దుర్గమ్మ ఆశీస్సులు, కృష్ణమ్మ కరుణ ఉన్నాయి

మన సంçస్కృతీ సంప్రదాయాలు కాపాడుకోవాలి, మానసికంగా ప్రజలకు ఉల్లాసం ఉండాలి అని సీఎం చంద్రబాబు అన్నారు.

Update: 2025-10-02 16:45 GMT

ఆంధ్రప్రదేశ్‌కు దుర్గమ్మ ఆశీస్సులు, కృష్ణమ్మ కరుణ ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా విజయవాడ ఉత్సవ్‌ ను విజయవంతం చేసిన బృందానికి ఆయన అభినందనలు తెలిపారు. విజయవాడ ఉత్సవ్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏడాదిన్నర కిందటి వరకూ రాష్ట్ర ప్రజల ముఖాల్లో ఆనందమే లేదు. ఎక్కడ చూసినా భయం, దాడులు, ఆవేదనే నాడు రాజ్యమేలాయి. కూటమి అధికారంలోకి వచ్చాకే ప్రజల ముఖాల్లోకి స్వేచ్ఛ, సంతోషం వచ్చింది. అని సీఎం చంద్రబాబు అన్నారు. పవన్‌ కల్యాణ్, బీజేపీతో కలిసి సుపరిపాలన అందిస్తామని ఇచ్చిన హామీని విశ్వసించి రికార్డు స్థాయి విజయంతో గెలిపించారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు సంతోషంగా వినియోగించుకుంటున్నారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు. సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ చేసిన ఘనత ప్రజలదే. గత పాలకులు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా విధ్వంసం చేశారు. అమరావతి నిర్మాణాన్ని ట్రాక్‌ లో పెట్టాం. మూడేళ్లలో ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వాళ్లు మళ్లీ ఇక్కడే స్థిరపడడానికి వెనక్కి వస్తారు. ఎన్టీఆర్, అక్కినేని, ఘంటశాల లాంటి ప్రముఖులు ఈ ప్రాంతం నుంచే వచ్చారు. విజయవాడ ఉత్సవ్‌ తో నగరం నూతన ఉత్సాహంతో ముందుకెళ్తోంది. సంక్షేమం, అభివృద్ధి అవసరం. అదే సమయంలో మానసిక ఆనందం కూడా అవసరమే అని సీఎం పేర్కొన్నారు.

మన సంçస్కృతీ సంప్రదాయాలు కాపాడుకోవాలి. మానసికంగా ప్రజలకు ఉల్లాసం ఉండాలి. నృత్య రీతులు, సంగీతం, సాహిత్యం, కళలు అన్నీ మన సంస్కృతిలో భాగం. కనుమరుగు అవుతున్న ఇలాంటి కళల్ని మనం కాపాడుకోవాలి. 280కి పైగా ఈవెంట్లను వేర్వేరు ప్రాంతాల్లో ఈ సొసైటీ నిర్వహించింది. 2.50 లక్షల మంది వీటిని వీక్షించారు. హెలీ రైడింగ్‌ సహా వేర్వేరు సాహస క్రీడల్ని కూడా నిర్వహించి విజయవాడ ఉత్సవ్‌ కు ఆకర్షణగా ఏర్పాటు చేశారు. రోబోటిక్‌ కిచెన్‌ ను ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా నిర్వహించి విజయవాడ పారిశ్రామిక వేత్తల సామర్థ్యాన్ని చూపించారు. గడచిన 11 రోజులుగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్‌ అద్భుతం అనిపించింది అని సీఎం పేర్కొన్నారు.
మహాత్మా గాంధీ రోడ్డులో నిర్వహించిన సాంస్కృతిక కవాతు నిర్వహించారు. డప్పు కళాకారులు పెద్ద ఎత్తున పాల్గొని గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డును సాధించారు. గరగలు, కొమ్ముకోయ, తప్పెటగుళ్లు, కర్రసాము, బుట్టబొమ్మలు, భేతాళసెట్టు, నాసిక్‌ డోల్‌ లాంటి కళారూపాలు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించాయి. పర్యాటకంలో దేవాలయాలు 5 లక్షల కోట్ల ఆర్ధిక వ్యవస్థను ఆకర్షించే అవకాశం ఉంది. అన్నవరం, శ్రీకూర్మం, సింహాచలం, వాడపల్లి, ద్వారకాతిరుమల, దుర్గగుడి, పానకాల లక్ష్మీనరసింహస్వామి, పెంచలకోన, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి, కాణిపాకం, శ్రీశైలం, శ్రీకాళహస్తి, మహానంది లాంటి పుణ్యక్షేత్రాలు మన సంపద, మన వారసత్వమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 
Tags:    

Similar News