శ్రీవారిని దర్శించుకుని వస్తుండగా.. వెంటాడిన మృత్యువు
బస్సు ఢీకొని కళ్ల ముందే తల్లి మృతి. ఇద్దరికి గాయాలు;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-30 15:35 GMT
తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆ ఆనందంలో కబుర్లు చెప్పకుంటూ బైక్ పై తిరుపతికి బయలుదేరారు. బస్సు రూపంలో వెంటాడిన మృత్యు బైక్ ను ఢీకొంది. గాయాలతో ఓ మహిళ రోడ్డుపై పడిపోయింది. ఆమె కొడుకు బైక్ నడుపుతున్న వ్యక్తి గాయపడ్డారు. కళ్లముందే తల్లడిల్లుతున్న తల్లిని చేసిన ఆమె కొడుకు తల్లడిల్లిపోయాడు. తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో 24వ మలుపు వద్ద ఈ సంఘటన బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కొడుకుతోపాటు బైక్ నడుపుతున్న వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు.
అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న తిరుమల ఘాట్ రోడ్డులో జరిగే ప్రమాదాలతో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ప్రాంతానికి చెందిన ఆరిఫా (32) తన కుమారుడు షామీర్ తోకలిసి సురేష్ అనే వ్యక్తి వెంట బైక్ లో తిరుమలకు వచ్చారు. బుధవారం ఉదయం వారు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతికి బయలుదేరారు. మొదటి ఘాట్ రోడ్ లో వస్తుండగా వెనక్కి నుంచి వచ్చిన బస్సు సురేష్ నడుపుతున్న బైక్ ను ఢీకొంది. దీంతో బైక్ వెనక కూర్చున్న ఆరిఫా తీవ్రంగా గాయపడింది.
కళ్ళముందే తల్లికి తగిలిన గాయాలు చూసి ఆమె కొడుకు షామీర్ కన్నీరు మున్నీరుగా విలపించారు. బైక్ నడుపుతున్న సురేష్ కూడా కింద పడడంతో స్వల్పంగా గాయాలయ్యాయి. రక్త గాయాలతో పడి ఉన్న ఆరిఫాకు సపరి చర్యలు చేస్తూనే సురేష్ ధైర్యం చెబుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న తిరుమల అంబులెన్స్ డ్రైవర్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు.
తిరుమల మొదటి ఘాట్ రోడ్ లో బస్సు ఢీకొనడంతో గాయపడి న అరిఫాను అంబులెన్స్ లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ప్రాణం విడిచింది ఈ సంఘటనతో ఆమె కొడుకు షామిర్ వెళ్లిపోయారు. ఈ ఘటనపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.