మన పుట్టినరోజున మన భూమి తల్లికి మొక్కల కానుక
తిరపతి ఈకో పార్కులో ఐదు లక్షల స్వదేశీ వృక్షాల పెంచడానికి నిర్ణయం;
తిరుపతి కపిలతీర్థం సమీపంలో శేషాచల అటవీ క్షేత్రంలోని ‘దివ్యారామం’ ఈకో పార్కులో “పుట్టినరోజున మీకు ఇష్టమైన మొక్కని నాటి, భూమి తల్లికి కి బహుమతి ఇవ్వండి” అనే శుభ సందేశంతో ఒక క్యాంపెయిన్ మొదలయింది. ప్రత్యేకమైన వృక్ష సంపద వృద్ధి చేసేందుకు చేపట్టిన ఈ కార్యక్రమానికి బుధవారం నాంది పలికారు. ఈ విలక్షణ కార్యక్రమాన్ని జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ఓ) పి. వివేక్, ప్రారంభించగా, పర్యావరణ ప్రేమికుడైన శ్రీ సిటీ జనరల్ మేనేజర్, పత్రికా రచయిత పలవలి రామచంద్ర రెడ్డి తన 65వ పుట్టినరోజు సందర్భంగా కదంబంతె పాటు అనేక దేశీయ మొక్కలను నాటారు.
పర్యావరణ ప్రేమికుల సమావేశంల మాట్లాడుతున్న తిరుపతి డీఎఫ్ఓ వివేక్
డీఎఫ్ఓ వివేక్ మాట్లాడుతూ, శేషాచల బయోస్ఫియర్ ప్రాంతంలో చెందిన ఐదు లక్షల దేశీయ వృక్షాలను పెంపొందించే భారీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. అందుకు అవసరమైన నర్సరీల పెంపకంతో సహా అన్ని మౌలిక ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు , ప్రకృతి ప్రేమికుల బాధ్యత తీసుకుని మొక్కలను సంరక్షించి వనసంపదను పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఇక్కడి భూమికి రావి, మర్రి వంటి దేశీయ జాతుల వృక్షాలు వేల ఏళ్ళు నిలిచే శక్తిని కలిగి ఉండగా, విదేశీ వృక్షాలు అధిక స్థలాన్ని ఆక్రమించి నీటిని అధికంగా వినియోగిస్తున్నాయని, అవి స్థానిక జీవవైవిధ్యానికి హానికరం అని హెచ్చరించారు. శేషాచల పర్వత ప్రాంతం పీఠభూమి తత్వాన్ని కలిగివుండటంతో మట్టి కాపాడుకునే సామర్థ్యం తక్కువగా అయి ప్రతికూల వాతావరణంలో చెట్లు పడిపోతున్నాయని చెప్పారు.
డీఎఫ్ఓ వివేక్ కు మొక్క అందిస్తున్న రామచంద్రారెడ్డి