
YCP - Nelloore | వెంకటగిరి కోర్టుకు వైసిపి మాజీ మంత్రి కాకాణి
మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని అరెస్టు చేశారనే విషయం తేలిపోయింది. కొద్దిసేపటిలో (సోమవారం) వెంకటగిరి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నారు.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని అరెస్టు చేశారు. కొద్దిసేపటిలో (సోమవారం) వెంకటగిరి మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచనున్నారు. దీంతో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు పోలీస్ స్టేషన్ లో తెల్లరంగు qurtz ఖనిజం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి ఏ-4 నిందితుడిగా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అరెస్టు చేస్తారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఏడు పోలీసు బృందాలు ఆయన కోసం తీవ్రంగా గాలింపు చేపట్టాయి. ఎట్టకేలకు బెంగళూరు సమీపంలోని ఓ మారుమూల గ్రామంలో రిసార్ట్లో ఉన్న ఆయనను నెల్లూరు పోలీసులు ఆదివారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు.
నెల్లూరులో విచారణ
ఆదివారం రాత్రి మాజీ మంత్రి కాకాణిని నెల్లూరు పోలీసు కేంద్ర కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. రాత్రి జిల్లా సీనియర్ పోలీస్ అధికారుల పర్యవేక్షణలో ఆయనను విచారణ చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత, నెల్లూరు సమీపంలోని వెంకటాచలం ప్రభుత్వాసుపత్రిలో సోమవారం వేకువజామున మూడు గంటల ప్రాంతంలో మాజీమంత్రి కాకాణిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత కాకాణి పై ఉన్న కేసులు సంబంధించి రికార్డులు మొత్తం సిద్ధం చేసిన తర్వాత నెల్లూరు జిల్లా వెంకటగిరి (ప్రస్తుతం తిరుపతి జిల్లా) కోర్టులో హాజరుపరచడానికి రంగం సిద్ధం చేశారు.
భారీ బందోబస్తు..
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలానికి సంబంధించిన కేసులు గూడూరు న్యాయస్థానంలో విచారణ చేస్తారు. ఇక్కడి జడ్జి సెలవులో ఉన్నారు. దీంతో ఇన్చార్జిగా వెంకటగిరి మున్సిఫ్ కోర్టు జడ్జి విష్ణువర్మకు అప్పగించడం వల్లే ఈ జడ్జి ముందు హాజరు పరచనున్నారు.
వెంకటగిరి పట్టణంతోపాటు కోర్టు పరిసర ప్రాంతాలలో కూడా 144 సెక్షన్ విధించారు. ఓ డిఎస్పి సారధ్యంలో సిఐలు, ఎస్ఐలతో పాటు భారీగా పోలీసులను ఇక్కడ మోహరించారు. వైసీపీ శ్రేణుల నుంచి ఆటంకాలు ఎదురు కాకుండా, నివారించడానికి పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నట్లు కనిపిస్తోంది.
ఇదీ కేసు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి టన్నులకొద్దీ క్వార్జ్ ఖనిజాన్ని తరలించారనేది మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై ఉన్న అభియోగం. మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీ పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మైనింగ్ చేయడానికి అనుమతులు లేకుండానే పేరుడు పదార్థాలు కూడా వినియోగించారని నాయక్ తన ఫిర్యాదులో ప్రస్తావించారు. మైనింగ్ జరగకుండా ప్రశ్నించిన గిరిజనులు కూడా బెదిరించారన్నారు. ఈ కేసులో మాజీ మంత్రి కాకాణిప్ గోవర్ధన్ రెడ్డి A-4 నిందితుడిగా ఉన్నారు. ఆయనపై 120 బి, 129, 220, 447, 427, 379, వై నాట్ సిక్స్ సెక్షన్లతో పాటు పేలుగు పదార్థాల వినియోగంపై యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేశారు.
కాకాణికి సంబంధం లేదు..
మైనింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డికి ఏమాత్రం సంబంధం లేదని వైసీపీ ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆదివారం రాత్రి మీడియాతో అన్నారు.
" ఎవరో ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా కాకాణిని అరెస్టు చేయడం దుర్మార్గం. అరెస్టు చేశాక సమాచారం కూడా తెలియకుండా గోప్యంగా ఉంచడం చట్ట విరుద్ధం అని ఆయన అన్నారు. ఇదే పద్ధతి కొనసాగిస్తే, మళ్లీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ విధంగా వ్యవహరిస్తే ఒక్క ఎమ్మెల్యే కూడా . బయట తిరగలేరు" అని ఆయన హెచ్చరించారు.
Next Story