‘అదేం భాష, పవన్! డబుల్ ఇంజిన్ సర్కార్ బాగా నడుపు చాలు’
డబల్ ఇంజిన్ సర్కార్ ఆంధ్రాలో చతికిల పడిందా?;
విజయోత్సవ సభ లో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భాష హోదాకు తగ్గట్లు లేదు. ఆయన చాలా మందిని బెదిరిస్తున్నాడు. బెదిరించేందుకు వాడిన భాష అభ్యంతరకరంగా ఉందంటున్న కాంగ్రెస్ చీఫ్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ తులసి రెడ్డి.
***
"తొక్కి నార తీస్తాం," లాంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ చేశారు.
"తమాషాగా వుందా కొడకల్లారా.....ప్యాకేజీ గీకేజి అంటే చెప్పు చూపిస్తూ పల్లు రాలగొడతా....అరేయ్ వెదవళ్ళారా..చవటల్లారా..,"అదీ ఆయన వాడిన పదజాలం
"ఒంటి చేత్తో వచ్చి మెడ పిసికి తొక్కి చంపేస్తా," ఇదేం భాష పవన్
ఇలాంటి మాటలు గతం లో కూడా పవన్ కల్యాణ్ మాట్లాడారు.కొడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అన్నట్లుంది పవన్ మాటల తీరు.
హోదాకు తగ్గట్లుగా పవన్ తన మాట తీరు మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది.
ఇక డబల్ ఇంజిన్ సర్కార్ తీరు చూద్దాం
రాష్ట్రం లో డబులింజన్ సర్కార్ దూసుకు పోతున్న దని టిడిపి నాయకులు చెప్పడం హాస్యాస్పదం,విడ్డూరం,అతిశయోక్తి అని రాజ్య సభ మాజీ సభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసి రెడ్డి అన్నారు.
మంగళవారం వేంపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అప్పుల్లో దూసుకు పోతున్న దని,అభివృద్ధిలో చతికిల పడిందని ,అంకె వేసిందని అన్నారు.
దానికి ఉదాహరణలు ఇచ్చారు.డబ
2023- 24 లో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్ రు 34,698 కోట్లు కాగా 2024-25 లో రు 20,135 కోట్లు మాత్రమే వచ్చింది.అనగా రు 14,563 కోట్లు తగ్గింది.
సంజీవినీ లాంటి ప్రత్యేక హోదా రాలేదు.
రాయల సీమకు, ఉత్తరాంధ్ర కు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ రాలేదు.
కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యం లో ఉక్కు కర్మాగారం నిర్మాణం కాలేదు.
దుగరాజపట్నం ఓడ రేవు నిర్మాణం కాలేదు.
రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం గ్రాంట్ ఇవ్వలేదు.అప్పు తెచ్చుకోమని చెబుతోంది.
జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నత్త నడకన సాగుతోంది.
9,10 షెడ్యూల్ల లోని సంస్థలు రాష్ట్రానికి రాలేదు.
విశాఖ, విజయవాడ మెట్రో రైల్లు రాలేదు.
2023-24 కంటే 2024 - 25 లో మూల ధన వ్యయం రు 4,413 కోట్లు తగ్గింది.
ఒక్క ఏడాదిలోనే రు 1,58,604 కోట్ల అప్పు చేసింది.ఇది ఆల్ టైమ్ రికార్డు.
GST వసూళ్లు అన్ని రాష్ట్రాల్లో పెరుగుతూ వుంటే మన రాష్ట్రం లో తగ్గుతూ వున్నాయి.
ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది.
రియల్ ఎస్టేట్ భారీగా పతనమైంది.
విద్యుత్ చార్జీలు దూసుకు పోతున్నాయ్.సర్దుబాటు చార్జీల పేరుతో రు 15,480 కోట్ల అదనపు భారం మోపింది.
ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రం లో డబులింజన్ కూటమి ప్రభుత్వం అప్పుల్లో దూసుకు పోతోంది,అభివృద్ధిలో చతికిల పడిందని తులసి రెడ్డి అన్నారు.
మంగళవారం వేంపల్లి లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అప్పుల్లో దూసుకు పోతున్న దని,అభివృద్ధిలో చతికిల పడిందని ,అంకె వేసిందని ఎద్దేవా చేశారు.
2023- 24 లో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన గ్రాంట్ రు 34,698 కోట్లు కాగా 2024-25 లో రు 20,135 కోట్లు మాత్రమే వచ్చింది.అనగా రు 14,563 కోట్లు తగ్గింది.
సంజీవినీ లాంటి ప్రత్యేక హోదా రాలేదు.
రాయల సీమకు, ఉత్తరాంధ్ర కు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ రాలేదు.
కడప జిల్లాలో సెయిల్ ఆధ్వర్యం లో ఉక్కు కర్మాగారం నిర్మాణం కాలేదు.
దుగరాజపట్నం ఓడ రేవు నిర్మాణం కాలేదు.
రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం గ్రాంట్ ఇవ్వలేదు.అప్పు తెచ్చుకోమని చెబుతోంది.
జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నత్త నడకన సాగుతోంది.
9,10 షెడ్యూల్ల లోని సంస్థలు రాష్ట్రానికి రాలేదు.
విశాఖ, విజయవాడ మెట్రో రైల్లు రాలేదు.
2023-24 కంటే 2024 - 25 లో మూల ధన వ్యయం రు 4,413 కోట్లు తగ్గింది.
ఒక్క ఏడాదిలోనే రు 1,58,604 కోట్ల అప్పు చేసింది.ఇది ఆల్ టైమ్ రికార్డు.
GST వసూళ్లు అన్ని రాష్ట్రాల్లో పెరుగుతూ వుంటే మన రాష్ట్రం లో తగ్గుతూ వున్నాయి.
ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది.
రియల్ ఎస్టేట్ భారీగా పతనమైంది.
విద్యుత్ చార్జీలు దూసుకు పోతున్నాయ్.సర్దుబాటు చార్జీల పేరుతో రు 15,480 కోట్ల అదనపు భారం మోపింది.
ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రం లో డబులింజన్ కూటమి ప్రభుత్వం అప్పుల్లో దూసుకు పోతోంది,అభివృద్ధిలో చతికిల పడిందని తులసి రెడ్డి అన్నారు.