శపథం సాకారం..  సీఎం హోదాలో అసెంబ్లీలోకి...
x

శపథం సాకారం.. సీఎం హోదాలో అసెంబ్లీలోకి...

"సీఎం అయ్యాకే.. అసెంబ్లీలో అడుగుపెడతా" ఎన్. చంద్రబాబు చేసిన శపథం ఇది. ఆయన కలను పార్టీ శ్రేణులు, ఓటర్లు సాకారం చేశారు. రెండున్నరేళ్ల తరువాత ఆయన సీఎం హోదాలో అసెంబ్లీలో పాదం మోపారు.


"ఇది గౌరవ సభ కాదు. కౌరవసభ. మళ్లీ సీఎం అయ్యేవరకు శాసనసభలో అడుగుపెట్టను"

అని విపక్ష నేతగా టిడిపి చీఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు చేసిన భీషణ ప్రతిజ్ఞ ఇది.
ఆంధ్ర రాష్ట్ర ఓటర్లు అందించిన చారిత్రక విజయంతో, సీఎం హోదాలో ఎన్ చంద్రబాబు నాయుడు ఇంకొద్ది సేపట్లో అసెంబ్లీలో పాదం మోపారు.
2004 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి కూటమికి అఖండ మెజారిటీ అందించిన విషయం తెలిసిందే. భారీ మెజార్టీ ఇవ్వడంతో పాటు అసెంబ్లీ స్థానాలను కూడా ఆయన పార్టీకే అంకితం చేశారు. దీంతో ఆయన ప్రతిజ్ఞ సహకారం అవుతున్న నేపథ్యంలో సీఎంగా మళ్ళీ అసెంబ్లీలోకి పాదం మోపారు. గతంలో ఏం జరిగింది...
అది 2021 నవంబర్ 9
రాష్ట్ర శాసనసభలో "మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. " రిప్లై స్టేట్మెంట్ ఇవ్వడానికి కూడా అనుమతించరా? ఇది గౌరవ సభ కాదు. కౌరవ సభ. మళ్లీ సీఎం అయ్యేవరకు సభలో అడుగుపెట్టను"
-- టిడిఎల్పీ నాయకుడు ఎన్ చంద్రబాబు నాయుడు చేసిన భీషణ ప్రతిజ్ఞ ఇది.
ప్రస్తుత ఎన్నికల్లో విజయం సాధించడానికి మీద పడిన వయసును కూడా ఖాతరు చేయని స్థితిలో టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు అవిశ్రాంతంగా ప్రచారం సాగించారు. ఆయనను కుప్పంలో ఓడించాలని మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి తో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన అనుచరగణాన్ని కుప్పంలో మోహరింపజేశారు. కుప్పంలో చంద్రబాబును విపరీతంగా ఆదరించే ఓటర్ల ముందు అధికార పార్టీ నాయకుల ఎత్తున ఏమాత్రం పారలేదని విషయం ఓట్ల లెక్కింపు లో తేలిపోయింది. దాదాపు 46 వేల ఓట్లతో చంద్రబాబు కుప్పం నుంచి ఎనిమిదోసారి విజయం సాధించారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175 స్థానాలు ఉంటే మ్యాజిక్ ఫిగర్ సాధించడానికి 86 సీట్లు అవసరం అవుతాయి. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైయస్ఆర్సీపీ 175 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది. కూటమిలో భాగస్వామి అయిన టిడిపి 144 అసెంబ్లీ స్థానాల్లోనూ, జనసేన పార్టీ 21, బిజెపి 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. ఇందులో టీడీపీ 135 అసెంబ్లీ స్ధానాల్లో విజయం సాధించింది. కూటమిలోని జనసేన పార్టీ 21 స్థానాలు వైఎస్ఆర్ సీపీ 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది.
హోరాహోరీగా ప్రచారం
2024 సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా మారాయి. బిజెపి - జనసేన - టిడిపి కూటమికి అధికారంలోకి రావడానికి 74 వయసులోనూ.. చంద్రబాబు నాయుడు చురుగ్గా ప్రచార ఘట్టాన్ని సాగించారు. " జగన్ అహంకారానికి- తెలుగు ప్రజల ఆత్మ అభిమానానికి మధ్య జరుగుతున్న ఘర్షణ ఇది" అని టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రజలు, యువతకు కర్తవ్య బోధ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడమే లక్ష్యం
కూటమిలోని మిత్రపక్షం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ " కూడా అప్పటి అధికార వైఎస్ఆర్ సీపీపై ఘాటుగానే స్సందించారు. " ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే నా ముందున్న లక్ష్యం. అరాచక ప్రభుత్వాన్ని సాగనంపడానికి జనసేన ఓట్లను చీలనివ్వను" అని పవన్ కళ్యాణ్ విస్పష్టంగా ప్రకటించారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టడమే కాదు. ప్రజల ఈతి బాధలను నెరవేర్చడానికి చిత్తశుద్ధితో పని చేస్తాం" అని కూడా ఆయన చెప్పారు. వీరిద్దరి ప్రకటనలు ఐక్యతను చాటాయి. ఇందుకు బలమైన కారణం..
చంద్రబాబు ఎం దుకు ప్రతిజ్ఞ చేశారు..
రాష్ట్ర శాసనసభలో వైఎస్ఆర్ సీపీలో ఆనాడు మంత్రులుగా ఉన్న కొడాలి నాని తోపాటు ఆ పార్టీకి అసోసియేట్ మెంబర్ వల్లభనేని వంశీ తదితరులు టిడిపి విపక్ష నేత ఎన్. చంద్రబాబు నాయుడును వ్యక్తిత్వ హననం చేసే విధంగా మాటలతో తూలనాడారు. చివర చివరికి ఆయన సతీమణి నారా భువనేశ్వరి పేరును కూడా ప్రస్తావించి మాట్లాడడం తీవ్ర సంచలనం రేకెత్తించింది.
తీవ్ర అవమాన భారంతో చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. " ఇది గౌరవ సభ కాదు కౌరవుల సభ" ఇంతటి అవమానాలు భరించడం నేను ఊహించలేదు. "ఛాలెంజ్ చేసి చెబుతున్నా, మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలోకి అడుగు పెడతా" అని సహచర సభ్యులతో కలిసి బయటికి వెళ్లిపోయారు.
ఆ మరుసటి రోజు కూడా టిడిపి ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు కన్నీటి పర్యంతం అయ్యారు. ఇది బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత కూడా ఆయనను స్కిల్ డెవలప్మెంట్ స్కాం జరిగిందంటూ అరెస్టు చేసి జైలు పాలు చేశారు. దీంతో టీడీపీ గ్రాఫ్ బాగా పెరిగింది. వైఎస్ఆర్ సీపీ పాలనలో పరిస్థితిని ఓటర్లకు పరిస్థితి విడమరచడంలో టీడీపీ కూటమి నేతలు, శ్రేణులు సఫలమయ్యారు. అందుకు ప్రతిఫలంగానే, ఆంధ్ర రాష్ట్ర ఓటర్లు టిడిపికి కూటమిని ఆదరించాయి.
ఆనాడు జయలలిత ఛాలెంజ్
1989 మార్చి 25న తమిళనాడు అసెంబ్లీలో ఓ అంశంపై చర్చ జరిగే సమయంలో అప్పటి సీఎం ఎం. కరుణానిధి సభలో లేరు. ఈ విషయాన్ని అప్పటి ప్రతిపక్ష నాయకురాలు అన్నా డీఎంకే అధ్యక్షురాలు జే. జయలలిత నిలదీశారు. దీంతో ఆగ్రహానికి గురైన డిఎంకె సభ్యుల్లో ఒకరు జయలలిత కొంగు లాగడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో ఆమె" మళ్లీ సీఎం అయ్యేవరకు అసెంబ్లీలో పాదం మోపను" అని జయలలిత ప్రతిజ్ఞ చేశారు. ఆ మాటపై నిలబడిన ఆమె 1996 ఎన్నికలు అఖండ విజయం సాధించి సీఎంగా అసెంబ్లీలో పాదం మోపారు.
ఆంధ్రాలో వైఎస్. జగన్
2014లో జరిగిన విభజిత రాష్ట్ర ఎన్నికల్లో టిడిపి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 67 సీట్లతో వైఎస్ఆర్సిపి ప్రతిపక్షానికి పరిమితమైంది. వివిధ రాజకీయ కారణాలు వ్యవహారాలతో 23 మంది వైఎస్ఆర్సిపి సభ్యులు టిడిపిలో చేరారు. వారిలో కొందరు మంత్రులు కూడా అయ్యారు. ఆ ఎమ్మెల్యేలపై అప్పటి స్పీకర్ కోడెల శివప్రసాదరావు చర్యలు తీసుకోకపోవాదాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష నేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి 2017 నవంబర్ 25న " మళ్లీ సీఎం అయ్యేవరకు శాసనసభలోకి అడుగుపెట్టను" అంటూ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన ఆయన పాదయాత్ర నిర్వహించారు. 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాలతో సంచలన విజయం సాధించి సీఎం అయ్యారు.
ఇప్పడు చంద్రబాబు
2019 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ప్రతిపక్షానికి పరిమితమైంది. ఆరంభం నుంచి వైఎస్ఆర్ సీపీ సభ్యులు టిడిపిని, చంద్రబాబునాయుడుని టార్గెట్ చేస్తూ మాట్లాడిన తీరు, హద్దులు దాటి చంద్రబాబు నాయుడు సతీమణినీ కూడా వదలకుండా చేసిన వ్యాఖ్యలతో ఆయన తీవ్ర మనస్థాపం చెందారు. "ఇది గౌరవ సేవ కాదు. కౌరవుల సభగా మారింది" ప్రజా తీర్పుతో మళ్లీ గౌరవంగా సీఎం హోదాలో అడుగు పెడతా"నంటూ ప్రతిజ్ఞ చేసి ఆయన, మూడేళ్ల నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేదు.
2024 ఎన్నికల్లో టీడీపీ సారధ్యంలోని కూటిమిని ఆంధ్ర రాష్ట్ర ఓటర్లు అఖండ మెజారిటీ అందించారు. దీంతో తన ప్రతిజ్ఞ సాకారం కావడంతో మళ్లీ ఎన్. చంద్రబాబు నాయుడు సీఎం హోదాలోనే శాసనసభలోకి నేడు అడుగు పెట్టారు.
ప్రతిజ్ఞ చేయడమే కాదు. పట్టుదల, కృషి చేస్తే సాధించలేనిది లేదని విషయం నాయకులుగా వారు నిరూపించడారు. అనడంలో సందేహం లేదు. అయితే, పరిపాలనలో కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా సాగాలని ఆశిద్దాం. కానీ, ప్రస్తుతం రాజకీయ పరిస్థితి కత్తలు దూసుకునే స్ధాయిలో ఉంది. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనేది వేచిచూడాల్సిందే.
Read More
Next Story