బనకచర్ల కోసం జలహారతి కార్పొరేషన్
బనకచర్లతోపాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేలా కార్పొరేషన్ కు బాధ్యతలు అప్పగించిన ఏపీ ప్రభుత్వం;
By : V V S Krishna Kumar
Update: 2025-06-26 08:53 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకంగా జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ (Jalaharati Corporation Limited)ను ఏర్పాటు చేసింది.ఈమేరకు జీవో జారీ చేసింది. ఈ కార్పొరేషన్ విజయవాడ కేంద్రంగా పనిచేస్తుందని ప్రభుత్వం పేర్కొంది.విజయవాడలో జలవనరుల శాఖ కార్యాలయంలో ‘జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ 'ఏర్పాటైంది.పోలవరం - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ కార్పొరేషన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే బనకచర్లతోపాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేలా ఈ సంస్థకు బాధ్యతలు అప్పగించారు.
బనకచర్ల నిర్మాణంపై కొన్ని రోజులుగా తీవ్ర చర్చజరుగుతోంది.ఏపీ ప్రభుత్వం చేపడుతున్నఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.తెలంగాణ కు అన్యాయం జరిగే ఈ ప్రాజెక్టును తాము న్యాయ పరంగా అడ్డుకుంటామని తెలంగాణ మంత్రులుప్రకటించారు.అయితే వృధాగా సముద్రంలో కలిసే గోదావరి వరద జలాలను మాత్రమే తాము వినియోగిస్తామని తేల్చి చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచర్ల నిర్మాణానికే ముందుకు వెళుతున్నారు.ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టు కోసం తాజాగా జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ని ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది.రాయలసీమ, పల్నాడు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించడమే జలహారతి కార్పొరేషన్ ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.