దీని ప్రభావం వల్ల క్షిణకోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాల నేపధ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదు. సహయక చర్యలకు NDRF, SDRF, పోలిస్, ఫైర్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని అనిత ఆదేశించారు.  జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ 24/7 అలెర్ట్ గా ఉండాలని ఆదేశించారు.  ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని, వాతావరణ పరిస్థితులపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక మెసేజ్లు పంపాలని ఆదేశించారు. 
సహయం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని, ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఉండాలని మంత్రి అనిత సూచించారు. మరో వైపు రాయలసీమ ప్రాంతాల జిల్లాలైన అనంతపురం, కడప, కర్నూలుతో పాటు ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు కూడా  ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేశారు. వీటి వల్ల ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాలు ఉన్నాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.