మన పుట్టినరోజున మన భూమి తల్లికి మొక్కల కానుక

తిరపతి ఈకో పార్కులో ఐదు లక్షల స్వదేశీ వృక్షాల పెంచడానికి నిర్ణయం;

Update: 2025-05-28 14:27 GMT
తిరుపతి దివ్యారామంలో మొక్కలు నాటుతున్న డీఎఫ్ఓ, వివేక్, రామచంద్రారెడ్డి, భూమన్

తిరుపతి కపిలతీర్థం సమీపంలో శేషాచల అటవీ క్షేత్రంలోని ‘దివ్యారామం’ ఈకో పార్కులో “పుట్టినరోజున మీకు ఇష్టమైన మొక్కని నాటి, భూమి తల్లికి కి బహుమతి ఇవ్వండి” అనే శుభ సందేశంతో ఒక క్యాంపెయిన్ మొదలయింది. ప్రత్యేకమైన వృక్ష సంపద వృద్ధి చేసేందుకు చేపట్టిన ఈ  కార్యక్రమానికి బుధవారం నాంది పలికారు. ఈ విలక్షణ కార్యక్రమాన్ని జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ఓ) పి. వివేక్, ప్రారంభించగా, పర్యావరణ ప్రేమికుడైన శ్రీ సిటీ జనరల్ మేనేజర్‌, పత్రికా రచయిత పలవలి రామచంద్ర రెడ్డి తన 65వ పుట్టినరోజు సందర్భంగా కదంబంతె పాటు అనేక దేశీయ మొక్కలను నాటారు.

పర్యావరణ ప్రేమికుల సమావేశంల మాట్లాడుతున్న తిరుపతి డీఎఫ్ఓ వివేక్

డీఎఫ్ఓ వివేక్ మాట్లాడుతూ, శేషాచల బయోస్ఫియర్ ప్రాంతంలో చెందిన ఐదు లక్షల దేశీయ వృక్షాలను పెంపొందించే భారీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అందుకు అవసరమైన నర్సరీల పెంపకంతో సహా అన్ని మౌలిక ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు , ప్రకృతి ప్రేమికుల బాధ్యత తీసుకుని మొక్కలను సంరక్షించి వనసంపదను పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఇక్కడి భూమికి రావి, మర్రి వంటి దేశీయ జాతుల వృక్షాలు వేల ఏళ్ళు నిలిచే శక్తిని కలిగి ఉండగా, విదేశీ వృక్షాలు అధిక స్థలాన్ని ఆక్రమించి నీటిని అధికంగా వినియోగిస్తున్నాయని, అవి స్థానిక జీవవైవిధ్యానికి హానికరం అని హెచ్చరించారు. శేషాచల పర్వత ప్రాంతం పీఠభూమి తత్వాన్ని కలిగివుండటంతో మట్టి కాపాడుకునే సామర్థ్యం తక్కువగా అయి ప్రతికూల వాతావరణంలో చెట్లు పడిపోతున్నాయని చెప్పారు.

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ కులపతి ప్రొఫెసర్ రాళ్లపల్లి రామమూర్తి మాట్లాడుతూ దివ్యరామం నడకదారులు పుట్టినరోజు సందర్భంలో చెట్లు నాటే ప్రయత్నాన్ని ప్రశంసించారు. ప్రకృతి ప్రేమికుడు, రచయిత భూమన్ స్వదేశీ వృక్షజాతుల సంరక్షణ ఆవశ్యకతను వివరిస్తూ తన సహకారం అందిస్తామని తెలిపారు మరో అతిథి కస్తూర్బా గాంధీ ట్రస్ట్ ఛైర్మన్ డా. పి. సి. రాయులు మాట్లాడుతూ తిరుపతిని మరింత పచ్చదనంతో, చల్లదనంతో, జీవంతో నింపేందుకు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
తన 65వ పుట్టినరోజు సందర్భంగా దేశీయ వనసంరక్షణ కు శ్రీకారం చుట్టిన రామచంద్రా రెడ్డికి జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ఓ) శ్రీ పి. వివేక్ 65 రకాల స్వదేశీ వృక్షముల గింజలతో కూడిన చెక్క పెట్టెను కానుకగా అందచేశారు.

డీఎఫ్ఓ వివేక్ కు  మొక్క అందిస్తున్న రామచంద్రారెడ్డి

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, వనసంరక్షణ లక్ష్యంగా మొదలుపెట్టిన ప్రయత్నానికి ప్రజల నుంచి వచ్చిన సహజ సానుకూల స్పందనకు, కృతజ్ఞతలు తెలియచేస్తూ . ఈ కార్యక్రమం మరెందరికో స్ఫూర్తి అవుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు రమేష్ రెడ్డి స్వాగత పరిచయాలతో మొదలైన కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు డా. తమ్మినేని వెంకటేశ్వర్లు, కె. అమర్నాథ్ రెడ్డి, బాబు నాయుడు, అశోక్ రెడ్డిలను రామచంద్రా రెడ్డి ఖద్దరు కండువాలతో సత్కరించారు.

Similar News