శ్రీవారి తల్లి వకుళామాతకు అపురూప కిరీటం

అమ్మవారి వారి ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ భక్తులు శుక్రవారం ఈ కానుక అందించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-06-20 14:46 GMT
తిరుపతి నగరం పేరూరు వద్ద ఉన్న వకుళామాత ఆలయం

తిరుమల తిరుపతి దేవస్థానములు ఆధ్వర్యంలో శ్రీ వకుళామాత వారి ఆలయ తృతీయ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి సమీపంలోని పేరూరుబండపై వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి తల్లి శ్రీవకుళామాత ఆలయం మూడో వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. టీటీడీ అధికారులు, వేద పండితులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.  ఉదయం నుంచి రాత్రి వరకు కైంకర్యాలు నిర్వహించారు.


ఉదయం 5.30 గంటల నుంచి 6.00 గంట ల వరకు సుప్రభాతం, ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నిత్య కైంకర్యాలు, మూలవర్లకు అభిషేకం చేశారు. అమ్మవారికి అలంకారం తరువాత నివేదన చేశారు.ఆ తరువాత విష్వక్సేనారాధన, పుణ్యాహవచనము, అంకురార్పణం, మహా శాంతిహోమం, పూర్ణాహుతి పూజలను నిర్వహించారు. 11 గంటల నుంచి 12 గంటల వరకు ఉత్సవ మూర్తులకు అష్టోత్తర శతకలశాభిషేకం, మధ్యాహ్నం 12 గంటల నుంచి  ఒంటి గంట వరకు శుద్ధి, అక్షతారోపణ, బ్రహ్మఘోష, ఆచార్య బహుమానం చేశారు.


కిరీటం కానుక

తిరుపతి నుంచి చంద్రగిరికి వెళ్ల మార్గంలో శ్రీవేంకటేశ్వర విద్యాలయం దాటిన తరువాత పేరూరు గ్రామానికి సమీపంలోని పేరూరు బండగా గుర్తింపు ఉన్న కొండపై ఉన్న అత్యంత పురాతన వకుళమాత ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్డారు. 

శ్రీవకుళామాత ఆలయ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్ కు చెందిన ఆర్. అమరనాథ్, శైలజ దంపతులు అమ్మవారికి రూ. 4.50 లక్షల విలువైన బంగారు పూత పూసిన వెండి కిరీటాన్ని కానుకగా సమర్పించారు. ఈ కిరీటాన్ని ఆలయ డిప్యూటీ ఈవో వరలక్ష్మీకి అందించారు

Similar News