మహిళను చెట్టుకు కట్టేసి కొడతారా? రక్షణ అంటే ఇదేనా?

సీఎం చంద్రబాబు దుర్గాపు పాలనకు కుప్పం ఘటన నిదర్శనమని జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.;

Update: 2025-06-17 13:42 GMT

కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టి, హింసించిన ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు.. మీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? అంటూ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో, సీఎం చంద్రబాబు పాలనలో మహిళలకు ఆత్మగౌరవం కరువైందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నియోజక వర్గం కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటనపై సోషల్‌ మీడియా వేదికగా జగన్‌ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అఘాయిత్యాలకు కుప్పం దుర్ఘటనే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజక వర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన మీ దుర్మార్గపు పాలనకు నిదర్శనమని సీఎం చంద్రబాబుపై జగన్‌ మండిపడ్డారు.

జగన్‌ ఏమన్నారంటే..
గారూ.. రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా? మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే. తిమ్మరాయప్ప అనే కూలీ అప్పు చెల్లించలేదనే కారణంతో అతని భార్య శిరీషను మీ పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి, హింసించాడు. ఆమె బిడ్డలు రోదిస్తున్నా సరే కనికరం చూపలేదు, విడిచిపెట్టలేదు. చంద్రబాబుగారూ.., మీ హయాంలో జరిగిన అనేక క్రూరమైన ఘటనల్లో ఇదొకటి. పొలిటికల్‌ గవర్నెన్స్, రెడ్‌బుక్‌ పేరిట మీరు నెలకొల్పిన దుష్ట సంప్రదాయంలో భాగంగా మీరు, మీ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తున్న దుర్మార్గాలకు మహిళలు, యువతులు, బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు.
ఈ ఘటనతోపాటు, ఏడాదికాలంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై జరిగిన అన్యాయాలు, అఘాయిత్యాలను సీరియస్‌గా తీసుకోవాలని, చట్టప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాను. అంటూ సోషల్‌ మీడియా వేదికగా జగన్‌ ట్వీట్‌ చేశారు.



Tags:    

Similar News