ఈ సెక్షన్‌ల కింద అంబటిపై కేసు

పోలీసుల విధులకు అంబటి ఆకంటం కలగించారని కేసు నమోదు చేశారు.;

Update: 2025-06-19 05:40 GMT

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా నిబంధనలను ఉల్లంఘించారని గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలపై కేసుల నమోదుకు పోలీసులు ఉపక్రమించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నాయకుడు అంబటి రాంబాబుపైన కేసు నమోదు చేశారు. జగన్‌ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా డ్యూటీలు చేస్తోన్న పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, పోలీసులపైన దురుసుగా ప్రవర్తించారని సత్తెనపల్లి రూరల్‌ పోలీసు స్టేషన్‌లో అంబటి రాంబాబుపైన గురువారం కేసు నమోదు చేశారు.

సత్తెనపల్లి మండలం కంటేపూడి దగ్గర జగన్‌ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తన సోదరుడు మాజీ ఎమ్మెల్యే అంబటి మురళితో కలిసి అంబటి రాంబాబు తొలగించడంతో పాటు, పోలీసులతో వాగ్వాదానికి దిగారని, బ్యారికేడ్లను తొలగించొద్దని అడ్డుకున్న పోలీసులను తోసేసి మరి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఐపీసీ 188, 332, 253, 427 సెక్షన్ల కింద అంబటిపై పోలీçసులు కేసు నమోదు చేశారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసులు విధించిన నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో పలువురి వైసీపీ నేతలపైన కేసులు నమోదు చేశారు. నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి వైసీపీ ఇన్‌చార్జి గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలపైన పోలీసులు కేసులు నమోదు చేశారు.

Tags:    

Similar News