'ఆయుధంలాంటి మనిషి' కవిత్వ సంపుటి ఆవిష్కరణ

సాహితీ స్రవంతి, కడప శాఖ ఆధ్వర్యంలో 20వ తేదీన సి.పి. బ్రౌన్ గ్రంథాలయం లో

Update: 2025-08-16 03:27 GMT

ప్రముఖ కవి, ఏఎస్పీ  లోసారి సుధాకర్  రచించిన 'ఆయుధంలాంటి మనిషి' కవిత్వ సంపుటి ఆవిష్కరణ కార్యక్రమాన్ని సాహితీ స్రవంతి, కడప శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ, బుధవారం, సాయంత్రం 5:30 గంటలకు కడపలోని సి.పి. బ్రౌన్ గ్రంథాలయం, ఎర్రముక్కపల్లిలో నిర్వహిస్తున్నట్లు సాహితీ స్రవంతి కన్వీనర్ లెనిన్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. 


సాహితీ స్రవంతి, కడప శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు  పిళ్లా కుమారస్వామి అధ్యక్షత వహిస్తారు.

ప్రముఖ సాహితీ విమర్శకులు, విశ్రాంత ఆచార్యులు డా. మేడిపల్లి రవికుమార్ పుస్తకాన్ని ఆవిష్కరించి, సమీక్షను అందిస్తారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్, ఆత్మీయ అతిథిగా సీనియర్ న్యాయవాది, అంబేద్కర్ మిషన్ ఛైర్మన్  సంపత్ కుమార్ హాజరవుతారు.

పుస్తక రచయిత శ్రీ లోసారి సుధాకర్ తన స్పందనను తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి సాహితీప్రియులు, కవులు, రచయితలు, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా నిర్వాహకులు కోరారు.


Tags:    

Similar News