సెన్సెక్స్ 3వేల పాయింట్లకు పతనం.. అదే వరుసలో టెక్ మహీంద్రా..
టాటా స్టీల్ 8 శాతానికి, టాటా మోటార్స్ 7 శాతానికి పైగా నష్టపోయాయి. ఇక హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ, రిలయన్స్ వెనుకబడిపోయాయి.;
అమెరికా(America) అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) గతవారం ప్రకటించిన టారిఫ్(Tariff)తో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. రికార్డు స్థాయిలో సెన్సెక్స్ 3వేల పాయింట్లు పతనం కాగా.. నిఫ్టీ వెయ్యి పాయింట్లకుపైగా పతనమైంది.
ప్రారంభ ట్రేడింగ్లో 30 షేర్ల బీఎస్ఈ బెంచ్మార్క్ సెన్సెక్స్ 3,939.68 పాయింట్లు లేదా 5.22 శాతం పడిపోయి 71,425.01 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 1,160.8 పాయింట్లు లేదా 5.06 శాతం పడిపోయి 21,743.65 వద్ద ముగిసింది. సెన్సెక్స్లోని అన్ని సంస్థలు షేర్లు కొద్దిగా పడిపోయాయి. టాటా స్టీల్ 8 శాతానికి పైగా పడిపోయింది. టాటా మోటార్స్ 7 శాతానికి పైగా నష్టపోయాయి. హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, లార్సెన్ & టూబ్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనుకబడిపోయాయి.
ఆసియా మార్కెట్లలో సంక్షోభం..ఆసియా మార్కెట్లలో హాంకాంగ్కు చెందిన హాంగ్ సెంగ్ దాదాపు 11 శాతం, టోక్యోకు చెందిన నిక్కీ 225 దాదాపు 7 శాతం, షాంఘై ఎస్ఎస్ఇ కాంపోజిట్ ఇండెక్స్ 6 శాతానికి పైగా, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి ఇండెక్స్ 5 శాతం పడిపోయాయి.ఈ క్రమంలోనే సోమవారం ప్రారంభంలోనే సెన్సెక్స్ 3వేల పాయింట్లుకుపైగా పతనమైంది. నిఫ్టీ వెయ్యి పాయింట్లకుపైగా తగ్గింది. ప్రస్తుతం సెన్సెక్స్ 2540.33 పాయింట్లు తగ్గి.. 72824.03 వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ 817.5 పాయింట్లు తగ్గి.. 22806.95 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నది. ఇక డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి 30 పైసలు తగ్గి 85.74కి చేరింది.