‘అడవి మనిషి’ అంకారావు సిఎం హృదయ్యాన్నిఎలా గెలిచాడు?

ఇంతకీ ఎవరీ అంకారావు;

Update: 2025-06-09 08:34 GMT
అంకారావు ని అభినందిస్తున్న సీఎం.చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

‘ పల్నాడు జిల్లా నల్లమల కొండల్లో పుట్టిన ఈ నాగులేరు నది 70 కిలో మీటర్లు ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. అక్కడి నుండి సముద్రంలో కలుస్తుంది.

పల్నాటి యుద్ధం ఈ నది ఒడ్డునే జరిగిందని చరిత్రలో ఉంది.

పల్నాటి ఉత్సవాలు సమయంలో ఈ నదిలో భక్తులు ఒకపుడు పుణ్యస్నానాలు చేసేవారు. అలాంటి పవిత్రనది ఎలా అయిపోయిందో చూడండి. ప్లాస్టిక్‌ తో కలుషితం అయి పోయింది.... ’ మురికితో దుర్వాసన వస్తున్న నదిలోని ప్లాస్టిక్‌ వ్చర్దాలను ఏరి బయటకు తీసుకువస్తూ అన్నాడు కొమెర అంకారావు.

పల్నాడు జిల్లాలో నాగులేరు నదిని శుభ్రం చేస్తున్న కొమెర అంకారావు

ఇతడు నిత్యం నల్లమల అడవిలో ఒంటరిగా గోనె సంచీతో తిరుగుతుంటాడు. చేతిలో ప్లాస్టిక్‌ వ్యర్ధాలు... గుండెల్లో ప్రకృతి పట్ల అపారమైన ప్రేమ. గత 3 దశాబ్దాలుగా ఒక ఉద్యమంలా ఇదే పని చేస్తున్నాడు.

ప్రపంచపర్యావరణ దినోత్సవం ( జూన్‌ 5, 2025 ) సందర్భంగా అమరావతిలో ఏర్పాటయిన కార్యక్రమంలో పాల్గొన్న అంకారావు జీవితంలో ఒక అద్భుతం జరిగింది.

అడవులు అంతరించిపోవడం, పూలు వికసించడానికి ప్రకృతికి ఉన్న సంబంధాన్ని వివరిస్తూ, వేదిక మీద అనర్గళంగా ఉపన్యసిస్తున్న అంకారావు వైపు సీఎం చంద్రబాబు మెచ్చుకోలుగా చూశారు.

అప్పటికపుడే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా అంకారావును ఏపీ సీఎం చంద్రబాబు వేదిక మీద ప్రకటించారు. ఆ క్షణం వరకు తన జీవితం మలుపు తిరగుతుందని అంకారావుకు తెలీదు.

‘ పర్యావరణం కోసం పనిచేస్తున్న నాతో పాటు మరో నలుగురికి సన్మానం అంటే వెళ్లాను. నా ఉపన్యాసం ముగియ గానే, అప్పటికపుడు సీఎం గారు అటవీ పర్యావరణ శాఖకు సలహాదారుగా నన్ను ప్రకటిస్తారని అస్సలు ఊహించ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గారికి కృతజ్నతలు. వారు నాకు అప్ప చెప్పిన బాధ్యతను నెరవేర్చడమే ధ్యేయంగా ముందుకు వెళ్తాను . ’ అని వినయంగా అన్నాడు అంకారావు.

పర్యావరణ దినోత్సవ వేడుకల్లో ఉపన్యసిస్తున్న అంకారావు

చంద్రబాబు హృదయాన్ని గెలిచిన అంకారావు కథ ఏంటీ ? నల్లమల అటవీ పరిరక్షణకు ఎలాంటి కృషి చేశారు ?

ఆంధ్రప్రదేశ్‌ లోని పల్నాడు జిల్లా, కారంపూడికి చెందిన అంకారావుది పేద మధ్యతరగతి కుటుంబం. తండ్రి రాములు,తల్లి ఏడుకొండలు. వారు వ్యవసాయ కూలీలు. దూరవిద్యలో డిగ్రీ పీజీ పూర్తి చేశాడు.

ఉదయాన్నే సమీపంలోని నల్లఅడవిలోకి అడుగు పెడతాడు.

చెట్ల కింద పడి ఉన్న ప్లాస్టిక్‌ బాటిళ్లను ఏరేస్తాడు.

కాలుష్యంతో నిండిపోయిన కుంటల్లోకి దిగుతాడు. నీళ్లలోని ప్లాస్టిక్‌ చెత్తను తీసివేసి, స్వచ్ఛంగా మారుస్తాడు. ఆయన వైపే ఆశగా చూస్తున్నపక్షులకు కొన్ని గింజలను వేస్తాడు.

తనకున్న చివ్న పొలంలో వ్యవసాయం చేస్తాడు. సజ్జలు, జొన్నలు పండిరచి దానిలో సగం పంటను పక్షులకే వదిలేస్తాడు. పక్షులుంటేనే అడవి. అడవి ఉంటేనే వాన ... అని గట్టిగా నమ్మే మనిషి అంకారావు.

నల్లమల అడవిలో ప్లాస్టిక్‌ వ్యర్దాలను ఏరి వేస్తున్న అంకారావు

ప్రకృతి పాఠశాల! 

‘‘ మొక్కలు నాటే ముందు, వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. అన్ని మొక్కలు ఆక్సిజన్‌ ఇవ్వవు. కొన్ని మొక్కలు పంటలను నాశనం చేస్తాయి. మనకు ఆహారం లేకుండా చేస్తాయి. వాటిని నివారించడం కూడా తెలుసుకోవడమే అసల్కెన పర్యావరణం. ’’ అని స్కూల్‌ పిల్లలకు చెబుతాడు అంకారావు.

అడవికి సమీపంలో ఉంటున బడిపిల్లలను తీసుకెళ్లి ఆ మొక్కలను చూపించి వాటి వేర్లు, కాండం, బెరడు, ఆకులు, మొగ్గలు, పూలు, కాయలు, పండ్లు, గింజలు, చిగుళ్ల లోని ఔషధ గుణాలను వివరిస్తాడు.

విత్తన బంతులతో అడవి విస్తరిస్తోంది 

‘ తొలకరి ప్రారంభంలో సీడ్‌ బాల్స్‌ తయారు చేసి అడవిలో వదులుతాం.

వాటి తయారీలో స్కూల్‌ పిల్లలను భాగస్వాములను చేస్తాను. దాని వల్ల అడవి ఎలా పెరుగుతుందో వారికి అవగాహన కలుగుతుంది ’ అంటాడు అంకారావు.

అతడి నిబద్ధతను గుర్తించిన సప్తగిరి నర్సరీ( కడియపు లంక, రాజమండ్రి ) వందలాది మొక్కలను ఉచితంగా అందించారు. అవన్నీ అడవిలో నాటి రోజూ నీళ్లు పోసి పెంచాడు అంకారావు.

అడవిలోనే తిరుగుతూ అరుద్కెన ఔషధ మొక్కలు కనిపెట్టి, వాటిని అందరికీ పరిచయం చేస్తుంటారు.. కారంపూడి ప్రాంత వాసులకు ప్రకృతి వన మూలికా నిపుణుడుగా సుపరిచితుడు.

బడి పిల్లలకు ప్రకృతి పాఠాలు చెబుతున్న అంకారావు

ప్రకృతి మీద పలు పుస్తకాలు 

అడవుల్లో సంచరిస్తున్నపుడు అరుదైన ఆహారపు మొక్కలు, ఔషధ గుణాలున్న మొక్కలను గుర్తించి వాటిని డాక్యుమెంట్‌ చేశాడు.

గత దశాబ్ద కాలంగా సేకరించిన ప్రకృతి జ్నానంతో 4 పుస్తకాలు రాశాడు.

అంకారావు రాసిన పుస్తకాలు

1, ప్రకృతి వైద్యం, 2,ప్రాచీన మూలికా వైద్యం, 3, ప్రకృతి పాఠశాల, 4,ప్రకృతి ఆహారం

మిద్దెమీద పెంచాల్సిన మొక్కలు 

ఇంటిపైన కూరగాయల సాగు ఇపుడు కొత్త ట్రెండ్‌. వాటితో పాటు కొన్ని ఔషధ మొక్కలు కూడా పెంచుకుంటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది అంటాడు జాజి.

1, రోడ్డుపక్క కనిపించే నేలఉసిరిని పచ్చకామెర్ల చికిత్సలో ఉపయోగిస్తారు.

2, మానసిక రుగ్మతల చికిత్సలో జటామాంసి, అశ్వగంధి, బ్రహ్మి, జలబ్రహ్మి, శంఖపుష్పిని వాడుతున్నారు.

3, సుంగంధపాల, అత్తాకోడళ్ల చెట్టు, ముళ్ల గోరింట, పాలబర్రంకి, మగలింగ మొక్క, కొండపిండి, ఉత్తరేణి ఇవన్నీ అరుద్కెన ఔషధగుణాలున్న మొక్కలే.

4, కలుపుజాతి కి చెందిన గడ్డి చేమంతి మొక్కను ఎగ్జిమా నివారణకు శక్తిమంతంగా పనిచేస్తుంది. ఆదివాసీలు పశువుల గాయాలు, పుండ్లకు వ్కెద్యం చేయడానికి ఉపయోగిస్తున్నారు.

అశ్వగంధ, తిప్పతీగ, శతావరి, బోడతరము, చిత్రమూలము, నేలతంగేడు, పసుపు, పాలసుగంధి, సరస్వతి, అడ్డసర వంటివి పెరట్లో, పొలాల్లో పెంచుకుంటే వైద్యుడి తో పని ఉండదు అంటాడు జాజి.

యూట్యూబ్‌ ఛానెల్‌ విలేజ్‌ ల్కెఫ్‌ జర్నీ

మారుమూల అడవుల్లో సేకరించిన ఔషధ మొక్కలను అందరికీ పరిచయం చేయడం కోసం ‘ విలేజ్‌ ల్కెఫ్‌ జర్నీ ’ యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తున్నారు జాజి. కొన్ని వందల వనమూలికలు వాటి ఔషధ గుణాలను ఈ ఛానెల్‌లో అడవిలో తిరుగుతూ వివరిస్తారు. లక్షకు పైగా సబ్స్‌తో ఆ ఛానెల్‌ ప్రాచుర్యం పొంది ‘యూట్యూబ్‌ సిల్వర్‌ ప్లే బటన్‌ అవార్డ్‌ ’ అందుకుంది.

‘యూట్యూబ్‌ సిల్వర్‌ ప్లే బటన్‌ అవార్డ్‌ ’ అందుకున్న అంకారావు.

సరళమైన పాఠాలు

‘ ప్రాక్టికల్‌గా మొక్కలను చూపించి, ఆకట్టుకునేలా సరళంగా చెప్పే అంకారావు క్లాసులు మా విద్యార్దుల్లో చాలా మార్పు తెచ్చాయి. అడవులంటే ఏవో చెట్లు కాదు... క్రిములు కీటకాలు పక్షులు నీళ్లు జలచరాలు జంతువులు నాచు తేమ... ఇవన్నీ అడవిలో భాగం... అవన్నీ ఒకదానిపై మరొకటి ఆధారితం అని పిల్లలు అవగాహన చేసుకుంటున్నారు. స్కూల్‌ గ్రౌండ్‌లో కొన్ని ఔషధ మొక్కలు నాటి కాపాడుతున్నారు. ఏమీ ఆశించ కుండా ఇంత విలువైన జ్ణానం పంచుతున్న జాజి లాంటి యవకుడు ఈ సమాజానికి గొప్ప స్ఫూర్తి.’’ అంటారు పల్నాడు జిల్లా ,కోచర్ల కు చెందిన టీచర్‌ రాములు నాయక్‌.

ఇప్పటి వరకు పల్నాడు జిల్లాలోని నల్లమల అడవికి మాత్రమే పరిమితమైన అంకారావు కృషి ఇపుడు ఇంకా విస్తరించాల్సిన అవకాశం కలిగింది. ప్రభుత్వ సలహాదారుడిగా రాష్ట్రమంతా తన ఆకుపచ్చని కలలను నెరవేర్చుకోవాల్సి

ఉంది. ప్రభుత్వ సహకారం ఎంత వరకు ఉంటుందో కాలమే చెప్పాలి.

Tags:    

Similar News