TTD | అలిపిరి వద్ద భద్రత మరింత పటిష్టం
x

TTD | అలిపిరి వద్ద భద్రత మరింత పటిష్టం

తిరుమలకు ముఖద్వారంగా ఉన్న అలిపిరి వద్తద తనిఖీలకు ఆధునిక సదుపాయాలలో టోల్ ప్లాజా పునరుద్ధరించనున్నారు.


తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆధునిక సౌకర్యాలతో అలిపిరి టోల్ ప్లాజా పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు టిటిడి ఈఓ జె. శ్యామల రావు తెలిపారు.

తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో అలిపిరి చెక్ పాయింట్ పునరుద్ధరణ, భద్రత పెంపుపై అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈవో బుధవారం సమీక్షించారు.


అలిపిరి టోల్ ప్లాజా వద్ద ఆధునిక సౌకర్యాలు, పటిష్ట భద్రత తదితర అంశాలపై జిఎంఆర్ గ్రూప్‌కు చెందిన రాక్సా సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భక్తుల చెకింగ్, లగేజీ స్కానింగ్ కి ప్రస్తుతం తీసుకుంటున్న సమయం, దాని వల్ల వస్తున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వేగంగా వాహనాలు, లగేజీ స్కానింగ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని జీఎంఆర్ అనుబంధ సంస్థ అయిన రాక్సా సంస్థ ప్రతినిధులకు ఈఓ సూచించారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద చెకింగ్ సమయాన్ని తగ్గించేందుకు దీర్ఘకాలిక, స్వల్ప కాలిక పరిష్కార మార్గాలను సూచించాలని కోరారు. టిటిడి విజిలెన్స్ విభాగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని భక్తుల లగేజీ, వాహనాల స్కానింగ్ లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఈవో ఆదేశించారు.

అలిపిరి వద్ద తీసుకునే చర్యలు
1. తనిఖీ సమయంలో క్రాస్ ఓవర్‌లను నివారించేందుకు చర్యలు
2. లగేజ్ స్కానర్‌ల స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్కానర్లు ఏర్పాటు
3. లగేజ్ స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు లగేజ్ స్కానర్‌లను పెంచాలి
4. లగేజ్ కన్వేయర్ బెల్ట్‌ల ను పెంచి భద్రతా తనిఖీలో ఎక్కువ సమయాన్ని నివారించే అంశం పరిశీలన
5. అలిపిరి టోల్ ప్లాజాలోని చివరి రెండు భద్రతా లేన్‌లలో మరింత మంది భద్రతా సిబ్బంది నియామకం
రాబోయే రెండు దశాబ్దాల పాటు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రతా అంశాల ప్రతిపాదనలు సూచించాలని రాక్సా ప్రతినిధులను ఈఓ కోరారు. ఈ సమావేశంలో రాక్సా సీఈఓ అమిత్ దార్, టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం, సీవిఎస్వో మురళీ కృష్ణ, సీఈ సత్యనారాయణ, ఈఈ వేణు గోపాల్, ఐటీ జీఎం శ్రీ శేషారెడ్డి, వీజీవోలు శ్రీమతి సదా లక్ష్మి, శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్రఠ, అధికారులు పాల్గొన్నారు.
Read More
Next Story