లిక్కర్ కేసులో చెవిరెడ్డితో పాటు ఆయన స్నేహితుడు
బెంగుళూరు నుంచి విజయవాడకు తీసుకొచ్చిన సిట్ అధికారులు.;
By : The Federal
Update: 2025-06-18 09:17 GMT
మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరులో మంగళవారం అదుపులోకి తీసుకున్న ఆయన్ను అక్కడ నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. విజయవాడ సీపీ కార్యాలయంలో సిట్ విచారణ అనంతరం ఆయనను ఏసీబీ కోర్టులో హజరు పరచరున్నారు. చెవిరెడ్డితో పాటు అతని స్నేహిడుతు వెంకటేశ్ నాయుడుని కూడా అరెస్టు చేసిన సిట్ అధికారులు అతనిని కూడా విజయవాడకు తీసుకొచ్చారు. వీరిద్దరి అరెస్టుతో మద్యం కుంభకోణం కేసుల నిందితుల సంఖ్య తొమ్మిదికి చేరింది. అయితే చెవిరెడ్డితో పాటు అతని సన్నిహిడుతు వెంకటేశ్ నాయుడికి కూడా ఏసీబీ కోర్టు రిమాండ్ విధించే అవకాశం ఉందని, దీంతో వారిద్దరిని విజయవాడ జైలుకు తరలించే అవకాశం ఉందని పోలీసు వర్గలు చర్చించుకుంటున్నారు.
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్ తెరపైకొచ్చింది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సిట్ అధికారులు తాజాగా వీరిద్దరి అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో లిక్కర్కు సంబందించిన వ్యవహారాల్లో చెవిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు సిట్ ఇప్పటికే గుర్తించింది. మద్యం సరఫరా సంస్థలు, డిస్టలరీల నుంచి వసూలు చేసిన మొత్తంలో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చెవిరెడ్డి చేర వేసినట్లు సిట్ చేపట్టిన దర్యాప్తులో వెల్లడైందని, ఈ వ్యవహారంలో చెవిరెడ్డే కీలక పాత్ర పోషించారని, ముడుపుల కలెక్షన్లలో చెవిరెడ్డి సన్నిహితుడు వెంకటేశ్ నాయుడు సహకరించాడని సిట్ తేల్చిన నేపథ్యంలో వీరిద్దరిని అరెస్టు చేశారు. వీరిద్దరు పారిపోతారనే ఉద్దేశంతో వీరిపైన లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.