ఖతార్ పై ఇరాన్ దాడి, ప్రవాస భారతీయులను షాక్ కు గురిచేసిందా?

విమాన ప్రయాణాల రద్దుతో ఇంటికి దూరమయ్యానే భావన కలుగుతుందన్న మలయాళీలు;

Update: 2025-06-24 07:19 GMT
స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయులు

ఇరాన్- ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామాజిక మాధ్యమంలో ప్రకటించారు. అయితే రెండు దేశాలు ఇంకా వీటిని అధికారికంగా ధృవీకరించలేదు.

కానీ అంతకుముందు అమెరికా, ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయడంతో టెహ్రాన్ కూడా గల్ఫ్ లో ఉన్న యూఎస్ సైనిక స్థావరాలపై క్షిపణులను ప్రయోగించింది. ముఖ్యంగా ఖతార్ లో ఉన్న సైనిక బేస్ లను లక్ష్యంగా దాడులు జరిగాయి.
ఈ ప్రతీకారదాడులు అక్కడ పనిచేస్తున్న ప్రవాస భారతీయులను దిగ్బ్రాంతికి గురి చేశాయి. వారి కుటుంబాలు భద్రత గురించి ఆందోళన చెందుతున్నాయి. ‘‘క్షిపణలు ఎగరడం, అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకోవడం మేము చూశాము. ఇది మా ప్లాట్ నుంచి కొద్ది దూరంలోనే ఉన్నాయి’’ అని దోహాలో ఉన్న మలయాళీ, అంతర్జాతీయ మీడియా సంస్థలతో కలిసి పనిచేస్తున్న అనిల్ ఆనంద్ అన్నారు.
ఈ జర్నలిస్ట్ ఫోన్ మాట్లాడాడు. ‘‘మేము సురక్షితంగా ఉన్నాము. కానీ భయం మాత్రం ఉంది. దాడి జరగబోతోందని, పౌరులెవరూ లక్ష్యంగా చేసుకోలేదని టెహ్రాన్ నుంచి మాకు సమాచారం అందింది. కానీ కచ్చితంగా చెప్పలేము.
ఈ రోజు నాకు సెలవు దినం. కానీ ఏదైన పరిస్థితి తలెత్తినే నేను మా ఆఫీస్ కు వెళ్లాల్సి ఉంటుంది. సాయుధ దళాలు మాతో వస్తాయని మాకు సమాచారం ఇచ్చారు’’ అని వివరించారు.
భయపడ్డారు..
‘‘నేను ఉంటున్న భవనం ఒక్కసారిగా కంపించింది. బయట భారీగా పేలుడు శబ్ధాలు వినిపించాయి. నేను బయటకు పరుగెత్తాను. అప్పటికే అక్కడ అందరూ ఉన్నారు.
ఎయిర్ ఫోర్స్ విమానాలు అన్ని దిశల్లో ఎగురుతున్నాయి. నేను నా గదికి వచ్చాను. తరువాత కొన్ని వార్తలు చూశాను. ఇరాన్, ఖతార్ లోని అమెరికా బేస్ లే లక్ష్యంగా దాడి చేసిందని తెలిసింది’’ అని దాడులు జరిగిన క్షణాన్ని గుర్తు చేసుకుంటూ దోహాలో నివసిస్తున్న నౌషాద్ అనే మలయాళీ అన్నారు.
‘‘నాకు హింస అంటే ఇష్టం ఉండదు. నేను కనీసం పబ్ జీ కూడా ఆడను. అయినప్పటికి ఇది నన్ను కదలించింది. అన్ని యుద్ధాలు త్వరలో ముగిసిపోవాలి. క్షిపణి భవనాలను తాకినట్లు అయితే కుటుంబాన్ని పోషించడానికి వచ్చిన వలసదారుడు కచ్చితంగా చనిపోయే ఉండేవాడు’’ అని నౌషాద్ అన్నారు.
విమానాశ్రయాల మూసివేత..
ఖతార్ లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో అక్కడ గగనతలం మూసివేశారు. ఖతార్ లో చాలాకాలంగా కేరళ ప్రజలు నివసిస్తున్నారు. ఇది వారిపై తక్షణ ప్రభావం చూపింది. ఈ షాక్ తో వారంతా విలవిలలాడారు. ఈ దాడి విషయం క్షణాల్లో అంతా వ్యాపించిపోయింది.
అమెరికా తన అణు కేంద్రాలపై చేసిన దాడికి ప్రతీకారంగా తాము దాడులు చేసినట్లు టెహ్రాన్ ప్రకటించింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఖతార్ తన గగనతలాన్ని మూసివేసింది.
బహ్రెయిన్ కూడా ఇదేబాటలో ప్రయాణించింది. ఈ మూసివేతతో అంతర్జాతీయ విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అత్యధికంగా విమానాలు ప్రయాణించే కారిడార్లలో ఇది ఒకటి.
విమానాశ్రయాల్లో గందరగోళం..
సోమవారం రాత్రి కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో గందరగోళం మొదలైంది. రాత్రి పదిగంటల ప్రాంతంలో కొచ్చిన్ కు ఖతార్ ఏటీసీ సమాచారం అందించింది. విమానరాకపోకలపై ప్రభావం పడుతుందని తెలిపింది. కొన్ని విమానాలు ఖతార్ నుంచి దారి మళ్లించారు.
‘‘కొచ్చిన్ నుంచి సాయంత్రం 6.53 గంటలకు బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ఖతార్ నుంచి మస్కట్ కు దారి మళ్లింది. అర్థరాత్రి దోహకు షెడ్యూల్ చేసిన మరో విమానం రద్దు చేశారు.
2.53 కు రావాల్సిన ఖతార్ విమానం చాలా ఆలస్యంగా చేరుకుంది. తరువాత తిరుగు ప్రయాణం పై ఈ ప్రభావం పడింది. ఎయిర్ అరేబియా, కొచ్చిన్, అబుదాబి విమాన సర్వీసులు కూడా చాలా ఆలస్యంగా నడిచాయి’’ అని సీఐఏఎల్ ప్రకటన తెలిపింది. ఫ్లైట్ రాడార్ ప్రకారం.. రాత్రి పది గంటలను బహ్రెయిన్ కు బయల్దేరిన విమానం కూడా వెనక్కి తిరిగి వచ్చింది.
చాలాసేపు వేచిచూసిన..
కేరళ విమానాశ్రయాల్లో ముఖ్యంగా కొచ్చిన్, కోజికోడ్ అలాగే దోహాలోని కేరళ ప్రయాణికులు చాలాసేపు వేచి ఉన్నారు. విమాన రాకపోకల గురించి స్పష్టమైన సమాచారం లేకపోవడం దీనికి కారణం.
చాలామంది చెక్ ఇన్ అయ్యే ఉన్నారు కానీ విమానప్రయాణం రద్దు అయింది. తిరిగి ఎప్పుడూ ఇవి ప్రారంభిస్తారో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
ఇరాన్ హమీ ఓదార్పునివ్వదు..
పశ్చిమాసియాలోని అతిపెద్ద అమెరికన్ వైమానిక స్థావరం అయిన ‘అల్ఉదీద్’ ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులకు పాల్పడింది. ఈ ఆపరేషన్ లో పౌరులను, ఖతార్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోలేదని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ శాఖ అధికారుల ప్రకారం.. ఖతార్ తమ సోదరదేశం, ఈ దాడి మాత్రం సైనిక ప్రతీకారంలో భాగంగా చేశామని చెప్పారు.
అయితే ఈ హమీలు ఖతార్ లో ఉన్న ప్రజలు ముఖ్యంగా ప్రవాస భారతీయులకు ఎలాంటి ఒదార్పునివ్వలేదు. అలాగే దాడుల వల్ల ఖతార్ లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు రాలేదు.
కాకపోతే గగనతలాన్నిమాత్రం మూసివేశారు. ముందుగా పౌర విమానాలు నిలిపివేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్లిప్పుల ప్రకారం.. దోహ మీదుగా సైనిక విమానాలు ఎగరడం తరువాత ఆకాశంలో భారీ మెరుపులు, పేలుల్లు కనిపించాయి.
ఖతార్ అధికారికంగా ఈ మిస్సైల్ ను అడ్డుకున్నట్లు చెప్పనప్పటికీ, అవి స్థానికుల కళ్లముందే కనిపించడం అందరిని భయపడేలా చేసింది.
ఖతార్ తో సంబంధాలు...
ఖతార్ లో దాదాపు ఏడులక్షల మంది భారతీయులు ఉన్నారు. ఇందులో దాదాపు మెజారిటీ మలయాళీలే. ఖతార్ దశాబ్దాలుగా కేరళీయులకు ఇష్టమైన గమ్యస్థానంగా ఉంది. నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, రిటైల్, లాజిస్టిక్స్, గృహ పనులు వంటి రంగాలలో వీరి ఉనికి కనిపిస్తుంది. కేరళకు ఇక్కడి నుంచి గణనీయమైన రెమిటెన్స్ లు అందుతున్నాయి.
ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం అధికారులు మాత్రం భారత పౌరులు ప్రశాంతంగా ఉండాలని, అధికారిక సమాచారం మాత్రమే స్వీకరించాలని ఓ ప్రకటన విడుదల చేశారు. దోహ, మనామాలో ఉన్న భారత మిషన్లు పరిస్థితిని ఎప్పటికప్పుడూ గమనిస్తున్నాయి.
కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్(కేఎంసీసీ) దోహ మలయాళీ సమాజం వంటి కమ్యూనిటీ సంస్థలు ముఖ్యంగా ఆన్ లైన్ బుకింగ్ సేవలు లేదా యజమాని కమ్యూనికేషన్ అందుబాటులో లేని ప్రయాణీకులు, కార్మికులకు సహాయం అందించడానికి సిద్దంగా ఉన్నాయి. పరిస్థితిని నావిగేట్ చేయడానికి ప్రజలకు సాయం అందించడానికి హెల్ప్ లైన్లు చురుకుగా ఉన్నాయి.
సానుకూలంగా ఉన్న ప్రవాసులు..
కేరళలో నాన్ రెసిడెంట్ కేరళీయుల వ్యవహారాల విభాగం వారు భారత దౌత్య కార్యకలాపాలతో సంప్రదింపులు జరుపుతున్నారని, గగనతల, ప్రయాణ అప్ డేట్ లను ట్రాక్ చేస్తున్నట్లు ధృవీకరించారు.
అమెరికా, గల్ఫ్ కౌన్సిల్ ప్రతిస్పందనను బట్టి చూస్తే పరిస్థితి సాధారణంగా ఉందని చెబుతున్నారు. అయితే ఇంకా పౌర విమానయాన సంస్థలకు అనుమతి మాత్రం ఇవ్వలేదు. ఇదే కాస్త గందరగోళంగా ఉంది.
‘‘క్షిపణదాడి కేవలం 15-20 నిమిషాలు మాత్రమే కొనసాగాయి. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి తిరిగి వచ్చినట్లు కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య ప్రత్యక్ష శత్రుత్వం లేనందున భయపడాల్సిన అవసరం లేదు.
భయాన్ని రేకేత్తిస్తున్నది టీవీ ఛానెల్లే. గగనతలం త్వరలో ఒపెన్ చేస్తారని నేను నమ్ముతున్నా’’ అని దోహాలో నివసిస్తున్న త్రిస్సూర్ స్థానికుడు శివప్రసాద్ అన్నారు.
అయితే చాలామంది మలయాళీలు ఇప్పటికే చాలా అనిశ్చితంగానే ఉంటున్నారు. ఇంటికి వెళ్లాలా లేక పని చేయడానికి వెళ్లాలో తేల్చుకోలేకపోతున్నారు. ఇది ఎంతకాలం ఉంటుందో తెలియక భయపడుతున్నారు. విమానాశ్రయాల్లో చాలామంది చిక్కుకుని ఉన్నారు. వారి పరిస్థితి కూడా ఆగమ్య గోచరంగా ఉంది.
ప్రస్తుతం దోహలో పనిచేస్తున్న త్రిస్సూర్ నివాసి ఒకరు వాట్సాప్ వాయిస్ నోట్ పంపారు. ‘‘మనం ఇంతకుముందు కూడా యుద్దాలను చూశాం. కానీ విమాన ప్రయాణాలు నిలిపివేసినప్పుడే ఇంటికి దూరంగా ఉన్నట్లు అనిపిస్తోంది’’ అని చెప్పారు.


Tags:    

Similar News