తిరుపతిలో తమిళ భ్రూణ హత్యల ముఠా'
తిరుపతిలో స్కానింగ్ సెంటర్ లో జరుగుతున్న వ్యవహారం బట్టబయలైంది.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-06-24 17:30 GMT
భ్రూణ హత్యలకు పాల్పడుతున్న తమిళనాడు ప్రాంత ముఠా తన కలాపాలను చిత్తూరు జిల్లాను అడ్డగా మార్చుకుంది. తిరుపతిలో గర్భస్థ శిశువులను స్కానింగ్, ఆ తరువాత చిదిమేస్తున్నారనే విషయం మంగళవారం వెలుగు చూసింది.
"కొందరు ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్ల ఒత్తిడి మేరకే స్కానింగ్ చేస్తున్నాం" అని క్లారా ఓ మెడికల్ ప్రాక్టీషనర్ అంగీకరించడం ఇక్కడ కీలక అంశం.
తమిళనాడులోని ఓ ముఠా రహస్యంగా చిత్తూరు జిల్లా కేంద్రంగా గర్భిణీలకు స్కానింగ్ చేయడం. ఆడబిడ్డ ఉంటే గర్భంలోనే చిదివేస్తున్న వ్యవహారం కొన్ని రోజుల కిందట వెలుగు చూసింది. ఈ సంఘటన తర్వాత కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ తీవ్రంగా స్పందించిన దాఖలాలు లేవు. అందుకు నిదర్శనం.
తిరుపతిలో బట్టబయలు
తిరుపతి: భవానీనగర్ సమీపంలోని శ్రీసాయి సర్జికల్, మెటర్నిటి హాస్పిటల్ లో పరిశీలిస్తున్న ఇంఛార్జ్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఛత్రప్రకాషరెడ్డి
తమిళనాడులో స్కానింగ్ కేంద్రాలపై అక్కడి వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తీవ్రంగా నిఘా పెట్టారు. దీంతో అక్కడి ముఠా చిత్తూరు జిల్లాకు మకాం మార్చింది. అక్కడ కూడా వారి ఆటలు సాగని స్థితిలో తిరుపతిలో మకాం వేసింది.
తిరుపతి నగరం భవాని నగర్ సమీపంలోని పాత ప్రసూతి వైద్యశాలకు సమీపంలో ఉన్న సాయి పాలీ క్లినిక్ లో గర్భస్థ శిశువులను అంతమందుస్తున్నారనే సమాచారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు అందింది. దీంతో
తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి బాలకృష్ణ నాయక్ స్పందించారు. ఇంఛార్జ్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఛత్రప్రకాషరెడ్డి, డెమో సెక్షన్ నుంచి బాబు నెహృ రెడ్డి, కిరణ్ కుమార్ డెమో అధికారులు తనిఖీ చేశారు.
విషయం బట్టబయలు
చిత్తూరు ఘటన తరువాత నిఘా లేకపోవడం వంటి పరిణామాలు తమిళనాడు ముఠా తిరుపతికి మకాం మార్చిన విషయం తాజాగా బయటపడింది.
తిరుపతి జిల్లా వైద్యాధికారుల విచారణలో కొంతమంది ప్రైవేటు ప్రాక్టీషనర్స్ భవానీనగర్ లోని పాలీ క్లినిక్ కు చిత్తూరు, తమిళ నాడు, ఆ పరిసర ప్రాంతాల నుబంచి లింగనిర్ధారణ పరిక్షలకు గర్భిణులను రెఫర్ చేస్తున్నారనే విషయం వెలుగు చూసింది.
అడ్డుకున్న సిబ్బంది
నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న స్కానింగ్, అబార్షన్ల వ్యవహారం బట్టబయలైంది. వైద్య ఆరోగ్య శాఖాధికారులు విచారణకు వచ్చారని తెలియగానే. శ్రీ సాయి సర్జికల్, మెటర్నిటి హాస్పిటల్ డాక్టర్ ఈ. కిరణ్ కుమార్, హాస్పిటల్ ఎండి అప్రమగ్తం అయ్యారని తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుంచి విడుదల చేసిన ప్రటకన స్పష్టం చేసింది.
"వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఆస్ప్రత్రిలోకి రాకుండా తలుపులు మూసి వేశారు. ఈ విషయం బయటికి పొక్కకుండా విఫలయత్నం చేశారు" అని డీఎంఅంఢ్ హెచ్ ఓ బాలకృష్ణనాయక్ వివరించారు.
కొందరి ఒత్తిడితోనే పరీక్షలు
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల విచారణలో అనేక విషయాలు బయటపడ్డాయి. ప్రైవేటు ఆస్పత్రిలో స్కానింగ్ చేస్తున్న ప్రాక్టీషనర్ క్లారా అనే మహిళ అసలు విషయాలను బట్టబయలు చేశారని డీఎం అండ్ హెచ్ఓ బాలకృష్ణ నాయక్ స్పష్టం చేశారు.
జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ఫోన్ లో మాట్లాడగా,
"కొందరు ప్రైవేటు ప్రాక్టీషనర్లు తనపై ఒత్తిడి చేశారు. ప్రలోభ పెట్టారు. కుటుంబ అవసరాల కోసం లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నా" అని ప్రైవేటు ప్రాక్టీషనర్ క్లారా అంగీకరించారని వివరించారు.
తిరుపతి భవానీనగర్ లోని శ్రీ సాయి సర్జికల్ అండ్ మెటర్నిటి హాస్పిటల్ ను సీజ్ చేశాం. అని డీఎం అండ్ హెచ్ఓ బాలకృష్ణనాయక్ మీడియాకు చెప్పారు. నగరంతో పాటు, జిల్లాలోని మిగతా ఆస్పత్రుల్లో కూడా తనిఖీలు సాగించడానికి చర్యలు తీసుకుంటామని ఆయన వవిరించారు.