నిరసన వ్యక్తం అయింది. సహజంగా తమ పిల్లలను ఉపాధ్యాయులు తిట్టారనో, కొట్టారనో, పాఠాలు సరిగా చెప్పడం లేదనో, టీచర్లు బడికి సరిగా రాలేదనో పిల్లల తల్లిదండ్రులు, స్థానికులు నిరసనలు తెలుపుతారు. కానీ అందుకు భిన్నంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడే నిరసనలు తెలిపారు. విద్యార్థులు మాట వినడం లేదని వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేశారు. పాఠశాలలోని పిల్లలందరి ముందు ఆ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు గుంజీలు తీశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ హైస్కూలు ఈ వినూత్నమైన సంఘటన చోటు చేసుకుంది.

పాఠశాలలో, చదువులో ప్రోగ్రెస్‌ సరిగా లేదని, సరిగా చదవడం లేదని, దీనికి తోడు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినడం లేదని చెబుతూ ఆ పాఠశాల హెడ్మాస్టర్‌ చింత రమణ గుంజీలు తీసి నిరసన తెలిపారు. ఆ పాఠశాల పిల్లలందరినీ ఒక దగ్గరు చేర్చి వారు ముందే తనను తాను శిక్షించుకున్నారు. ఆ విద్యార్థుల ముందే గుంజీలు తీశారు. వినూత్న, వెరైటీ పద్ధతిలో నిరసనలు తెలిపిన ఆ వీడియో తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో బాగా వైరల్‌గా మారింది. అటు ఉపాధ్యాయ వర్గాల్లోను, ఇటు పిల్లల తల్లిదండ్రుల్లోను చర్చనీయాంశంగా మారింది.

అంతేకాకుండా అది చివరికి ఆంధ్రప్రదేశ్‌ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌కు చేరింది. దీనిపైన లోకేష్‌ స్పందించారు. విద్యార్థులు మాట వినడం లేదని హెడ్మాస్టర చేసిన పని బాగుందని అభినందించారు. మీ ఆలోచన బాగుందని కితాబిచ్చారు. అంతా కలిసి విద్యా వ్యవస్థను బోలపేతం చేసేందుకు కృషి చేద్దామని చెప్పారు.
మంత్రి లోకేష్‌ ఏమి చెప్పారంటే..
విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పెంట జెడ్పీ హైస్కూల్‌ హెడ్మాస్టర్‌ చింత రమణ, ఆ పాఠశాల పిల్లల విద్యా పురోగతి అంతంతమాత్రంగా ఉందని, చెప్పిన మాట వినడంలేదని.. విద్యార్థులను దండించకుండా, గుంజీలు తీసిన వీడియో సోషల్‌ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. హెడ్మాస్టరు గారూ! అంతా కలిసి పనిచేసి, ప్రోత్సాహం అందిస్తే మన ప్రభుత్వ పాఠశాలల పిల్లలు అద్భుతాలు సృష్టిస్తారు. వారిని దండించకుండా అర్థం చేసుకునేలా మీ స్వీయ క్రమశిక్షణ చర్య ఆలోచన బాగుంది. మీకు అభినందనలు. అందరం కలిసి విద్యాప్రమాణాలు పెంచుదాం. పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషి చేసి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం. అంటూ మంత్రి నారా లోకేష్‌ పిలుపునిచ్చారు.
Tags:    

Similar News