యూరియాను అధికంగా వాడటం వల్ల క్యాన్సర్‌ వస్తుంది

యూరియా వాడని రైతులకు బస్తాకు రూ. 800 ప్రొత్సాహకం ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.;

Update: 2025-09-15 08:43 GMT

యూరియాను ఎక్కువుగా వాడటం వల్ల క్యాన్సర్‌ వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం ప్రారంభమైన కలెక్టర్స్‌ కాన్ఫరెన్స్‌లో యూరియా సరఫరాపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. యూరియా వాడకటంపై రైతులలో చైతన్యం తీసుకొని రావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం క్యాన్సర్‌ అనేది రోగాల జాబితాలో టాప్‌–5లో ఉందని, యూరియా వాడకటం ఇలానే కొనసాగితే క్యాన్సర్‌లో ఏపీ నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకుటుందన్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తంచి వచ్చే ఏడాది నుంచి అవసరమైన మేరకే యూరియాను వినియోగించే విధంగా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. యూరియా ఎక్కువుగా వాడితే పంట దిగుబడి పెరుగుతుందని అనుకోవడం మంచిది కాదని, యూరియాకి బదులుగా మైక్రో న్యూట్రియంట్స్‌ సప్లిమెంట్స్‌ కింద ఇవ్వాలన్నారు. ఈ విధానంపై పంజాబ్‌ను కేస్‌ స్టడీగా చూడాలని సూచించారు.

ఇంకా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగం తగ్గిస్తే మంచిదని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రొత్సహాకాలు ప్రకటించారు. దీనికి సంబంధించిన విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని సీఎం వెల్లడించారు. యూరియా వాడని రైతులకు బస్తాకు రూ. 800 ప్రొత్సాహకం ఇస్తామని పేర్కొన్నారు. పీఎం ప్రణామ్‌ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని రైతులకే ఇచ్చేద్దామని అధికారులకు సూచించారు. యూరియా కొరత లేదు. అవసరమైతే యూరియాను డోర్‌ డెలివరీ చేద్దామని సూచించారు. నియోజకవర్గానికో యానిమల్‌ హాస్టల్‌ నిర్మాణం చేపట్టాలి. అర్బన్‌ నియోజకవర్గాలను మినహాయించి 157 నియోజకవర్గాల్లో యానిమల్‌ హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలి. గోశాలల నిర్మాణం వల్ల పశు సంపద రాష్ట్రానికి రిటన్‌ గిఫ్ట్‌ ఇస్తోందన్నారు. జీఎస్డీపీ వృద్ధిలో లైవ్‌ స్టాక్‌ పాత్ర కీలకంగా ఉంది. పాడి పరిశ్రమ అనేది చక్కటి ఆదాయ మార్గంగా ఉంటుంది. దాణా ఉత్పత్తిని డ్వాక్రా గ్రూపులకు అనుసంధానం చేస్తే వారికి మంచి ఆదాయం వచ్చేలా చేయగలం. అర్బన్‌ ఏరియాలో రెండు సెంట్లు, రూరల్‌ ప్రాంతంలో మూడు సెంట్లు ఇవ్వాలి. అర్బన్‌ ప్రాంతాల్లో భూ లభ్యత లేకుంటే గ్రూప్‌ హౌసింగ్‌ విధానాన్ని అవలంభించాలి. సెంట్‌ పట్టా తీసుకోవడానికి ఆసక్తి చూపకపోతే... ఆ భూమిని పరిశ్రమలకు కేటాయించండి. సెంట్‌ పట్టా తీసుకోవడానికి ఆసక్తి చూపని లబ్దిదారులకు ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త ఉచిత ఇళ్ల పట్టాల పథకంలో చోటు కల్పించండి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఏపీలో 5 లక్షల ఎకరాల్లో ఆక్వా కల్చర్‌ ఉంది. రూ. 1.50కే యూనిట్‌ విద్యుత్‌ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. రాయితీ విద్యుత్‌ అందించేందుకు జోన్‌–నాన్‌ జోన్‌ కింద విభజించారు. నెల రోజుల్లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారికి రూ. 1.50కు యూనిట్‌ విద్యుత్‌ అందివ్వాలి. ఆక్వా ఉత్పత్తులకు ట్రేసబులిటీ, సర్టిఫికేషన్‌ కంపల్సరీ. ఆక్వా కల్చరును ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, పౌల్ట్రీ వేస్ట్‌ ఇష్టానుసారంగా పడేయకుండా చూసుకోవాలని సీఎం సూచించారు.
Tags:    

Similar News