బెంగళూరు స్టేడియం తొక్కిసలాటలో మృతి చెందిన ఏపీ యువతి

బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఏపీకి చెందిన దివ్వాన్షి మృతి చెందారు. ఆమెను ఏపీకి తీసుకొస్తున్నారు. ఊరి వివరాలు తెలియాల్సి ఉంది.;

Update: 2025-06-05 17:01 GMT

బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిటిన తొక్కిసలాటలో ఏపీకి చెందితన దివ్యాన్షి గేట్ 15 వద్ద జనంలో చిక్కుకుని గాయాల పాలైంది. అక్కడ ఆమె తోపులాటలో ఇనుప బారియర్‌కు తగిలి తీవ్రమైన తల గాయంతో కింద పడిపోయింది. ఇది ఆమె మరణానికి కారణమైంది.

దివ్యాన్షి తండ్రి శివకుమార్ ఈ విషాద సంఘటనలను వివరిస్తూ తన కుమార్తె జనం తొక్కిసలాటలో పడిపోయిందని బెంగళూరులో చెప్పారు. సంఘటనా స్థలంలో సరైన ప్రథమ చికిత్స అందించలేదని ఆయన లేవనెత్తారు. దివ్యాన్షి తల్లి అశ్వని, అత్త ఆమెను ఆటో రిక్షాలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఎందుకంటే అక్కడ అంబులెన్స్‌లు కానీ, పోలీసు సహాయం కానీ అందుబాటులో లేవు. శివకుమార్ కుటుంబం కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయడానికి దాదాపు నాలుగు గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. పరిపాలనా సహాయం లేకపోవడంపై నిరాశను వ్యక్తం చేశారు.

దివ్యాన్షి మృతదేహం బెంగళూరు యలహంకలోని ఆమె కుటుంబ నివాసం నుంచి గురువారం ఆమె అంతిమ సంస్కారాలు నిర్వహించటానికి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొస్తున్నారు. ఆమె తాత లక్ష్మీ నారాయణ్ దివ్యాన్షి ఈ ఈవెంట్ గురించి ఉత్సాహంగా ఉందని, తన క్రికెట్ హీరోలను చూడటానికి ఆనందంగా ఉందని తనకు ఫోన్ చేసి చెప్పిందని ఇంట్లో వారితో పంచుకున్నట్లు సమాచారం. అయితే ఏపీలో వారిది ఏ ఊరు అనే విషయంపై స్పష్టత లేదు.

Tags:    

Similar News