ఉత్తర కొరియా మార్గంలో ఇరాన్ నడవాలని అనుకుంటోందా?
కిమ్ ను ఇప్పటి వరకూ టచ్ చేయని అమెరికా;
By : The Federal
Update: 2025-06-29 10:25 GMT
వివేక్ కట్జూ
ఉత్తర కొరియా వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి. కాబట్టే అమెరికా దానిపై ఎటువంటి సైనిక చర్య తీసుకోలేదని ఇరాన్ కు బాగా తెలుసు. ఇప్పుడు ఇరాన్ కూడా అదే మార్గాన్ని అనుసరించాలని అది బలంగా విశ్వసిస్తోంది.
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిని తీసుకొచ్చారు. అయితే సీజ్ ఫైర్ అమల్లో ఉండగానే ఇరాన్ పై బాంబుదాడులు చేసినందుకు ఇజ్రాయెల్ ను మందలించారు. ఇరాన్ కూడా ఒప్పందం ఉల్లంఘించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోరాటం ప్రారంభం, ముగింపు బాధ్యత ఇజ్రాయెల్ పై ఉంది. జూన్ 13న ఇరానియన్ అణు కేంద్రాలపై బాంబుదాడి చేయడం ద్వారా అది యుద్దాన్ని ప్రారంభించింది. ఐడీఎఫ్ సాయుధ దళాలు ఇరాన్ నుంచి అణు ముప్పును తొలగించే వరకూ తన దేశం వైమానిక దాడి కొనసాగిస్తుందని ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పేర్కొన్నారు.
వైమానిక దాడులతో పాటు ఇజ్రాయెల్, ఇరాన్ లోపల దాని నిఘా సంస్థ చేపట్టిన రహస్య కార్యకలాపాల ద్వారా ఇరాన్ సైనిక జనరళ్లు, అణు శాస్త్రవేత్తలను హత్య చేసింది.
ఇరాన్ - ఇజ్రాయెల్ పై క్షిపణులతో దాడి చేయడం ద్వారా తన ప్రతిఘటన ప్రారంభించింది. తన మూడెంచెల క్షిపణి వ్యవస్థ ఉందని ఇజ్రాయెల్ భావించింది. దాని వల్ల తన పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లదని కూడా అనుకుంది.
అయితే కొన్ని క్షిపణులు టెల్ అవీవ్ లోకి చొచ్చుకెళ్లాయి. ఇది ఆ దేశ మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించింది. మరో విషయం ఏంటంటే ఐరన్ డోమ్, డేవిడ్ స్టింగ్, థాడ్ వంటి వ్యవస్థలలోని లోపాలను ఎత్తిచూపింది.
అమెరికా- ఇజ్రాయెల్ బంధం..
పశ్చిమాసియాలో వివాదం ప్రారంభం నుంచి అమెరికా, ఇజ్రాయెల్ అనుకూల వైఖరినే తీసుకుంటోంది. దీనికి కారణం రెండు దేశాల మధ్య ఉన్న బలమైన సంబంధాలే.
ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణ్వాయుధాన్ని తయారు చేయకుండా నిరోధించడం ఈ రెండు దేశాల బంధాన్ని కలిపి ఉంచే తాడులా మారింది. జూన్ 22న ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ లోని ఇరాన్ అణు కేంద్రాలపై బాంబు దాడి చేయాలని ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
పర్వతం లోపల భూగర్భంలో నిర్మించిన ఫోర్డో అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడం ఇజ్రాయెల్ వల్ల కాదని స్పష్టమైంది. యూఎస్ బీ-2 బాంబర్లు భూగర్భ నిర్మాణాలలోకి చొచ్చుకుపోయే అత్యంత ప్రాణాంతకమైన అణుయేతతర బాంబులను మోసుకెళ్లి వాటిని ఫోర్డోపై ప్రయోగించాయి.
అమెరికా దాడి తరువాత ఇరాన్ ఎలా ప్రతిస్పందిస్తుందనేది ఎవరికి అంతుబట్టలేదు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అమెరికాకు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు నిరసన ప్రదర్శనలు చేస్తాయని అది భావించింది.
గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై బాంబు దాడి చేయడానికి, అంతర్జాతీయ షిప్పింగ్ కు ముఖ్యంగా భారత్ తో సహ గల్ప్ దేశాల నుంచి మిగిలిన దేశాలకు సరఫరాల అయ్యే హర్ముజ్ జలసంధిని మూసివేయవచ్చని ప్రపంచం భావించింది.
ఇవన్నీ షేర్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. చమురు ధరలు పెరగడానికి కూడా దారి తీశాయి. అయితే అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్య తీసుకోవద్దని ట్రంప్, ఇరాన్ ను హెచ్చరించారు. అలా చేస్తే సంక్షోభం మరింత తీవ్రం అవుతుందని ఆయన అన్నారు.
దౌత్య చక్రాలు..
అమెరికా- ఇరాన్ మధ్య దౌత్య చక్రాలు మెల్లమెల్లగా కదులుతున్నాయి. అలాగే గల్ప్ ప్రాంతంలో అతిపెద్ద అమెరికా స్థావరం ఉన్న ఖతార్ కూడా ఈ దౌత్య చక్రంలో కీలక పాత్ర పోషించింది.
ఇది కొంతమందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ప్రపంచం ఇలాగే పనిచేస్తోంది. సాయుధ పోరాటం మధ్యలో దౌత్యాన్ని వదిలివేయరు. దీనికి విరుద్దంగా సమస్యలకు దౌత్యపరమైన పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడూ హింసాత్మక చర్యలను ఆశ్రయిస్తారు.
మొదటి, రెండో ప్రపంచ యుద్దాల సమయంలో జరిగినట్లుగా దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగినప్పుడే సంబంధిత దేశాలు దౌత్య మార్గాలను మూసివేస్తాయి.
దేశాల మధ్య యుద్ధాలు జరిగిన కొన్ని సందర్భాల్లో ప్రధాన శక్తులు శత్రుత్వాలను అంతం చేయడానికి జోక్యం చేసుకుంటాయి. అటువంటి పరిస్థితుల్లో అంతిమ నిర్ణయాలు సహజంగానే యుద్దంలో ఉన్న దేశాలు తీసుకుంటాయి.
చాలా సున్నితమైన దౌత్య నిర్ణయాలు నిశ్శబ్ధంగా జరుగుతాయి. కానీ ట్రంప్ వంటి నాయకులు మాత్రం కొన్ని సందర్భాల్లో అది జరగకపోయినా, కాల్పుల విరమణ తన వల్లే జరిగిందంటూ క్రెడిట్ ను ప్రకటించుకుంటారు.
ఇరాన్ వల్ల తన ప్రయోజనాలకు భంగం..
ఇరాన్ వ్యవహరిస్తున్న తీరు అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని దాని ముందరి కాళ్లకు బంధం వేయాలని అమెరికా అనుకుంది. అందువల్ల ఖతార్ లోని వైమానిక బేస్ లపై దాడి చేయాలని నిర్ణయించుకుంది. అయితే దాడి సమాచారాన్ని ముందుగానే ఖతార్ కు, అటు నుంచి అమెరికాకు అందజేసింది. ఇది నివారణ చర్య తీసుకోవడానికి ఉపయోగపడింది.
అమెరికా, ఇరానియన్ క్షిపణులను మధ్యలోనే అడ్డగించింది. తన సార్వభౌమత్వాన్ని ఉల్లఘించినందుకు ఇరాన్ కు అధికారికంగా నిరసన తెలిపింది. కానీ ఇది కేవలం నిత్యకృత్యం.
చివరకు జూన్ 24న తెల్లవారుజామున ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు ట్రంప్ ప్రకటించుకున్నారు. ఇజ్రాయెల్ తమ దేశంపై వైమానిక దాడిని ఆపివేస్తే తాము క్షిపణులను ప్రయోగించడం మానేస్తామని టెహ్రాన్ నాయకత్వం పేర్కొంది.
రెండు అంశాలపై దృష్టి..
ఈ యుద్ధ సమయంలో తలెత్తిన అనేక ప్రశ్నలకు చాలాకాలంగా అధ్యయనం చేస్తారనడంలో సందేహం లేదు. వీటిలో కొన్ని అంశాలు ఎందుకు జరగలేదో కూడా విశ్లేషణ చేస్తారు.
ఇందులో ఎక్కువగా రెండు అంశాలు ఉంటాయి. ఇందులో ఒక్కటి ఇరాన్ అణ్వయుధాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నించడం, రెండోది ఇరాన్ లో నాయకత్వం మార్పు. ఈ విషయం పాశ్చాత్య దేశాలలో ముఖ్యంగా గత 25 సంవత్సరాలుగా అప్పడప్పుడూ చర్చించబడుతోంది.
ప్రపంచంలోని ఏ దేశము ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయాలని నిజంగా కోరుకోదు. ఇది వాస్తవం.. అందరూ అంగీకరించాల్సిన విషయం. ఈ యుద్ధం తరువాత ఇరాన్ దానిని తయారు చేయకుండా నిరోధించడానికి ఇజ్రాయెల్ ఇప్పుడూ తన వంతు కృషి(దాడులు) చేస్తుందని అంగీకరించాలి.
ఒకవేళ ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసి ఉంటే మొన్న అది చేసిన క్షిపణి దాడులల్లో ఇజ్రాయెల్ కు కచ్చితంగా తీవ్ర నష్టం జరిగి ఉండేది. వందలాది మిస్సైల్లు అది ప్రయోగించడంతో ఐరన్ డోమ్ సహ అనేక రక్షణ వ్యవస్థల నుంచి సరైన సమాధానం రాకుండా పోయింది.
ఇది పశ్చిమాసియా పరిస్థితిని మొత్తం మారుస్తుందని చూపించింది. హమాస్, హిజ్ బుల్లా వంటి ఉగ్రవాద గ్రూపులను అది ఇంకా ముందుకు వెళ్లి ఉండేది. అయితే ఇజ్రాయెల్ గాజాపై దాడి చేసినట్లు మాత్రం చేసి ఉండేది కాదు.
అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ అణు కేంద్రాలకు ఎంతమేర నష్టం కలిగిందో ఇంకా కచ్చితంగా తెలియదు. వాటిని తుడిచిపెట్టామని ట్రంప్ చెబుతున్నప్పటికీ, అమెరికా రక్షణ శాఖ నుంచి లీక్ అయిన సమాచారం ప్రకారం.. అణు కార్యక్రమం కేవలం కొన్ని నెలలు మాత్రమే వెనక్కి జరిగిందని తెలుస్తోంది.
ఇరానియన్లు యురేనియంను శుద్ది చేసే ప్రక్రియ నుంచి వెనక్కి జరిగే అవకాశమే లేదు. దానికి శుద్ది చేసిన యురేనియం నిల్వల సమస్య కూడా ఉంది. అయితే అది ఎంత ఉందో ఎవరికి తెలియదు. ఉన్నదానిని అణుబాంబుకు అవసరమైనంత మేర శుద్ది చేస్తారని నమ్ముతున్నారు.
ఉత్తర కొరియా మార్గంలో..
ఇరాన్ నుంచి ట్రంప్ ఒక ఒప్పందాన్ని కోరుకున్నాడు. యుద్ధం ముగిసిన తరువాత అమెరికా తిరిగి చర్చలు ప్రారంభించవచ్చు. కానీ ఆయుధాలను అభివృద్ది చేసే హక్కు అది వదులుకుంటుందని అనుకోలేము.
ఉత్తర కొరియా వద్ద అణ్వయుధాలు, డెలివరీ వ్యవస్థలు ఉన్నందున అమెరికా దానిపై ఎటువంటి చర్య తీసుకోలేకపోయిందని దానికి తెలుసు. అందువల్ల ఉత్తర కొరియా మార్గాన్ని అనుసరించాలనే ఇరాన్ కోరిక చాలా బలంగా ఉంటుంది.
రాబోయే కొన్ని సంవత్సరాలలో అణు రంగంలో ఇరానియన్ చర్యలు, అమెరికా.. ఇజ్రాయెల్ ప్రతిఘటలనపై అంతర్జాతీయ పరిశీలన పెరుగుతుంది. దీనితో పాటు చర్చలు కూడా ఉంటాయి. చర్చలు విజయవంతం అయినప్పటికీ ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయలేదని అవి నిర్ధారించలేవు.
ఖమేనీ నిష్క్రమణ అంటే.. వ్యవస్థ మార్పు కాకపోవచ్చు..
ఇరాన్ లో పాలన మార్పు అంటే ఖమేనీ నిష్క్రమణ అని అర్థం. అంటే చిన్న మత సంస్థలు అనే చిన్న సమూహం నుంచి ఎన్నుకోబడిన మత నాయకుడు అత్యున్నత అధికారాన్ని అప్పగించడం? ఇరాన్ కు ఎన్నికైన అధ్యక్షుడు, పార్లమెంట్ ఉంది.
కానీ మత నాయకులు సూచించిన వ్యక్తులు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతి ఉంది. ఈ వ్యవస్థను విలాయత్- ఏ- ఫకీహ్ అని పిలుస్తారు. ఇది 1979 లో షా పతనం తరువాత అయతుల్లా అలీ ఖమేనీ దీనిని స్థాపించారు.
ఈ వ్యవస్థ స్వేచ్ఛను అనుమతించదు. ముఖ్యంగా మహిళల పట్ల కఠినంగా ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. కానీ దానిని రక్షించడానికి ప్రజలపై బలప్రయోగం చేయడానికి ఎప్పుడూ వెనకాడని రివల్యూషనరీ గార్డ్స్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ వ్యవస్థ సమర్థవంతంగా సవాల్ చేయడానికి ప్రస్తుతం ఏ రాజకీయ శక్తి కానీ పార్టీ కానీ ఇక్కడ లేదు.
ప్రస్తుత ఇరాన్ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ. ఆయనకు 86 సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలలో ఆయన తప్పనిసరిగా పాలన నుంచి తప్పుకుంటారు.
ఆయన వారసుడిగా సజావుగా ఎన్నుకుంటారు. అంటే పాలన మార్పు జరుగుతుంది. ఎందుకంటే వారసుడికి తన అభిప్రాయాలు, మద్దతుదారులు ఉంటారు. కానీ దాని అర్థం వ్యవస్థ మార్పు కాదు. భవిష్యత్ లోనూ ఇది అసంభవం.
(ఫెడరల్ అన్ని వైపుల నుంచి అభిప్రాయాలు గౌరవిస్తుంది. వ్యాసంలోని సమాచారం, ఆలోచనలు లేదా అభిప్రాయాలు రచయితవి. ఇవి ఫెడరల్ అభిప్రాయాలు ప్రతిబింబించవు)