మెట్రో రైలు ప్రాజెక్టులకు రుణాలు
విజయవాడ,విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్న విదేశీ బ్యాంకులు.;
By : The Federal
Update: 2025-05-14 08:11 GMT
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ రెండు నగరాల్లో మెట్రో ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వేగంగా అడుగులేస్తోంది. అందులో భాగంగా వివిధ బ్యాంకుల ప్రతినిధులతో ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్టారెడ్డి బుధవారం సమావేశమయ్యారు. కేఎఫ్డబ్ల్యూ, ఏఎఫ్డీ, ఏపీబీడీ, ఎన్డీబీ, ఏఐఐబీ, జైకా, ప్రపంచ బ్యాంకుల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
విజయవాడలో నిర్మించాలని ప్రతిపాదిత మెట్రో కారిడార్లను బ్యాంకుల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విశాఖపట్నం, విజయవాడ రెండు మెట్రో ప్రాజెక్ట్లకు అయ్యే వ్యయంలో రూ. 12000 కోట్లు రుణం అవసరం అవుతుందని అంచనా వేశారు. విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు రూ. 6100 కోట్లు, విజయవాడ మెట్రోకు రూ. 5900 కోట్లు రుణం సమీకరించాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు వివిధ విదేశీ బ్యాంకులు ఆసక్తి కనబరుస్తున్నాయి. తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చే బ్యాంకులతో మెట్రో కార్పొరేషన్ ఎండీ కృష్ణారెడ్డి బ్యాంకుల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో బ్యాంకుల ప్రతినిధులు చర్చలు జరపనున్నారు.