నిరుద్యోగులకు తెలంగాణా ప్రభుత్వం గుడ్ న్యూస్

గ్రూప్-1 మెయిన్ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది. ఈనెల 21 నుండి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు చెప్పింది.

Update: 2024-10-09 11:06 GMT

తొందరలోనే తెలంగాణా గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు జరపాలని తెలంగాణా పబ్లిక్ సర్వీసు కమీషన్(టీజీపీఎస్సీ) డిసైడ్ చేసింది. గ్రూప్-1 మెయిన్ పరీక్షల షెడ్యూల్ ను ప్రకటించింది. ఈనెల 21 నుండి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు చెప్పింది. మధ్యాహ్నం 2 గంటల నుండి ఐదు గంటలవరకు పరీక్షలు జరగబోతున్నాయి. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతున్నా అభ్యర్ధులను అర్ధగంట అంటే 12.30 గంటలకే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించాలని కూడా కమీషన్ నిర్ణయించింది. ఒకటిన్నర తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్ధులను అనుమతించరు. ఈనెల 14వ తేదీ నుండి కమీషన్ వెబ్ సైట్ లో అభ్యర్ధులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించేది లేదని కమీషన్ స్పష్టంగా ప్రకటించింది.

Tags:    

Similar News