
నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టులోకి మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని తీసుకుని వెళతున్న పోలీసులు
YSRCP | నెల్లూరు జైలుకు మాజీ మంత్రి కాకాణి
క్వార్ట్జ్ అక్రమ రవాణా కేసులో 14 రోజులు రిమాండ్ విధించారు. వెంకటగిరి మెజిస్ట్రేట్ సోమవారం ఆ మేరకు తీర్పు చెప్పారు.
నెల్లూరు జిల్లాకు చెందిన వైసిపి మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డికి వెంకటగిరి మున్సిఫ్ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మేజిస్ట్రేటు విష్ణువర్మ సోమవారం తీర్పు చెప్పారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉండగా క్వార్ట్జ్ ఖనిజం అక్రమంగా తరలించడం తోపాటు అనుమతి లేకుండా పేలుడు పదార్థాలు వాడారని ఉపయోగాలపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఈ కేసులో మాజీ మంత్రి గోవర్ధనరెడ్డిని A-4 నిందితుడిగా ఎఫ్ఐఆర్లో చేర్చారు.
ఈ వ్యవహారం తరువాత మాజీ మంత్రి గోవర్ధనరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విచారణకు హాజరు కాలేదు. అరెస్టు చేస్తారనే ఆందోళనతో మాజీ మంత్రి కాకాణి దాదాపు రెండు నెలలకు పైగానే అజ్ఞాతంలో ఉన్నారు. అదే సమయంలో ముందస్తు అరెస్టు నుంచి తప్పించుకోవడం, ముందస్తు బెయిల్ బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలకు ఆయనకు కోర్టులో చుక్కెదురైంది. ఇలా ఉండగా
నెల్లూరు జిల్లా పోలీసులు అజ్ఞాతంలో ఉన్న కాకాణి గోవర్ధనరెడ్డి కోసం విస్తృతంగా గాలించారు. బెంగళూరు సమీపంలోని ఓ పల్లెటూరు రిసార్ట్లో ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేశారు. అదే రోజు రాత్రికి ఆయనను నెల్లూరుకు తరలించి, జిల్లా పోలీస్ శిక్షణ కార్యాలయంలో విచారణ చేశారు. సోమవారం వేకువ జామున నెల్లూరు పట్టణానికి సమీపంలోనే ఉన్న వెంకటాచలం ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.
భారీ బందోబస్తుతో..
నెల్లూరు నుంచి దాదాపు 19 వాహనాల కాన్వాయ్ తో పోలీసులు మాజీ మంత్రి కాకాణిని వెంకటగిరి మునిసి మెజిస్ట్రేట్ కోర్టుకు తీసుకొని వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు కోర్టులో జడ్జి విష్ణువర్మ ముందు హాజరు పరిచారు. నిందితుడిగా ఉన్న కాకాని పక్షాన నెల్లూరు నగరానికి చెందిన క్రిమినల్ లాయర్ విజయకుమార్, వెంకటగిరి కి చెందిన న్యాయవాదులు వాదనలు వినిపించారని తెలిసింది.
రూ. వందలకోట్ల ఖనిజం అక్రమంగా రవాణా చేయడం అనే కేసుతోపాటు, నిందితుడు మాజీ మంత్రి కాకాణిపై ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టంపై కూడా. కేసు విచారణలో ఉన్నందున జడ్జి బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రిలో ఆరోగ్య పరీక్ష అనంతరం నెల్లూరు సెంట్రల్ జైలకు (Nellore Central Jail) తరలించారు.
ఆంక్షలు ఉన్నా..
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని వెంకటగిరి కోర్టుకు తీసుకురావడానికి ముందే ఆంక్షలు విధించారు. పట్టణంతోపాటు కోర్టు, సమ్మిక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. తమ పార్టీ నాయకుడిని అరెస్టు చేశారనే సమాచారంతో వైసిపి శ్రేణులు భారీగా తరలివచ్చాయి.
నెల్లూరు నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వైసిపి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతి వైసీపీ ఎంపీ మద్దెల గురుమూర్తి, వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు తరలివచ్చారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ని కోర్టులో హాజరు పరిచిన తర్వాత సుమారు మూడు గంటల పాటు వాదనలు జరిగినట్టు సమాచారం. విష్ణు వర్మ తీర్పు వెలువరించిన తర్వాత మాజీ మంత్రి కాకాణి నీ మధ్యాహ్నం 3.50 గంటలకు కోర్టు నుంచి బయటికి తీసుకువచ్చారు. ఆరోగ్య పరీక్షల తర్వాత ఆయనను నెల్లూరుకు తరలించే సమయంలో నాయకులు కూడా వాహనాల్లో వెంట వెళ్లారు.
Next Story