విశాఖ ఆర్ కె బీచ్ లో యోగ సందడి (ఫోటో గ్యాలరీ)
ఆర్ కె బీచ్ లో 3 లక్షల మంది యోగాసనాలు;
By : The Federal
Update: 2025-06-21 06:21 GMT
ప్రధానమంత్రి మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి నిర్వహించారు. విశాఖ ఆర్ కె బీచ్ లో జరిగిన ఈ కార్యక్ర మంలో సుమారు 3 లక్షలకు పైగా ప్రజలు పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫోటోలు.
"యోగా ఫర్ వర్ ఎర్త్, వన్ హెల్త్ " అనే నినాదంతో జరుపుకునే ఈ కార్యక్రమం యోగాంధ్ర అభియాన్ పరాకాష్టగా నిలిచింది. ప్రపంచం మీద, సమగ్ర శ్రేయస్సుమీద యోగా చూపే ప్రభావాన్ని హైలైట్ చేస్తూన్నందుకు ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలను మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు.