ఆంజనేయస్వామికి అపూర్వ వజ్రం సమర్పించిన అజ్ణాత భక్తుడు

దొరికిన వజ్రాన్ని ఓ భక్తుడు హుండీలో కానుకగా సమర్పించిన ఘటన కడప జిల్లా రాజంపేటలో చూసింది.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-06-20 12:55 GMT
రాజంపేట పట్టణంలోని వీరాంజనేయస్వామి ఆలయం. ఇన్ సెట్) వజ్రం చుట్టిన కవర్

దారిలో వెళ్తుంటే రూపాయి దొరికితేనే పరమానంద పడిపోతాం. అలాంటిది, తనకు దొరికిన వజ్రాన్ని ఓ అజ్ఞాత భక్తుడు ఆంజనేయస్వామి వారి హుండీకి సమర్పించాడు. ఆలయ అధికారులును ఉద్దేశించి ఓ లేక కూడా ఆ అజ్ఞాత భక్తుడు రాశాడు.


"ఈ వజ్రం నాకు దొరికింది. దీని నేను విక్రయించలేను. అలాగని భరించలేను" అని ఆ అజ్ఞాత భక్తుడు రాసిన లేఖలో స్పష్టం చేశారు.
"హుండీ కానుకలు లెక్కించే సమయంలో ఈ ముడి వజ్రం బయటపడింది" అని ఆలయ ఈవో కొండారెడ్డి చెప్పారు..
ఉమ్మడి కడప జిల్లా (అన్నమయ్య జిల్లా) రాజంపేట పట్టణంలో నాలుగు రోడ్ల కూడల నుంచి కడపకు వెళ్లే మార్గంలో అత్యంత పురాతన ఆంజనేయస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలో హుండీ లభించిన కానుకలు ఉలెక్కిస్తుండగా ఆకుపచ్చ వస్త్రంలో దారం చుట్టి, లక్కతో సీల్ వేసిన ఓ కవర్ బయటపడింది.
బయటపడిన వజ్రం

ఆ కబురు పూర్తిగా తెరిచి చూసిన అక్కడి సిబ్బంది, ఒత్తులు జీవో కొండారెడ్డి కూడా ఆశ్చర్యానికి పోయారు. ఆ కవర్లో 1.39.6 క్యారెట్ల వజ్రం ఉన్నట్లు అర్థమైంది. ఓ అజ్ఞాత భక్తుడు వదిన లేఖ వల్ల అది వజ్రం అని తెలుసుకున్నారు. ఆ భక్తుడు వదిన లేఖను పరిశీలించగా..
"ఈ డైమండ్ నాకు దొరికింది. దీనిని విక్రయించలేను. అలాగని దీనిని నేను భరించలేను. వస్తువు తయారు చేసి ఇచ్చే శక్తి నాకు లేదు. అందుకే హుండీలో వేస్తున్నాను" అని ఆ భక్తుడు రాసిన లేఖలో స్పష్టం చేశారు ఈ వజ్రం స్వామి వారి సేవకు ఉపయోగపడేలా చూడండి అని అభ్యర్థించారు.
అజ్ఞాత భక్తుడు అందించిన వజ్రం తో పాటు, దాని పరిమాణం, ఎన్ని క్యారెట్లు ఉందనే విషయాన్ని నిరూపించే పత్రం కూడా ఆ అజ్ఞాత భక్తుడు హుండీలో వేయడం గమనార్హం.

Similar News