ఢిల్లీలో లోకేష్ బిజీ బిజీ
ఢిల్లీ పర్యనటలో ఉన్న మంత్రి నారా లోకేష్ కేంద్ర హోం మంత్రి అమిత్షాతో మాజీ సీఎం జగన్ వ్యవహారాల మీద చర్చంచనున్నట్లు సమాచారం.;
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సాధించిన విజయాలను పంచుకున్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి ధన్కర్ స్పందిస్తూ.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో సీఎం చంద్రబాబు ఎప్పుడూ అందరి కూంటే ముందుంటారని కితాబిచ్చారు.
అమరావతి నిర్మాణంపైన ఉప రాష్ట్రపతి ధన్కర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. రూ. 64వేల కోట్లతో అమరావతిలో డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయని, వేగవంతంగా వాటిని పూర్తి చేస్తామని లోకేష్ ఉపరాష్ట్రపతికి వివరించారు. బుధవారం మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్షాతో లోకేష్ భేటీ కానున్నారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురి నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు వస్తున్న వార్తలపై అమిత్షాతో లోకేష్ చర్చించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో తెరపైకి వచ్చిన లిక్కర్ స్కామ్ గురించి కూడా అమిత్షాతో చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించిన వ్యవహారాలపైన కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని టీడీపీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్ కేంద్ర హోం మంత్రి అమితషాతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. భారత ఉపరాష్ట్రతితో భేటీ అయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా లోకేష్ పంచుకున్నారు.
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారితో ఈరోజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యాను. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏడాదిపాలనలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాను. మరింత వేగవంతమైన అభివృద్ధికి మీ వంతు సహాయ, సహకారాలను అందించాలని కోరాను.… pic.twitter.com/3ivBhzEhBL
— Lokesh Nara (@naralokesh) June 18, 2025