ఉప్పలపాడు వలస పక్షులు వర్ధిలాలి...

ఉప్పలపాడు చెరువుకు పక్షల భద్రతటాకంగా త్వరలో గుర్తింపు;

Update: 2025-06-03 08:29 GMT

ఈ పక్షుల సంరక్షణా కేంద్రం పక్షుల అభయారణ్యంగా గుర్తింపు పొందబోతోందా.. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభం కావడంతో ఆ ప్రాంతవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఖండాంతరాల నుంచి ఇక్కడికి వచ్చే వలస పక్షులు ఉప్పలపాడు మంచినీటి సరస్సులో సేదతీరడమే కాకుండా పర్యావరణ ప్రేమికులకు కనువిందు చేస్తుంటాయి.ఇప్పటి వరకూ కేవలం అధికారికంగా గుర్తింపు లేని చిన్న పక్షుల సంరక్షణా కేంద్రంగా వున్న ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందడానికి అడుగులు పడుతున్నాయి.

ఉప్పలపాడు ప్రత్యేకత ఏంటి..

ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా ఉప్పలపాడు చిన్న గ్రామం .రాష్ట్ర రాజధాని ప్రాంతానికీ సమీపంలో వుంటుంది. ఇక్కడ వున్న మంచినీటి సరస్సు తొమ్మిదిన్నర ఎకరాలలో చుట్టూ చిన్న అటవీ ప్రాంతంగా అందరిని అలరిస్తుంది.ప్రతి సంవత్సరం అక్టోబరు నుంచి మార్చి మద్య వేలాదిగా విదేశీ వలస పక్షులకు ఆ ప్రాంతం చక్కటి ఆతిధ్యం ఇస్తుంది.రకరకాల పక్షుల కిలకిలారావాలతో ఆ ప్రాంతం ఎంతో కనువిందు చేస్తోంది.ప్రతి ఏటా ఖండాలు దాటుకుని వలస వచ్చే దేశదేశాల పక్షులకు ఉప్పలపాడు వల‌స‌ ప‌క్షుల సంర‌క్ష‌ణ కేంద్రం ఆవాసం.ఆస్ట్రేలియా, సైబీరియా, ద‌క్షిణాఫ్రికా, శ్రీలంక‌, నేపాల్ వంటి దేశాల‌తో పాటు హిమాల‌యాల నుంచి కూడా ప‌క్షులు ఆయా కాలాల‌ను బ‌ట్టి వ‌ల‌స వ‌స్తూ ఉంటాయి. బి్డ్ పెలికాన్లు, పెయింటెడ్ కొంగలు ,ఓపెన్ బిల్ కొంగలు, తెల్ల ఐబిసెస్ ,గ్లోసీ ఐబిసెస్ సహా 25 కంటే ఎక్కువ జాతులు ఇక్కడికి వస్తాయ. దీనికి జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వ‌చ్చింది. అయినా, అందుకు త‌గ్గ‌ట్టుగా ఏర్పాట్లు లేక‌పోవ‌డంతో వ‌ల‌స‌ ప‌క్షుల సంఖ్యతో పాటు ప‌ర్యట‌కుల సంఖ్య‌ కూడా రానురాను త‌గ్గుతోంది.

ఈ గ్రామంలోని మంచినీటి చెరువును ఒక‌ప్పుడు గ్రామ అవ‌స‌రాల‌కు వినియోగించేవారు. అయితే, వివిధ ర‌కాల వ‌ల‌స ప‌క్షులు సీజ‌న్ల వారీగా ఇక్క‌డికి వస్తుండటంతో ఆ చెరువు ఇప్పుడు ప‌క్షుల‌ సంరక్షణ కేంద్రంగా మారిపోయింది.దీంతో ఉప్పల‌పాడు ఎప్పుడూ ప‌క్షుల సంద‌డితో కళకళలాడుతూ వుంటుంది.

సంరక్షణ అభయారణ్యంగా గుర్తింపుకు సన్నాహాలు

వన్యప్రాణులసంరక్షణా చట్టం 1972 ప్రకారం ఉప్పలపాడు ప్రాంతాన్ని సంక్షణ అభయారణ్యంగా ప్రకటించడానికి రంగం సిద్దం అయింది. అన్ని అనుమతులు తీసుకున్నామని , వివిధ విభాగాల ఆమోదం కూడా లభించిందని జిల్లాఇంఛార్జ్ కలెక్ఠర్ భార్గవ తేజ వెల్లడించారు.వనయప్రాణుల అభయారణ్యంగా గుర్తింపు పొందితే చట్ట పరమైన గుర్తింపు రావడమే కాకుండా , ఆ ప్రాంతం మరింతగా అభివద్ది చెందుతుందని అధికారులు తెలిపారు.

సరస్సులో రెడు ఎకరాలలో విస్తరించి వున్న 14 రకాలవృక్ష సంపదతో గుట్టలు వున్నాయని , అవన్నీ పక్షులు గూళ్లు కట్టుకునే ప్రదేశాలుగా పనికి వస్తాయని అటవీ అధికారులు తెలిపారు. గూళ్లు కట్టుకోడానికి అనుకూలంగా అటవీ శాఖ కూడా 14 కృత్రిమ పెర్చింగ్ స్టాండ్ లు ఏర్పాటు చేసింది.రెండు దశాబ్దాలుగా అటవీ శాఖ ఆ ప్రాంత అభివృద్దికి కృషి చేస్తున్నప్పటికీ చట్టపరమైన మద్దతు లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయని , ఇప్పుడు అభయారణ్యంగా ప్రకటిస్తే మరింతగా అభివృద్దికి నోచుకుంటుందని జిల్లా అటవీ శాఖ అధికారిణి హిమ శైలజ తెలిపారు.

పర్యావరణ విద్య కేంద్రంగా అభివృద్ది

మంచినీటి సరస్సు చుట్టు పక్కల ప్రాంతాలప్రజలు సహకారంతో ఇప్పటి వరకూ అటవీ శాఖ ఉప్పలపాడు ప్రంతన్ని సంరక్షిస్తోంది. అక్కడికి వచ్చే పర్యాటకులకూ , విద్యార్ధులకూ విజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించే విద్యార్ధుల కోస పర్యావరణ విద్య కేంద్రాన్ని అభివృద్ది చేయాలని అటవీ శాఖ ప్రణాళికలు సిద్దం చేసింది.సరస్సు అభివృద్దికీ సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. చెరువులో పక్షులకు సరియైన ఆహారం లభించడం లేదు. దాంతో పక్షులు చుట్టు పక్కల ప్రాంతానికి వెళుతున్నాయి.ఇప్పుడు చట్టబద్దంగా ఆ ప్రాంతానికి గుర్తింపు లభిస్తే నిధుల కొరత లేకుండా పక్షుల సంరక్షణ జరుగుతుంది. పక్షులు లేన సమయంలో చెరువులోనీటిని మార్చడం , పక్షులకు కావాల్సిన చేపలను పెంచడం, సరస్సు చుట్టూ చెట్లు మరింత పెరిగేలా చూడటం వంటి కార్యాచరణచేపట్టేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. ఏదైనా ఆ ప్రాంతం అభయారణ్యంగా గుర్తింపు పొందితో ఉప్పల పాడు ఆంధ్రప్రదేశ్ లోనే అతి ముఖ్యమైన విదేశీ పక్షుల ఆవాస కేంద్రంగా ప్రాచుర్యం పొందే అవకాశం వుంది.

Tags:    

Similar News