సంకీర్ణంలోనూ మోదీ దక్షిణాదికి పట్టు చిక్కనివ్వడం లేదా?
మోదీ 3.0 దక్షిణాదికి ఎలా చెక్ పెట్టగలుగుతోంది!;
By : 491
Update: 2025-06-11 12:11 GMT
జింక నాగరాజు& మహాలింగం పొన్నుస్వామి& నవీన్ అమ్మెంబాల
నరేంద్ర మోదీ మూడోసారి పాలనా పగ్గాలు చేపట్టి సంవత్సరం పూర్తయింది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ దక్కింది. అంతకుముందు దశాబ్ధం పాటు దక్షిణాదికి కేంద్రంలో ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో సంకీర్ణంలో వాటికి కాస్త అవకాశం చిక్కింది.
ఎన్డీఏ కూటమిలో భాగంగా పోటీ చేసిన చంద్రబాబు నాయుడు ఆంధ్రలో తాను పోటీ చేసిన 17 సీట్లలో 16 గెల్చుకుంది. సినీ నటుడు పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కూడా తాను పోటీ చేసిన రెండు సీట్లలో విజయం సాధించింది.
పొరుగున కర్ణాటకలో కూడా ఎన్డీఏ కూటమిలో భాగంగా పోటీ చేసిన హెచ్ డీ కుమార స్వామి(జేడీఎస్) పార్టీ మూడు సీట్లలో పోటీ చేసి రెండు స్థానాలు గెలుచుకుంది. ఈ సంఖ్యలు మనకు చాలా పెద్దగా అనిపించకపోవచ్చు.
కానీ కేంద్రంలో బీజేపీ సొంత బలం కేవలం 240 కే తగ్గిపోయింది. 2019 లో 303, 2014 లో 282 సీట్లతో పోల్చి చూస్తే ఇక్కడ ప్రతిసీటు ముఖ్యమైనదే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హెచ్ డీ కుమారస్వామి మొదటిసారి సంకీర్ణానికి నాయకత్వం వహిస్తున్న మోదీకి తమ గొంతెమ్మ కోరికలతో తలనొప్పులు కలిగిస్తారని అంతా అనుకున్నారు.
తమ రాష్ట్రాలకు నిధుల వరద పారిస్తారని కూడా విశ్లేషకులు భావించారు. ప్రధానిగా మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టి జూన్ 9 తో సంవత్సరం పూర్తి అయింది. విశ్లేషకులు అనుకున్నది ఏది ఇప్పటి వరకూ జరగలేదు.
గత సంవత్సరం సంకీర్ణ కూటమి నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ గా మరోసారి ఢిల్లీలో చక్రం తిప్పుతారని అనుకున్నారు. తను రాజకీయంగా సపోర్టు ఇచ్చినందుకు ఎన్డీఏ నుంచి ఉదారంగా నిధులు సాధిస్తారని ఆంధ్ర ప్రజలు ఆశించారు.
సడన్ గా ప్లేట్ ఫిరాయించడంలో చంద్రబాబుది అందెవేసిన చేయి కావడంతో మోదీ సైతం తన స్వభావాన్ని పక్కనపెట్టి కూడా ఆంధ్రప్రదేశ్ కు తన మద్దతును కొనసాగిస్తారని భావించారు. కానీ ఈ ఏడాది పాలనలో అవన్నీ తప్పని నిరూపించబడ్డాయి.
చంద్రబాబు నాయుడు అనేక సార్లు ఢిల్లీ వెళ్లడం మోదీని సంతోషపెట్టాలనే స్పష్టమైన ఆత్రుత, ఎవరు ఎవరిపై ఆధారపడి ఉన్నారో అందరిని ఆశ్చర్యపరిచింది. 2024 జూన్ లో మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత చంద్రబాబు నాయుడు 12 సార్లు ఢిల్లీ వెళ్లారు. వెళ్లిన ప్రతిసారి మోదీ, అమిత్ షా ను కలిసి వచ్చారు.
ప్రతి బహిరంగ సభలో మోదీని చంద్రబాబునాయుడు దేశభక్తుడిగా కీర్తించడం పరిపాటిగా మారింది. అనుభవజ్ఞుడైన నాయకుడు అయినప్పటికీ తాను మోదీ నుంచి అనేక విషయాలు నేర్చుకుంటున్నానని తరుచుగా చెప్తున్నారు.
బహిరంగ డిమాండ్ లు ఏవీ?
చంద్రబాబు నాయుడి వైఖరి ఎవరికి అంతుబట్టడం లేదు. ఆయన బహిరంగంగా కేంద్రాన్ని ఏమి డిమాండ్ చేయడం లేదు. ముఖ్యంగా 2014 ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన చాలా అంశాలపై నోరు మెదపడం లేదు.
రాజధాని నిర్మాణంలో తొందరపడకపోవడంతో చాలా వాటికి ఆదాయం రాష్ట్రం నుంచి సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు.
డీలిమిటేషన్ విషయంలో కూడా దక్షిణ భారతంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగా ఆయన ఆందోళన వ్యక్తం చేయడం లేదు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనాభా ఆధారంగా మాత్రమే డీలిమిటేషన్ చేయాలని, దక్షిణాదికి పార్లమెంట్ లో తగ్గే ప్రాతినిధ్యం మోదీ పరిష్కరిస్తారని ఆయన సౌమ్యంగా చెప్పారు.
కేంద్రం టీడీపీ మీద ఆధారపడినప్పటికీ, అక్కడి నుంచి ఆంధ్రకు పెద్దగా ఏమి లభించలేదు. రాష్ట్ర శాసనసభలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలే ఉన్నప్పటికీ దానికి మాత్రం రెండు రాజ్యసభ స్థానాలు కేటాయించారు.
రాష్ట్రంలో కమలదళానికి కేవలం 2.83 శాతం మాత్రమే ఓట్లు ఉన్నప్పటికీ రాజకీయంలో మాత్రం గణనీయమైన ప్రాధాన్యం లభించింది. వైసీపీ విడిచిపెడుతున్న నాయకులందరూ కూడా టీడీపీ లేదా జనసేనలో చేరకుండా బీజేపీలో చేరుతున్నారు.
ఎందుకు ఇలా జరగుతోంది..?
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన పొలిటికల్ సైన్ విభాగం ప్రొఫెసర్ ఈ. వేంకటేశు ప్రకారం.. మోదీని డిమాండ్ చేసే విషయంలో చంద్రబాబు నాయుడు జాగ్రత్తగా ఉన్నారు.
175 అసెంబ్లీ సీట్లు ఉన్న 39.7 శాతం ఓట్లు సాధించింది జగన్ పార్టీ. వైసీపీ కేవలం 11 సీట్లే వచ్చినప్పటికీ ఆయన భవిష్యత్ లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని వేంకటేశు ‘ ది ఫెడరల్’ తో అన్నారు. ‘‘నాయుడు తన డిమాండ్లతో ప్రధాని మోదీని ఇబ్బంది పెట్టకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు’’ అని ఆయన చెప్పారు.
‘‘చంద్రబాబుకు 2029 ఎన్నికలు చాలా కీలకమైనవి. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది అమరావతి నిర్మాణం జరిగేలా చూసుకోవాలి. రెండవది ఆయన కుమారుడు లోకేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టాలి’’ అని వేంకటేశు అన్నారు.
అందుకే మనం చూస్తున్న మార్పులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు నేతృత్వంలోని సంకీర్ణంలా కాకుండా, మోదీ నేతృత్వంలోని సంకీర్ణంలా కనిపించడానికి ఇదే కారణంమని అభిప్రాయపడ్డారు.
తమిళనాడులో పరిస్థితి ఎలా ఉందంటే..
దక్షిణాదిలో బీజేపీకి కొరకుడుపడని కొయ్యల్లో తమిళనాడు ఒకటి. బీజేపీ ఇంకా ఇక్కడ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోతోంది. ‘‘నేను ఢిల్లీలో ఉంటున్నప్పటికీ నా చెవులు ఎల్లప్పుడూ తమిళనాడు వైపే ఉంటాయి’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా జూన్ 8న రాష్ట్ర పర్యటన సందర్భంగా అన్నారు. అంటే రాష్ట్రానికి ఎంతల ా ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతోంది.
కమలదళానికి తమిళనాడు, కేరళ ఇప్పటి వరకూ చిక్కలేదు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఇక్కడ పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం తిరిగి అన్నాడీఎంకే తో చేతులు కలిపింది.
అధికార పార్టీ డీఎంకేను ఎదుర్కోవడానికి అది అన్నాడీఎంకేనే నమ్ముకుంది. అన్నాడీఎంకేను ఆకర్షించడానికి అది ఏకంగా రాష్ట్ర చీఫ్ అన్నామలైని పక్కనపెట్టి, నైనార్ నాగేంద్రన్ కు పగ్గాలు అప్పగించింది. అన్నామలై తీసుకున్న ఘర్షణాత్మక వైఖరి ఇతర పార్టీలతో బీజేపీ సంబంధాలను ఘోరంగా దెబ్బతీసింది.
తమిళనాడు ఎన్డీఏ కూటమికి మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి నాయకత్వం వహిస్తున్నారు. వీరి ప్రణాళిక ప్రకారం.. బీజేపీకి పెరుగుతున్న పట్టణ, మధ్యతరగతి మద్దతుతో అన్నాడీఎంకే సాంప్రదాయ ఓటర్లను కలపడం వీరి వ్యూహం.
2024 లోక్ సభ ఎన్నికల్లో విడివిడిగా పోటీచేసినప్పటికీ అన్నాడీఎంకే, బీజేపీ దాదాపుగా 41 శాతం ఓట్లను సాధించింది. డీఎంకే నేతృత్వంలోని కూటమి 47 శాతం ఓట్లను సాధించింది. రెండింటి మధ్య పూడ్చుకోగల తేడానే ఉంది. ఎన్నికల సమయంలో రెండు పార్టీలు పొత్తుపెట్టుకుంటే 34 నియోజకవర్గాల్లో వారి ప్రభావం తప్పకుండా కనిపించి ఉండేది.
అమలు చేయడం కష్టమే..
రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నప్పటికీ ముందుకు సాగే మార్గం మాత్రం అంత సులభంగా కనిపించడం లేదు. అన్నాడీఎంకేను ఎన్డీఏలోకి చేరడం చాలా కష్టంగా ఉంది.
హిందీ విధింపు, డీలిమిటేషన్ వంటి ఉత్తరాది ఆధిపత్యం, సున్నితంగా ఓటర్లను బీజేపీకి, అన్నాడీఎంకే కూటమికి దూరం చేస్తుంది. ఏఐఏడీఎంకే కార్యకర్తలలో ఒక వర్గం బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు.
ఈ కూటమికి మరో అడ్డంకి ఏంటంటే.. ఎన్డీఏలో ఉన్న పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే), దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం(డీఎండీకే) వంటి చిన్న పార్టీలను సర్దుబాటు చేసుకోవడం.
ఈ రెండు ప్రాంతీయ పార్టీలు గణనీయమైన సీట్లను కోరవచ్చు. వీటిని ఈపీఎస్, బీజేపీ నాయకత్వం పరిష్కరించాల్సి వచ్చింది. మిత్రపార్టీల ఆశలను అన్నాడీఎంకే ఆధిపత్య పాత్రలో సమతుల్యం చేయడం వలన ఇబ్బంది తలెత్తవచ్చు.
కర్ణాటకలో పరిస్థితి ఏంటీ?
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత గత ఏడాది బీజేపీ 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జేడీఎస్ తో చేతులు కలిపింది. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ మంచి ప్రదర్శన ఇచ్చింది. దీనితో సిద్దరామయ్య సర్కార్ దూకుడు కాస్త తగ్గింది.
రాష్ట్రంలోని 28 లోక్ సభ స్థానాల్లో బీజేపీ 17 గెలుచుకుంది. జేడీ(ఎస్) రెండు స్థానాలు సాధించింది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ తొమ్మిది సీట్లకు పరిమితం అయింది. జేడీఎస్ బలం తక్కువగా ఉన్నప్పటికీ పార్టీకి రెండు మంత్రిపదవులు లభించాయి.
కేంద్రమంత్రిగా హెచ్ డీ కుమారస్వామి రాష్ట్రంలో కీలక ప్రాజెక్ట్ లు ప్రారంభించడానికి చురుకుగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా భద్రావతిలోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్), విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్(వీఐఎస్ఎల్) పునరుద్దరణ కూడా ఉన్నాయి.
ఇవి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు సృష్టించడానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. కర్ణాటకలో ప్రజా రవాణాను మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్ బస్సు ప్రాజెక్ట్ లను కూడా ఆయన ప్రకటించారు.
కానీ బీజేపీలో మాత్రం సంక్షోభాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆధిపత్య పోరు, సమర్థతలేని నాయకత్వం పార్టీని వేధిస్తోంది. ఈ సమయంలోనే తన పార్టీ ప్రభావాన్ని పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వంలో తన పాత్రను ఉపయోగిస్తున్నారు.
కుల సమీకరణాలు..
2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ ల ఉమ్మడి వారసత్వం కాంగ్రెస్ కు సవాల్ విసురుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చారిత్రాత్మకంగా జేడీఎస్, బీజేపీలను కాంగ్రెస్ మద్దతుదారులు శత్రువులుగా భావిస్తారు. వారిలో కింది స్థాయి కార్యకర్తలు మాత్రం ఎక్కువగా కాంగ్రెస్ వైపు విధేయత చూపే అవకాశం లేదు.
హెచ్ డీ దేవేగౌడ, కుమారస్వామికి విధేయులుగా ఉన్న ఒక్కలిగ వర్గం ఎన్డీఏ వైపు ఆకర్షితులవుతుందని భావిస్తున్నారు. సాంప్రదాయకంగా అహిందా( మైనారిటీలు, వెనకబడిన తరగతులు, దళితులు) పై ఆధారపడే కాంగ్రెస్ ను ఎదుర్కోవడానికి ఒక్కలిగ, లింగాయత్ సంకీర్ణం బలంగా నిలుస్తుందని బీజేపీ భావిస్తోంది.
జేడీ(ఎస్) ప్రధానంగా పాత మైసూర్ లో బలమైన స్థావరం కలిగిన ప్రాంతీయ పార్టీ అయినప్పటకీ దాని ప్రధాన మద్దతు వొక్కలిగ నుంచి వస్తుంది. డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్, ఆర్ అశోక వంటి నాయకులను ఒక్కలిగ ఎదుర్కొంటున్నట్లుగా చూపించడానికి బీజేపీ ప్రయత్నించినప్పటికీ వారు బలమైన మద్దతు పొందలేకపోయారు.
ఈ ప్రయత్నానికి విరుద్దంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కలిగ వల్ల కొంత లాభం సాధించగలిగారు. కానీ 2024 లోక్ సభ ఎన్నికలు జేడీఎస్ పై వారి ప్రాధాన్యతను చూపెట్టాయి. ముఖ్యంగా బెంగళూర్ రూరల్ లో బీజేపీ- జేడీఎస్ కూటమి శివకుమార్ సొదరుడు డీకే సురేష్ ను సైతం ఓడించింది.