‘పది’లో ఇద్దరూ ఫెయిల్
మంత్రి నారా లోకేష్కు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కౌంటర్ ఇచ్చిన వైఎస్ షర్మిల.;
కూటమి ప్రభుత్వాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించిన ప్రతి సారి.. ఆయన సోదరి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెరపైకి వస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే.. జగన్కు కూడా కౌంటర్లు ఇవ్వడం పరిపాటిగా మారింది. బహుశా ఇది ఆమె రాజకీయ వ్యూహంలో భాగమేమో కానీ.. తాజాగా మరో సారి విమర్శలు సంధించారు. పది పరీక్షలు, మూల్యాంకనం మీద ఆమె ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లతో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కూడా షర్మిల కౌంటర్ ఇచ్చారు. ఇరు ప్రభుత్వాల వైఫల్యం వల్లే పదో తరగతి విద్యార్థులు దారుణంగా నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులను, విద్యా వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో ఎవరు ఎక్కువా కాదు.. ఎవరు తక్కువా కాదని మండిపడ్డారు. ఆ మేరకు ఆదివారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు.