చెవిరెడ్డికి గుండెనొప్పి

లిక్కర్‌ కేసులో చెవిరెడ్డి విజయవాడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.;

Update: 2025-06-21 10:02 GMT

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో ప్రస్తుతం రియాండ్‌ ఖైదీగా విజయవాడ జైల్లో ఉన్నారు. శనివారం ఉదయం చెవిరెడ్డి గుండె నొప్పిగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో జైలు సిబ్బంది, పోలీసులు అప్రమత్తమయ్యారు. చెవిరెడ్డి తనకు గుండెనొప్పిగా ఉందని చెప్పడంతో జైల్లో ఉన్న వైద్య సిబ్బందితో తొలుత పరీక్షలు చేయించి, ఫస్ట్‌ ఎయిడ్‌ చర్యలకు జైలు అధికారులు ఉపక్రమించారు.

కానీ ముందస్తు జాగ్రత్తతో మెరుగైన వైద్య పరీక్షలు చేయించి, వైద్యం చేయించేందుకు ఆయనను జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. విజయవాడ జీజీహెచ్‌ వైద్యుల నేతృత్వంలో చెవిరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యం ఆధ్వర్యంలో వైద్యం అందిస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు జీజీహెచ్‌ వైద్యుల పర్యవేక్షణలోనే చెవిరెడ్డిని ఉంచాలని నిర్ణయించారు. ఆ మేరకు చెవిరెడ్డికి వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. అవి పూర్తి అయిన తర్వాత సాయంత్రం చెవిరెడ్డిని తిరిగి విజయవాడ జైలుకు తరలించనున్నారు.

మరో వైపు లిక్కర్‌ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని, దీని కోసం చెవిరెడ్డిని విచారణ చేపట్టాల్సి ఉందని, ఈ నేపథ్యంలో చెవిరెడ్డిని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోర్టులో సిట్‌ అధికారులు పిటీషన్‌ దాఖలు చేశారు. ఇదే సమయంలో చెవిరెడ్డికి బెయిల్‌ మంజూరు చేయాలని చెవిరెడ్డి తరపున నాయ్యవాదులు కోర్టులో పిటీషన్‌లు దాఖలు చేశారు. విజయవాడ ఏసీబీ కోర్టులో సోమవారం ఈ పిటీషన్లు విచారణకు రానున్నాయి. ఈ నేపథ్యంలో చెవిరెడ్డికి బెయిల్‌ మంజూరు చేస్తారా? విచారణ కోసం పోలీసుల కస్టడీకి అప్పగిస్తారా? అనేదానిపై ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News