బంగ్లా వైట్ వాష్ కు భారత దూకుడు బ్యాటింగ్ ఎంత వరకూ కారణం?

కాన్పూర్ లో జరిగిన రెండో టెస్ట్ లో భారత జట్టు ఫలితాన్ని సాధించింది. ఈ గెలుపుతో టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మరింత చేరువైంది. టెస్ట్ మ్యాచ్ డ్రా అవుతుందన్న ..

By :  491
Update: 2024-10-02 07:31 GMT

టెస్ట్ క్రికెట్ ను బతికించడానికి ఐసీసీ 2019 లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను ప్రవేశపెట్టింది. ఇందులో ఓర్పు, నిలకడ, స్థిరత్వం అనేది ప్రధాన పరీక్షగా ఆటలో చలమణి అవుతున్నాయి. ఇది టెస్ట్ క్రికెట్ అర్హత సాధించిన తొమ్మిది దేశాలను ప్రతి జట్టుతో కనీసం ఆరు సిరీస్ లు ఆడాలని నిర్దేశించింది. ఇందులో మూడు సిరీస్ లు స్వదేశంలో, మరో మూడు విదేశాల్లో ఉండేలా నిబంధన విధించింది. ఇందులో మొదటి లీగ్ దశ ముగిసే నాటికి అత్యుత్తమంగా ఉన్న దేశాలు ఫైనల్ ఆడేందుకు అర్హత సాధిస్తాయి. ఈ సిరీస్ లకు రెండు సంవత్సరాల కాల వ్యవధిని నిర్ణయించారు.

2021లో న్యూజిలాండ్‌తో, 2023లో ఆస్ట్రేలియాతో భారత్ ఇప్పటివరకు రెండు ఫైనల్స్‌ను ఆడింది, ఓడింది. కానీ టెస్ట్ క్రికెట్ పై తమకు మక్కువ లేదని ఈ ఫైనల్ ఓటమి కలిగించిందని చాలామంది క్రీడా విశ్లేషకులు చెబుతున్న మాట.
హోం అడ్వాటేజ్...
రోహిత్ శర్మ నేతృత్వంలో జట్టు, గతంలోని తప్పులను సరిదిద్దడానికి సిద్ధంగా ఉంది. గత నవంబర్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన 50-ఓవర్ల స్వదేశీ ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు అద్భుతంగా ప్రయాణించిన జట్టు చివరి మెట్టుపై బొల్తా పడింది. కానీ తరువాత అమెరికా- వెస్టీండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ లో ఒడిసిపట్టింది. ఓటమి తప్పదనుకున్న తరుణంలో అద్భుతంగా కమ్ బ్యాక్ అయిన జట్టు దేశానికి రెండో టీ20 ప్రపంచకప్ సాధించి పెట్టింది. దీనితో దశాబ్ధం తరువాత దేశానికి ఐసీసీ ట్రోఫి కరువు తీరింది.
ఇప్పుడు తన దృష్టిని టెస్ట్ ఛాంపియన్ షిప్ పై టీమిండియా కేంద్రీకరిచింది. దాదాపు మూడు నెలల పాటు జరిగే సుదీర్ఘ టెస్ట్ సీజన్ కు మన జట్టు సిద్ధమైంది. సెప్టెంబర్ 19 నుంచి జనవరి 7 మూడు దేశాలలతో దాదాపు పది టెస్టు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. టీమిండియా ఇప్పటి వరకూ 13 టెస్టు సిరీస్ లో 11 సిరీస్ లలో గెలిచింది. రెండు టెస్ట్ సిరీస్ లు డ్రా అయ్యాయి.
అయితే బంగ్లాదేశ్‌లో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. వారు ఇంతకుముందు పాకిస్తాన్‌లో వారి చారిత్రాత్మక 2-0 స్వీప్ తర్వాత వారి ఆత్మవిశ్వాసం ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. మంచి బౌలర్లు, ఫామ్ లో ఉన్న బ్యాట్స్ మెన్ ఉన్నారు.
అజేయమైన పరుగు
నజ్ముల్ హొస్సేన్ శాంటో టీమ్ కి ఒకటి అర్థం అయింది. భారత్.. పాకిస్తాన్ లా మాత్రం కాదని బాగా తెలిసింది. టీమిండియాను తేలిగ్గా నిలవరించలేరని, నిలువరించలేమని వారికి అర్థం అయింది. స్వదేశంలో భారత్ అజేయమైన విస్తృత శక్తి కారణంగా.. 2013 నుంచి ఇప్పటి వరకూ ఓడిపోలేదు. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు భారత జట్టు 40 టెస్టుల్లో గెలిచి నాలుగింటిలో మాత్రమే ఓడారు. అందులో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో ఒక్కొక్కటి. జట్టులో ప్రతిభావంతులైన స్పిన్నర్లకు తోడో, పేస్ ఆయుధం జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నాడు. వీరికి తోడు మంచి ఆకలి, ప్రతిభా తోడు కావడంతో జట్టు సమతూకంగా ఉంది.
42 ఏళ్లలో మొదటిసారిగా, ఒక విజిటింగ్ కెప్టెన్ టాస్ గెలిచి, భారత్ జట్టును చెన్నైలో బ్యాటింగ్ కు ఆహ్వనించారు. భారత్ కేవలం 144 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన సమయంలో పాకిస్తాన్ లాగే భారత్ కూడా అనుకున్నారు కానీ .. ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు జట్టును సురక్షిత స్థానానికి చేర్చడమే కాకుండా ప్రత్యర్థిని కుప్పకూల్చడంలో తమవంతు సాయం అందించారు.
రూడ్ మేల్కొలుపు..
ప్రారంభంలోని నాలుగు గంటల్లో భారత్ ఓటమి అంచున ప్రయాణించింది. పదునైన పేస్ బౌలింగ్ కు టాప్ ఆర్ఢర్ కకావికలమైంది. అశ్విన్- జడేజా జోడీ ఆదుకోవడంతో జట్టు 376 పరుగులు సాధించింది. ఇది ఆటలో కీలక మలుపు. అశ్విన్, సంఖ్యాపరంగా అనిల్ కుంబ్లేకు సమానమైన భారతదేశంపు గొప్ప మ్యాచ్ విన్నర్. అతను పుట్టిన నగరంలో తన చివరి టెస్ట్‌లో ఐదు వికెట్ల హాల్‌తో సహ ఆరవ టెస్ట్ సెంచరీని సాధించాడు. రెండో ఇన్సింగ్స్ లో రిషబ్ పంత్ 21 నెలల్లో తన మొదటి టెస్ట్‌లో రెండవ ఇన్నింగ్స్‌లో సెంచరీతో వెనుదిరిగాడు. భయంకరమైన రోడ్డు ప్రమాదం తరువాత పంత్ అడుగుపెట్టిన టెస్ట్ సిరీస్ ఇదే.
1-0 ఆధిక్యంలో భారత్ కాన్పూర్‌లోకి వెళ్లింది. చెపాక్ ఎర్ర-నేల పేస్ కు సహకరించింది. కానీ గ్రీన్ పార్క్ బ్లాక్ సాయిల్.. స్లో టర్న్, తక్కువ బౌన్స్ ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ జరిగిన టెస్ట్ మ్యాచ్ లన్నీ దాదాపుగా డ్రా గానే ముగిశాయి. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ కూడా మొదటి రోజు నుంచి మూడో రోజు వరకూ వర్షం అంతరాయం కలిగించింది.
దూకుడు ప్రదర్శన
ఛాంపియన్ జట్లు తమ అదృష్టాన్ని సొంతం చేసుకున్నాయి. సోమవారం రోహిత్ బంచ్ అదే చేసింది. ఒకసారిగా బంగ్లాదేశ్ ను 233 పరుగులకు ఆలౌట్ చేసింది. తరువాత బ్యాటింగ్ కు దిగిన జట్టు ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ ముందుగా బ్యాట్స్ మెన్లకు ఓ దారి చూపించాడు. దీనితో టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250 స్కోర్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఓవర్‌కు 8.22 పరుగులతో 285/9 కి డిక్లేర్ చేసింది. టీ20 క్రికెట్ లో కూడా కొన్ని సార్లు ఈ రికార్డు సంభవం కాదేమే. ఆ మానిక్ 34.4 ఓవర్ల ఆట ద్వారా, భారత్ టెస్ట్ ప్రపంచాన్ని అప్రమత్తం చేసింది. ఇది మిగిలిన ఫీల్డ్‌ను కదిలించే ప్రకటన.
వారి దూకుడు, ఉద్దేశ్యం ధృడమైన ప్రదర్శనకు ధన్యవాదాలు, భారతదేశం నిరాడంబరమైన టెస్ట్‌కు ప్రాణం పోసింది. బంగ్లాదేశ్ బహుశా ఒకటిన్నర రోజుల భారత గ్రైండ్‌తో రాజీపడి ఉండవచ్చు, ఇప్పుడు వారి షాక్‌ను బాగా ఊహించవచ్చు. భారత దుకూడు వారి రెండో ఇన్నింగ్స్ షాట్ సెలక్షన్ లో కనిపించింది. వారి నీరసమైన షాట్లు జట్టును 2-0 తో సిరీస్ ను కొల్పోయేలా చేసింది. ఈవిజయంతో WTC పట్టికలో అగ్రస్థానంలో వారి స్థానాన్ని ఏకీకృతం చేసింది. భారతదేశం కేవలం వినోదాత్మకంగా మాత్రమే కాదు, విజేతలు కూడా. ఇప్పుడు, ఆ స్థితిని ధృవీకరించడానికి మరొక ట్రోఫీ కోసం వేచి చూస్తోంది.



Tags:    

Similar News