ఏపీకి ‘ఫ్లాష్ ఫ్లడ్’ ముప్పు
ఆంధ్రప్రదేశ్లో రాగల 24 గంటల్లో పలు జిల్లాలకు ’ఫ్లాష్ ఫ్లడ్’ ముప్పు ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.;
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం ఇప్పటికే అతలాకుతలం అవువుతోంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కుండపోత వర్షాలతో పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మరో వైపు రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్కు ఫ్లాష్ ప్లడ్స్ ముప్పు ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాలతో పాటు యానాం ప్రాంతాలకు కూడా ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) సంభవించే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. ఈ ప్రమాదం తూర్పుగోదావరి జిల్లాతో పాటుగా గుంటూరు జిల్లా, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటుగా యానాంలో ఈ ముప్పు అధికంగా ఉంటుందని ఐఎండీ హెచ్చరించడంతో ముందస్తు చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.