శ్రీవారి తల్లి వకుళామాతకు అపురూప కిరీటం
అమ్మవారి వారి ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ భక్తులు శుక్రవారం ఈ కానుక అందించారు.;
తిరుమల తిరుపతి దేవస్థానములు ఆధ్వర్యంలో శ్రీ వకుళామాత వారి ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి సమీపంలోని పేరూరుబండపై వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి తల్లి శ్రీవకుళామాత ఆలయం మూడో వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. టీటీడీ అధికారులు, వేద పండితులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఉదయం నుంచి రాత్రి వరకు కైంకర్యాలు నిర్వహించారు.
ఉదయం 5.30 గంటల నుంచి 6.00 గంట ల వరకు సుప్రభాతం, ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నిత్య కైంకర్యాలు, మూలవర్లకు అభిషేకం చేశారు. అమ్మవారికి అలంకారం తరువాత నివేదన చేశారు.ఆ తరువాత విష్వక్సేనారాధన, పుణ్యాహవచనము, అంకురార్పణం, మహా శాంతిహోమం, పూర్ణాహుతి పూజలను నిర్వహించారు. 11 గంటల నుంచి 12 గంటల వరకు ఉత్సవ మూర్తులకు అష్టోత్తర శతకలశాభిషేకం, మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు శుద్ధి, అక్షతారోపణ, బ్రహ్మఘోష, ఆచార్య బహుమానం చేశారు.
కిరీటం కానుక