కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలన్నట్టుగా ఉంది

లడ్డూ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకొని సుప్రీం కోర్టు విచారణ జరపాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి కాంగ్రెస్‌ పార్టీ లేఖ రాసిందని వైఎస్ షర్మిల చెప్పారు.

Update: 2024-10-02 12:27 GMT

తిరుమల లడ్డూ వివాదం అంశంపై సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చూస్తోంటే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని సుప్రీం కోర్టు అన్నట్టుగా ఉందని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఆమె బుధవారం విశాఖలో మాట్లాడుతూ లడ్డూ తయారీలో నెయ్యి కల్తీపై సీబీఐ విచారణ జరిపించాలని అందరి కంటే తామే ముందు అడిగామని, అంతేకాకుండా రాష్ట్ర గవర్నర్‌ను కూడా కోరామన్నారు.

తిరుపతి తిరుమల లడ్డూ వివాదం వ్యవహారాన్ని సుప్రీం కోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరపాలని సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు కూడా కాంగ్రెస్‌ పార్టీ లేఖ రాసిందన్నారు. ఈ అంశంలో కాంగ్రెస్‌ పార్టీతో సుప్రీం కోర్టు కూడా ఏకీభవిస్తోందన్నారు. లడ్డూ వివాదాన్ని రాజకీయం చేయొద్దని కాంగ్రెస్‌ కోరిందని, అయినా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మాజీ సీఎం జగన్‌ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఒకరేమో శాంతి పూజలు అంటున్నారని, మరొకరు పశ్చాత్తాప దీక్షలంటున్నారని, ఇంకొకరు ప్రక్షాళన పూజలు అంటున్నారని విమర్శించారు. ఒక్కొక్కరు ఒక్కో పేరుతో ఈ అంశానికి మతం రంగు పులుముతున్నారని విమర్శించారు. గాంధీ జయంతి సందర్భంగా విశాఖలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు.

Tags:    

Similar News