మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గురువారం సీఎం ప్రత్యేకంగా మూడు గంటలపాటు మంత్రుల బృందం,అధికారులుతో చర్చిచండం జరిగిందని తెలిపారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ ఆర్ధికపరైన అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని చెప్పారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన అంశాలను పరిష్కరించే దిశలో ప్రభుత్వం తగిన కసరత్తు చేస్తోందని తెలిపారు. అందుకు సంబంధించి ఇప్పటికే జెఎస్సీ సమావేశం నిర్వహించగా మరలా మంత్రుల బృందం సమావేశం ద్వారా ఉద్యోగుల సమస్యలన్నిటనీ తెల్సుకోవడం జరిగిందని అన్నారు. ఈరోజు శనివారం  సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్యాంపు కార్యాలయంలో మంత్రుల బృందం, అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించనున్నారని ఈసమావేశానికి ఉద్యోగ సంఘాల అధ్యక్షులు కూడా హాజరు కావాలని కోరారు.
ఈసమావేశంలో సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్ కుమార్, పిఆర్ అండ్ ఆర్డి ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్, ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావు, ఐటి శాఖ కార్యదర్శి కె.భాస్కర్, ఆర్థికశాఖ కార్యదర్శి వినయ్ చంద్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్, సిడిఎంఏ జి.సంపత్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈసమావేశంలో గుర్తింపు పొందిందిన ఉద్యోగ సంఘాల అధ్యక్షులు,కార్యదర్శులు పాల్గొన్నారు. ఏపీ ఎన్జీవో అధ్యక్షులు ఎ.విద్యాసాగర్,ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరి యు.మనోహర్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎస్టియు సాయి శ్రీనివాస్, పిఆర్టియు నాయకుడు ఎం.కృష్టయ్య, యుటిఎఫ్ నాయకులు  ఎన్.వెంకటేశ్వర్లు, ఎపిటిఎఫ్ నేత జి.హృదయరాజు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ కె.ఆర్ సూర్య నారాయణ, ఏపీ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఎస్.బాలాజి, ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ నాయకుడు టివి.ఫణిపేర్రాజు, ఏపీ గవర్నమెంట్ వెహికల్ డ్రైవర్స్ సెంట్రల్ అసోసియేషన్ నాయకుడు ఎస్.శ్రీనివాసరావు, ఆల్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లాస్ 4 ఎంప్లాయిస్ సెంట్రల్ అసోసియేషన్ నాయకుడు ఎస్.మల్లేశ్వర రావు, ఏపీ  స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు పిఎస్ఎన్ శాస్త్రి, ప్రసాద రావు, స్టేట్ గవర్నమెంట్ ఫెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు, ఆయా సంఘాల కార్యదర్శులు  పాల్గొన్నారు.