
TIrumala | తిరుమల శ్రీవారికి భక్తులకు 'తపాలా'నుబంధం
కోట్లాది మంది భక్తులకు ఏడుకొండలవాడికి మధ్య భక్తి వారధి పోస్టల్ శాఖ
యాత్రికులు, తిరుమల శ్రీవారి హుండీ మధ్య తపాలశాఖ అనుసందానకర్తగా నిలిచింది. శ్రీవారి హుండీ, టీటీడీ తొమ్మిది ట్రస్టుల (TTD 9 Trust's )కు కూడా యాత్రికులు ఈఎంఓ 'eMO' ( మనియార్డర్) ద్వారా విరాళాలు అందింవచ్చు. దీనికోసం తపాలా శాఖ (indian post's) "ఆశీర్వచనం" అనే పథకం ద్వారా మనీయార్డర్ పంపించే సేవలు అందిస్తోంది.
తిరుమల తోపాటు దేశంలోని మూడు ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన కియోస్క్ మిషన్ల (Kiosk machines) ద్వారా విరాళం అందించవచ్చు. ఈ యంత్రాల్లో క్యూఆర్ కోడ్ (QR code) ఆండ్రాయిడ్ మొబైల్ లో స్కాన్ చేసి శ్రీవారి హుండీకి విరాళం ఇవ్వవచ్చు.
"2024 డిసెంబర్ చివరిలో ప్రారంభించిన కియోస్క్ మిషన్లకు స్పందన బాగుంది" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు స్పష్టం చేశారు.
టీటీడీకి యాత్రికుల మధ్య తపాలా శాఖ అనుసంధానకర్తగా ఎలా నిలిచిందంటే..
తిరుమల శ్రీవారి హుండీకి ఈఎంఓ 'eMO' కానుకలు పంపించవచ్చు. ఒకేసారి రూ. పది వేలు పంపించడానికి మాత్రమే ఆస్కారం ఉంటుంది.దీనికి తపాలా శాఖ రూ. 500 కమిషన్ తీసుకుంటుంది. మనీయార్డర్ ఎలా పంపాలో తెలుసుకుందాం..
టీటీడీ నిర్వహించే ట్రస్టులకు తపాలా శాఖ ఆశీర్వచనం అనే పథకంతో అనుసంధాన కర్తగా మారింది. ఈ పథకంలో తపాలాశాఖ యాత్రికుల నుంచి కానుకలు పంపించడానికి టిటిడితో ఒప్పందం కుదుర్చుకుంది.
"గతంలో ఐదు వేల రూపాయలు మాత్రమే పంపించడానికి వెసులుబాటు ఉండేది. ఆ మొత్తాన్ని 10 వేల రూపాయలకు పెంచారు" అని తిరుపతిలోని ఓ పోస్టుమాస్టర్ చెప్పారు.
1. ఏ పోస్ట్ ఆఫీస్ లో అయినా ఈఎంఓ eMO 'ఫారం తీసుకోవాలి.
2. మనీ ఆర్డర్ అడ్రస్
కార్యనిర్వహణాధికారి,
తిరుమల తిరుపతి దేవస్థానం
తిరుపతి. పిన్ 517501 నెంబర్. రాయాలి.
2. eMO ఫారంలో ఎంత విరాళం పంపిస్తున్నారనేది నమోదు చేయాలి. ఆ దరఖాస్తులో విరాళం పంపించే వ్యక్తి అడ్రస్, పిన్ కోడ్ (PIN Code) తో సహా నమోదు చేయాలి.
3. టీటీడీ నిర్వహిస్తున్న తొమ్మిది ట్రస్టుల్లో దేనికి పంపుతున్నారు అనేది స్పష్టం చేయాలి.
4. టీటీడీ నిర్వహించే తొమ్మిది ట్రస్టుల్లో ఒకటి ఎంచుకోవాలి. ఆ దరఖాస్తులలో ఆ సంఖ్య (కోడ్ నంబర్) నమోదు చేయాలి.
5. ఒక యాత్రికుడు గరిష్టంగా 10,000 వరకు పంపడానికి వెసులుబాటు ఉంది. ఈ మొత్తం పంపించాలంటే తపాలా శాఖ 500 రూపాయలు కమిషన్ గా తీసుకుంటుంది. ఆ తరువాత
టీటీడీ నుంచి సమాధానం
1. యాత్రికుడు పంపిన మొత్తం అందిన వెంటనే టీటీడీ నుంచి ఒక రసీదు పోస్ట్మాన్ ద్వారా అందుతుంది.
2. కొన్ని రోజులకు మనీ ఆర్డర్ ద్వారా విరాళం పంపిన భక్తుడికి టీటీడీ ముద్రించిన రసీదు కార్డు వస్తుంది.
3. స్వామి అమ్మవారు ఉన్న ఫోటో, అక్షింతలు కవర్ లో పంపిస్తారు. ఇలా 'ఈఎంఓ' ద్వారా శ్రీవారి హుండీకి విరాళం పంపడానికి అవకాశం ఉందని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు తెలిపారు.
Next Story

