జర్నలిస్టు కొమ్మినేని గుంటూరు జైలుకు తరలింపు
‘వేశ్య’ల కామెంట్ కేసులో 14 రోజు రిమాండ్ విధించిన మంగళగిరి కోర్టు;
By : The Federal
Update: 2025-06-10 10:06 GMT
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వేశ్యల రాజధాని అని వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి ఛానల్ చర్చా నిర్వాహకుడు కొమ్మినేని శ్రీనివాసరావుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ మంగళగిరి కోర్టు) ఉత్తర్వులు జారీ చేసింది.మంగళవారం ఉదయం కొమ్మినేనిని పోలీసులు మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు. వాదోపవాదాలు విన్నతర్వాత కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది దీంతో కొమ్మినేని శ్రీనివాసరావుని గుంటూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.
సాక్షి ఛానల్ లో నిర్వహించిన ఒక డిబేట్ లో రాజధాని ప్రాంతం ఎక్కవ మంది వేశ్యలున్నారని కృష్ణం రాజు అనే మరొక జర్నలిస్టు వ్యాఖ్యానించారు. అపుడు మాడరేటర్ గా ఉన్న కొమ్మినేని ఈ వాఖ్యాలకు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం వివాదాస్పదమయింది.దీనితో అమరావతి ప్రాంత మహిళలు ఆగ్రహించారు. టిడిపి కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టారు. అనేక పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేశారు. అందులో భాగంగా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో టీడీపీ మహిళా నాయకురాలు కంభంపాటి శిరీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న ఉదయం హైదరాబాద్లో కొమ్మినేని శ్రీనివాస్ ను హైదరాబాద్ జూబిలీ హిల్స్ జర్నలిస్టు కాలనీలోని ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసి గుంటూరుకు తరలించారు.
ఈరోజు ఉదయం గుంటూరు జీజీహెచ్ లో కొమ్మినేనికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు.