YCP |కూటమికి కౌంట్ డౌన్ స్టార్ట్  అంటున్న ఆర్కే రోజా..
x
బుక్ లెట్ విడుదల చేస్తున్న వైసీపీ నేతలు ఆర్కె. రోజా, భూమన కరుణాకరరెడ్డి, మేయర్ శిరీష మ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం

YCP |కూటమికి కౌంట్ డౌన్ స్టార్ట్ అంటున్న ఆర్కే రోజా..

పదవులతో సంతృప్తి పడిన పవన్ కళ్యాణ్ మూలన కూర్చున్నారని వైసిపి అధికార ప్రతినిధి రోజా సెటైర్లు వేశారు.


రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం హనీమూన్ ముగిసిందని మాజీ మంత్రి, వైసిపి అధికార ప్రతినిధి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. సూపర్ సిక్స్ హామీల అమలులో వైఫల్యం, అక్రమ కేసుల నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, టిడిపి కూసాలు కదిలేలా ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామని ఆమె హెచ్చరించారు.

కూటమి ఏడాది పాలనపైలో వైఫల్యాలపై 'జగన్ అంటే నమ్మకం. చంద్రబాబు అంటే మోసం' అనే పుస్తకాన్ని ఆదివారం తిరుపతిలో చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి ఆర్కే రోజా ఆవిష్కరించారు. వైసిపి ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రమణ్యం, భరత్, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సునీల్ కుమార్, విజయానంద రెడ్డి, నూకతోటి రాజేష్ తో కలిసి మాజీ మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం పై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. "ఎమ్మెల్యే అయ్యాను. డిప్యూటీ సీఎం పదవితో సంతృప్తి పడి మూలన కూర్చున్నారు" అని ఆర్కే రోజా విమర్శించారు.
"రాష్ట్రంలో దేవాలయాల ధ్వంసం చేస్తున్నారు. ఆ స్థలాలను ఆక్రమించే స్థాయికి నాయకులు పెరిగిపోయారు" అని ఆరోపించిన మాజీ మంత్రి ఆర్కే రోజా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి సనాతన యోగి ఏమయ్యారో అర్థం కావడం లేదని ఆమె వ్యంగ్యాస్త్రాలు స్పందించారు.
సుపరిపాలన అందిస్తామంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సూపర్ సిక్స్ పథకాలకు ఎగనామం పెట్టారని రోజా ఆరోపించారు. ఎల్లో బుక్ మేనిఫెస్టో పక్కన పెట్టేసి, రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ ఆరోపణలను పునరుద్ఘాటించారు. 1,60 వేల కోట్ల అప్పు చేయడం సుపరిపాలనకు చిహ్నమా అని ఆమె ప్రశ్నించారు.
"సిబిఎన్ (చంద్రబాబు నాయుడు) పేరును కొత్తగా నిర్వచించారు. సి అంటే చీటింగ్, బి అంటే బాదుడు, ఎన్ అంటే నేరాలు" అని ఆర్కే రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రిజిస్ట్రేషన్ రేషన్ చార్జీలు పెంచడం, విద్యుత్ చార్జీలో బాదుడే ఇందుకు నిదర్శనమని ఆమె ఉదహరించారు.
టిడిపి కూటమిలో వేధింపులు, అక్రమ కేసులు, హామీలు అమలు చేయకపోవడం వంటి విధానాలు పెరిగిపోయాయని రోజా విమర్శించారు. ఇక టిడిపి కుసాలు కదిలేల ప్రజల పక్షన పోరాటాలు ఉంటాయని ఆమె హెచ్చరించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలను వంచనకు గురి చేసిందని ఆరోపించారు. వైసీపీ పాలనలో రెండు లక్షల 80 కోట్ల రూపాయలు డిబిటి రూపంలో ప్రజలకు నేరుగా అందించాం. వైఎస్. జగన్ కంటే ఎక్కువగా రెండున్నర లక్షల కోట్లు ఇస్తామని చెప్పిన టిడిపి కూటమి ప్రజలను భ్రమింప చేశారని కరుణాకరరెడ్డి విమర్శించారు.
టీడీపీ కూటమి సూపర్ సిక్స్ లో 2.7 లక్షల మంది మహిళలకు నెలకు ఒక్కొక్కరికి 1500 రూపాయల కూడా ఇవ్వకుండా మోసం చేశారని ఆయన గుర్తు చేశారు. ఈసారి కూడా నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామని మాట తప్పారని ఆయన ఆరోపించారు. తల్లికి వందనం లో కూడా 30 లక్షల మందికి అన్యాయం చేశారన్నారు. రైతు భరోసాల కూడా టిడిపి కూటమి మాట తప్పిందనీ, ఇలా ఏడాది మొత్తం మోసాలు అభూత కల్పనలతో పాలన సాగించారని కరుణాకర్ రెడ్డి విమర్శించారు.
Read More
Next Story